పులివెందుల ఫ్యాక్షన్తో కుప్పాన్ని నాశనం చేయొద్దు
ప్రశాంత కుప్పంలో పులివెందుల ఫ్యాక్షన్తో నాశనం చేయొద్దని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ అన్నారు.
వైకాపా దాడులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు
తెదేపా కార్యకర్త శేషాద్రిని పరామర్శిస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీఏ మనోహర్
కుప్పం పట్టణం, న్యూస్టుడే: ప్రశాంత కుప్పంలో పులివెందుల ఫ్యాక్షన్తో నాశనం చేయొద్దని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ అన్నారు. వైకాపా గూండాల దాడిలో గాయపడిన రామకుప్పం 89-పెద్దూరు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త శేషాద్రి కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీఏ మనోహర్ శనివారం ఆస్పత్రికి వెళ్లి శేషాద్రిని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతో వైకాపా విచక్షణ కోల్పోయి తెదేపా శ్రేణులపై తరచూ దాడులు చేయడం బాధాకరమన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఇంకా అధికారంలో ఉన్నామన్న అహంకారంతో వైకాపా మూకలు అమాయకులపై దాడులు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపాకు ఓటు వేయలేదని ఆ పార్టీ ఎంపీటీసీ, రౌడీ షీటర్ సత్య, మణి అనుచరులు 10 మంది కలిసి 89-పెద్దూరు గ్రామానికి చెందిన శేషాద్రి, శ్రీనివాస్, వెంకటేష్లపై శుక్రవారం రాత్రి దాడికి తెగబడటం హేయమని విమర్శించారు. తెదేపా కార్యకర్తలపై వైకాపా గూండాలు దాడులు చేస్తున్నా రామకుప్పం ఎస్సై వైకాపా చెప్పుచేతల్లో ఉండటం బాధాకరమన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే దాడి చేసిన ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని చెప్పారు. ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎమ్మెల్సీ భరత్ అతని అనుచరులను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఈ దాడులపై ఎన్నికల కమిషన్, రాష్ట్ర డీజీపీలకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.
దాడిని ఖండించిన తెదేపా అధినేత
రామకుప్పం మండలం 89-పెద్దూరు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త శేషాద్రిపై వైకాపా గూండాలు దాడి చేయడం అమానుషమని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. శేషాద్రి కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుప్పంలో అల్లర్లు సృష్టిస్తోన్న రౌడీ ముఠాల ఆటకట్టిస్తామని ఆయన హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల