కుప్పంలో రెచ్చిపోతున్న వైకాపా మూకలు
కుప్పం నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరు. అలాంటి చోట ఐదేళ్లుగా వైకాపా శ్రేణులు అరాచకాలకు పాల్పడ్డాయి. అడ్డు వచ్చిన విపక్ష కార్యకర్తలపై దాడులు చేయడం, ఆస్తినష్టం కలిగించడాన్ని పనిగా పెట్టుకున్నాయి. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్నాయి.
తెదేపా శ్రేణులపై వరుస దాడులు
పోలీసులు అప్రమత్తంగా ఉంటేనే ప్రశాంతంగా కౌంటింగ్ సాధ్యం
వైకాపా శ్రేణుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా కౌన్సిలర్ సెల్వం, అశోక్ (పాతచిత్రం)
- ఈ నెల 22న కుప్పం పురపాలిక ఐదో వార్డు తంబిగానిపల్లెకు చెందిన తెదేపా కౌన్సిలర్ సెల్వం, అశోక్ అనే తెదేపా కార్యకర్తపై వైకాపా కార్యకర్తలు సాయికిరణ్, యువరాజు, నాగరత్నం దుర్భాషలాడి దాడి చేశారు. తమ పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందని.. ఆ తర్వాత మీ అంతు చూస్తామని హెచ్చరించారు.
- రామకుప్పం మండలం 89.పెద్దూరులో నివసిస్తున్న తెదేపాకు చెందిన శేషప్ప, వెంకటేష్, శీనప్పపై ఈ నెల 24న వైకాపా ఎంపీటీసీ సభ్యుడు వెంకటరమణ, పంచాయతీ కన్వీనర్ మణి, నాయకుడు సత్య, మరికొందరు రాడ్లు, రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు.
- పోలింగ్ మరుసటి రోజు రామకుప్పం మండలం బూరుగుమాకులపల్లె, బల్ల గ్రామాలకు చెందిన తెదేపా కార్యకర్తలకు పంట, మోటారుకు నష్టం కలిగించారు. వైకాపా శ్రేణులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని విపక్ష కార్యకర్తలు ఆరోపించాయి.
ఈనాడు, చిత్తూరు: కుప్పం నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరు. అలాంటి చోట ఐదేళ్లుగా వైకాపా శ్రేణులు అరాచకాలకు పాల్పడ్డాయి. అడ్డు వచ్చిన విపక్ష కార్యకర్తలపై దాడులు చేయడం, ఆస్తినష్టం కలిగించడాన్ని పనిగా పెట్టుకున్నాయి. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్పై అనుమానాలున్నప్పటికీ అంతా సాఫీగా సాగింది. ఆ తర్వాత నుంచి అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి తెదేపా అధినేత చంద్రబాబుకు ఆధిక్యం పెరగడం ఖాయమని తేలడంతో ఓర్వలేక దాడులకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు వారి ఆగడాలను అరికట్టలేకపోతున్నారు. ఇదిలా కొనసాగితే కౌంటింగ్ సమయానికి కుప్పం నియోజకవర్గంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది.
వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కుప్పంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. తెదేపా శ్రేణులను లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకే వత్తాసు పలికారు. కుప్పం అర్బన్ సీఐగా పనిచేసిన శ్రీధర్ వైకాపా కార్యకర్తలా వ్యవహరించారు. తెదేపా నాయకులు శాంతియుతంగా నిరసనలు చేసినా అడ్డుకుని కేసులు నమోదు చేశారు. చివరకు గతేడాది జనవరిలో స్థానిక ఎమ్మెల్యే, తెదేపా అధినేత చంద్రబాబు.. నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు సైతం జీవో నంబరు 1ను సాకుగా చూపి శాంతిపురం మండలం పెద్దూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు వైకాపా కార్యకర్తలు.. విపక్ష శ్రేణులపై రాళ్ల దాడి చేసి హత్యాయత్నం కేసులు కట్టించి మాజీ ఎమ్మెల్సీ గౌనివారి సహా పలువురిని చిత్తూరు జిల్లా జైలులో నెల రోజులపాటు ఉంచారు. ఇలా ఐదేళ్లపాటు కుప్పం నియోజకవర్గం అరాచకాలకు కేంద్ర బిందువులా మార్చారు.
బెదిరింపులకు దిగిన ఎమ్మెల్సీ భరత్
ముఖ్యమంత్రి జగన్ మొదలుకుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి, వైకాపా నాయకులు ‘వై నాట్ కుప్పం’ అంటూ మూడేళ్ల క్రితం ప్రగల్బాలు పలికారు. 2024 ఎన్నికల్లో ఇక్కడ గెలుస్తామని అతివిశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో చివరికి చంద్రబాబు ఆధిక్యాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నారు. వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించి లబ్ధిదారులను బెదిరించాలని చూశారు. ఇది ఫలించకపోవడంతో ఒక్కో ఓటుకు రూ.4వేలు కూడా ఇచ్చారు. చివరకు పోలింగ్ రోజు రామకుప్పం మండలం ననియాలలో ఎమ్మెల్సీ, వైకాపా అభ్యర్థి భరత్, ఆయన గన్మెన్ తెదేపా కార్యకర్తలపై దాడికి దిగారు. సింగసముద్రంలో పోలింగ్ కేంద్రం తలుపులు మూశారు. ప్రశ్నించిన తెదేపా కార్యకర్తలను బెదిరించారు. పోలింగ్ సరళిని బట్టి చంద్రబాబు ఆధిక్యం తగ్గించలేకపోతున్నామనే దుగ్ధ అధికార పార్టీ శ్రేణులను వెంటాడుతోంది. దీన్ని జీర్ణించుకోలేకే ఇటీవల వరుస దాడులకు తెగబడుతున్నారు.
దౌర్జన్యకారులను ముందుగా హెచ్చరిస్తేనే..
ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు ఉన్నతాధికారులపై ఉంది. ఈ నేపథ్యంలో దౌర్జన్యకారులను ముందుగానే స్టేషన్లకు పిలిపించి హెచ్చరిస్తే ఎంతోకొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల గొడవలకు కారణమై హత్యాయత్నాలకు పాల్పడ్డ వైకాపా కార్యకర్తలను అరెస్టు చేస్తే మిగిలిన వారిలోనూ భయం వస్తుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే అధికార పార్టీ మూకలు మరోసారి రెచ్చిపోతారనే ఆందోళన ప్రజానీకంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్