వెలుగులెక్కడ పెద్దాయనా..?
నా ఎస్సీలు, నా ఎస్టీలని చెప్పే సీఎం జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు అన్నింటా అన్యాయం చేస్తున్నారు.. ఎ ముగియడంతో ఎస్సీ, ఎస్టీ విద్యుత్తు కనెక్షన్లపై దృష్టి సారించారు.. అది ఉచిత విద్యుత్తు కనెక్షన్ అయినా పరిమితికి మించి వినియోగిస్తే బకాయి మొత్తం కట్టాల్సిందేనని, లేదంటే కనెక్షన్ తొలగిస్తామని హుకుం జారీ చేశారు.
ఉచిత కనెక్షన్లకు బకాయిల షాక్
నిబంధనల పేరుతో లబ్ధిదారుల్లో కోత
ఎస్సీ, ఎస్టీల గృహాల్లో ఊసేలేని ఉచిత విద్యుత్తు
న్యూస్టుడే, చిత్తూరు(జిల్లా పంచాయతీ)న్నికలు
నా ఎస్సీలు, నా ఎస్టీలని చెప్పే సీఎం జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు అన్నింటా అన్యాయం చేస్తున్నారు.. ఎ ముగియడంతో ఎస్సీ, ఎస్టీ విద్యుత్తు కనెక్షన్లపై దృష్టి సారించారు.. అది ఉచిత విద్యుత్తు కనెక్షన్ అయినా పరిమితికి మించి వినియోగిస్తే బకాయి మొత్తం కట్టాల్సిందేనని, లేదంటే కనెక్షన్ తొలగిస్తామని హుకుం జారీ చేశారు.. గత ప్రభుత్వం కంటే మిన్నగా ఉచిత విద్యుత్తు అందిస్తామని ఊదరగొట్టిన వైకాపా ప్రభుత్వం రాయితీలో దశల వారీగా కోత పెట్టింది.. తీరా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిశాక ఏకంగా ఆయా కనెక్షన్లకే ఎసరు పెట్టి సదరు వర్గాలకు షాక్ ఇస్తోంది.
ఎస్సీ కాలనీల్లోని ఉచిత విద్యుత్తు వినియోగదారులకు ఎస్పీడీసీఎల్ షాక్ ఇస్తోంది. పలువురు లబ్ధిదారులు రూ.వేలకు వేలు బిల్లులు చూసి అవాక్కవుతున్నారు. బిల్లులేమీ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి.. తీరా ఇప్పుడు బకాయిలు నెపంతో కనెక్షన్లు తొలగిస్తామంటే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు విద్యుత్తు రాయితీ అమలులో కోతల వాత తప్పడం లేదు. విద్యుత్తు రాయితీ పరిమితి పెంచామంటూనే లబ్ధిదారుల సంఖ్యలో కోత పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఉచిత విద్యుత్తుకు అర్హత కోల్పోయి, వినియోగ పరిమితి దాటేసినందున, ఉచిత విద్యుత్తు అమలు వర్తించదని, ఏళ్లుగా పేరుకు పోయిన విద్యుత్తు బిల్లుల చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) పరిధిలో ఉమ్మడి జిల్లాలో 13.73 లక్షల గృహ వినియోగ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. అందులో ఎస్సీ, ఎస్టీల గృహ విద్యుత్తు కనెక్షన్లు 3.43 లక్షలు ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2,47,683 మంది ఉచిత విద్యుత్తుకు అర్హత పొందితే, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 1.94 లక్షలకు తగ్గింది. ఉమ్మడి జిల్లాలో నెలకు 200 యూనిట్లుకు మించిన విద్యుత్తు వినియోగ కనెక్షన్లు గుర్తించారు. మొత్తం 23,458 మంది వినియోగదారులు రూ.8 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తేల్చారు.
ఉచితం అంతా ఉత్తిదే..
గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్తు అమలు చేస్తే ఎన్నికల హామీలో భాగంగా జగన్ ప్రభుత్వం 200 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్తును 2019 ఆగస్టు నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎస్పీడీసీఎల్ ఖజానా నుంచి రూ.కోట్లు నిధులు జగనన్న కాలనీల్లో విద్యుత్తు ఉప కేంద్రాలు, ఇతరత్రా పనులకు ప్రభుత్వం మళ్లించడంతో సంస్థ మనుగడకు ఇలాంటి బకాయిలే దిక్కయ్యాయి. ఎన్నికల వరకూ మిన్నకుండిన యంత్రాంగం తీరా ఇప్పుడు ఎన్నికలయ్యాక బకాయిలు చెల్లించకపోతే విద్యుత్తు సరఫరా తొలగిస్తామని ఝలక్ ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లూ చూపింది ఉత్తుత్తి ప్రేమేనని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర్హులకు ఉచిత ప్రయోజనం కలిగిస్తున్నాం..
ప్రభుత్వ నిబంధనలు అనుసరించి అర్హులైన వారందరికీ ఉచిత విద్యుత్తు ప్రయోజనాన్ని కల్పిస్తు న్నాం. ఎవరైనా అనర్హులంటే వారి నుంచి మాత్రమే బిల్లులు వసూలు చేస్తాం.పేదవారైన ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఉచిత విద్యుత్తు అందుతుంది.
కృష్ణారెడ్డి, ఎస్ఈ, తిరుపతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మదనపల్లెలో కిలో టమాటా@ రూ.80
[ 17-06-2024]
మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో సోమవారం కిలో టమాటా ధర అత్యధికంగా రూ.80 పలికింది. -
డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించిన ఎమ్మెల్యే
[ 17-06-2024]
తిరుపతిలోని పెద్దకాపు లేవుట్లో సర్వీస్ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థలను ఎమ్మెల్యే శ్రీనివాసులు, నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి మన్నూరు సుగుణమ్మతో కలిసి పరిశీలించారు. -
ముక్కంటి సన్నిధిలో.. చెక్కుచెదరని అక్రమాలు
[ 17-06-2024]
ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలోని పనులు చేసే గుత్తేదారులకు శ్రీకాళహస్తీశ్వరాలయం బంగారు బాతులా మారింది. వైకాపా మద్దతుదారుడైతే చాలు.. వాళ్లకు గతంలో పనులు చేసిన అనుభవం ఉన్నా.. లేకున్నా అడ్డగోలుగా పనులు పంచేశారు. -
క్యూలైన్లు తనిఖీ చేసి.. భక్తుల కష్టాలు ఆలకించి
[ 17-06-2024]
తితిదే ఈవోగా ఆదివారం బాధ్యతలు చేపట్టిన జె.శ్యామలరావు అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో క్యూలైన్లను తనిఖీ చేశారు. జేఈవో వీరబ్రహ్మంతో కలిసి సర్వదర్శనం క్యూలైన్లు, నారాయణగిరి షెడ్లను పరిశీలించిన ఆయన భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
నేడు అన్న క్యాంటీన్ పునఃప్రారంభం
[ 17-06-2024]
చిత్తూరు నగరంలోని ఎస్టేట్ సమీపాన అన్న క్యాంటీన్ను సోమవారం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించనున్నారు. దీని భవన మరమ్మతులు దాదాపు పూర్తయ్యాయి. -
ఇవేం పనులు వెంకటేశా..?
[ 17-06-2024]
కిందిస్థాయి సిబ్బంది ఎలాంటి అనధికారిక కార్యక్రమాలకు పాల్పడకుండా చూడాల్సిన ఉన్నతాధికారే ఏకంగా నిబంధనలు అతిక్రమించి తమ బంధువులకు కావాల్సిన అన్ని వసతులు కల్పించారు. -
అంతా.. నా ఇష్టం
[ 17-06-2024]
ప్రభుత్వం మారింది.. ప్రజాప్రతినిధులు మారారు.. సీనియర్ అధికారి.. పైగా ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేయనున్నారు.. ఇలా అన్ని కోణాల్లో జిల్లా ఉన్నతాధికారులు సదరు అధికారి విషయంలో కాసింత మౌనంగా ఉన్నారు.. -
కంకర క్వారీ భూముల స్వాహాకు యత్నం
[ 17-06-2024]
పలమనేరు నియోజకవర్గం కొలమాసనపల్లె పంచాయతీ ఎర్రగొండేపల్లె వద్ద శ్రీవేంకటేశ్వర స్టోన్ క్రషర్స్ భూములను స్థానిక మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ బినామీలు స్వాహా చేసేందుకు యత్నించారని సదరు క్వారీ యజమాని కెంబళి జనార్దన్నాయుడు ఆరోపించారు. -
వైభవంగా ప్రసన్న వేంకన్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 17-06-2024]
అప్పలాయిగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు తిరుచ్చిలో ఆశీనుడవగా.. వేదపండితులు ఆలయ ఆవరణలో అంకురార్పణ చేశారు. -
‘దాడి చేసిన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలి’
[ 17-06-2024]
యాదమరి మండలం మోటాండ్లపల్లెలో ఈడిగలపై దాడి చేసిన వైకాపా వర్గీలయులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఈడిగ సంఘ ప్రధాన కార్యదర్శి నాగరాజుగౌడ్ డిమాండ్ చేశారు. -
తొలి సంతకం.. ఆశల సంకేతం
[ 17-06-2024]
ఉద్యోగ అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ వచ్చేస్తోంది. గత అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి ఊరించి ఊసూరుమనిపించింది. -
అభివృద్ధిపై.. కక్షగట్టి
[ 17-06-2024]
జగనన్న అయిదేళ్ల కక్షాపూరిత పాలనతో అన్ని రకాల ప్రజలూ అష్టకష్టాలు పడ్డారు. ఇదే తీరును తిరునగరిలోనూ ఆ పార్టీ నేతలు కొనసాగించారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ విమానాశ్రయంలో విద్యుత్తు అంతరాయం.. బోర్డింగ్, చెక్-ఇన్లో ఇబ్బందులు
-
మరో కొత్త రకం స్కామ్.. అడ్వర్టైజ్మెంట్ పేరుతో ₹81 లక్షలకు టోకరా!
-
భాజపా జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి
-
అమెరికాను మించిన అణువేగం చైనా సొంతం..!
-
పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు
-
క్రికెట్లో మా ప్రాభవం తగ్గుతోంది.. పీసీబీ లుక్కేయాలి: పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్