ఆకతాయి పనితో ప్రజల బెంబేలు
ఓ ఆకతాయి చేసిన పనికి అటు అటవీశాఖ అధికారులు ఉరుకులు పరుగులు తీయడం.. ఇటు ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారు.
చిరుత ఉన్నట్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు
బంగారెడ్డి కండ్రిగ వద్ద చిరుత సంచరిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసిన చిత్రం
పుత్తూరు, వడమాలపేట, న్యూస్టుడే: ఓ ఆకతాయి చేసిన పనికి అటు అటవీశాఖ అధికారులు ఉరుకులు పరుగులు తీయడం.. ఇటు ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారు. వడమాలపేట మండలం బంగారెడ్డి కండ్రిగ, పుత్తూరు సమీప అంజేరమ్మ కనుమ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు ఓ ఆకతాయి వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టడంతో ఆ ప్రాంత ప్రజలు బిత్తరపోయారు. అధికారులు రంగంలోకి దిగి విచారించడంతో వాస్తవం వెలుగుచూసి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని ఏఎంపురం గ్రామానికి చెందిన యువకుడు శేషాద్రి.. బంగారెడ్డి కండ్రిగలో చిరుత సంచరిస్తున్నట్లు వాట్సాప్ గ్రూపులో రెండ్రోజుల క్రితం పోస్టు చేశాడు. అది వైరల్ కావడంతో ఆ ప్రాంత వాసులంతా భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి.. చిరుత సంచరిస్తున్నట్లు ఉన్న ఫొటోలు, వీడియోల్లో ఉన్న గుట్టలు కానీ, అటవీ ప్రాంతం గానీ.. పుత్తూరు, వడమాల ప్రాంతాల్లో లేనట్లు గుర్తించారు. దీంతో ఎవరు గ్రూపులో పోస్టు చేశారని ఆరా తీసి సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాను చిరుత సంచరిస్తున్న చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసి ఫొటోలు, వీడియోలు వైరల్ చేసినట్లు అంగీకరించాడు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరూ భయపడాల్సిన అసవరం లేదని పుత్తూరు అటవీ క్షేత్రాధికారిణి మాధవి, ఎఫ్ఎస్వో చంద్రశేఖర్రాజు తెలిపారు.
మరోవైపున వడమాలపేట మండలంలోని బాలినాయుడుకండ్రిగ పంచాయతీ పిడతలకోన సమీప పొలాల వద్ద బుట్టిరెడ్డికండ్రిగకు చెందిన పరమాత్మరెడ్డి ఆవులు, మేకలు ఉంచి నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున గుర్తుతెలియని మృగం వాటి వద్దకు రావడంతో గమనించిన రైతు టార్చి లైట్ వేసి కేకలు వేయడంతో అది పరారైంది. బాలినాయుడు కండ్రిగ సమీప గొల్లకండ్రిగలో దొరస్వామి యాదవ్కు చెందిన ఆవుదూడను గుర్తుతెలియని మృగం దాడిచేసి చంపేసిందని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది ఏ మృగమనేది తెలియాల్సి ఉందని, అయితే తమకు గ్రామ కార్యదర్శి రూపారాణి చిరుత దాడి చేసినట్లు చెప్పిందని తిరుపతి ఎఫార్వో ఆనందరెడ్డి శనివారం రాత్రి తెలిపారు. ఆదివారం ఉదయం గ్రామానికి వెళ్లి పాదముద్రలు చూశాకనే ఏ మృగమనేది నిర్ధరిస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్
[ 26-07-2024]
గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని బసినికొండ ఒకటో వార్డు ప్రజలు డిమాండ్ చేశారు. -
చెంగాళమ్మకే.. శఠగోపం!
[ 26-07-2024]
ఆంధ్ర, తమిళ భక్తుల ఆరాధ్య దైవమై.. కాళంగి నదీ తీరాన సూళ్లూరుపేటలో వెలసిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలోని ఉద్యోగులు అమ్మవారికే శఠగోపం పెట్టారు. -
బోధించకుండానే వేతనాలా..?
[ 26-07-2024]
వైకాపా పాలనలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. -
పారదర్శక పాలన అందించాం
[ 26-07-2024]
వైకాపా కుట్రలు ఫలించలేదు ్ర కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి శాంతిపురం: ‘రాజకీయాలపై ఆధారపడి.. ప్రజాధనాన్ని దోచుకోవాలని చంద్రబాబునాయుడు ఏనాడూ అనుకోలేదు -
ఈ విచారణా అంతేనా!
[ 26-07-2024]
రుయా నర్సింగ్ సూపరింటెండెంట్ అరుణమ్మపై వచ్చిన అవినీతి ఆరోపణలు.. వేధింపుల ఫిర్యాదులపై విచారణ పక్కదారి పడుతోంది. -
ఫిష్ ఆంధ్రా పేరిట మాయ
[ 26-07-2024]
మత్స్యకారుల జీవనోపాధి పథకాలపై అప్పటి జగన్ సర్కార్ కన్నెర్ర చేసింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై) కార్యక్రమానికి తూట్లు పొడిచింది. -
ఎమ్మెల్యే చెబితే వినాలా..!
[ 26-07-2024]
తమ పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారని, అక్కడి నుంచి డిప్యూటేషన్పై డీఈవో కార్యాలయానికి గతంలో వచ్చిన గుమస్తాను మళ్లీ తమకే కేటాయించాలని కోరిన బంగారుపాళ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం రాజేంద్రకు.. చిత్తూరు డీఈవో షోకాజ్ ఇచ్చిన ఘటన తాజాగా వివాదాస్పదమైంది. -
ఎట్టకేలకు లెక్క తేలింది
[ 26-07-2024]
గతేడాది ఆగస్టు 4న పుంగనూరు మండలం భీమగానిపల్లి కూడలిలో పోలీసులు- తెదేపా శ్రేణుల మధ్య జరిగిన అల్లర్ల ఘటనలో 499 మంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. -
రేటింగ్ కొట్టు..నగదు పట్టు
[ 26-07-2024]
సులువుగా నగదు సంపాదించాలనే అత్యాశ కొందరికీ చేటు తెచ్చింది. నగదు యాప్లో వచ్చే స్టార్ హోటళ్ల ప్రకటనలకు రేటింగ్ ఇచ్చి.. కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే.. రెట్టింపు నగదు వస్తుందన్న మాటలతో చాలామంది బాధితులుగా మారారు -
మళ్లించింది రూ.10 కోట్లపైనే
[ 26-07-2024]
జడ్పీ మాజీ సీఈవో ప్రభాకర్రెడ్డి హయాంలో చోటుచేసుకున్న నిధుల దుర్వినియోగం వ్యవహారం దర్యాప్తు వేగవంతమైంది.. -
రెవెన్యూ చట్టాలు తెలుసా?
[ 26-07-2024]
ఇనాం భూములే కాదు.. సర్వీసు ఇనాం భూములంటాయని తెలియదా? ఇష్టారాజ్యంగా 22(ఏ)లను తొలగించేస్తారా? వీటికి నిబంధనలున్నాయనని తెలియాదా? -
22ఏ జాబితా నుంచి..6,939 ఎకరాల తొలగింపు
[ 26-07-2024]
జిల్లాలో 22ఏ జాబితా నుంచి తొలగించిన భూములపై సమగ్ర నివేదిక సిద్ధమైంది -
సునీల్ ఎక్కడ..?
[ 26-07-2024]
పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో నిధుల స్వాహా ఉదంతంపై పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు