ఐదేళ్లు అయ్యాక.. హడావుడి!
మద్యం విక్రయాల్లో నవ్విపోదురుగాక.. అన్నట్లుంది ప్రభుత్వం తీరు. అయిదేళ్ల పాలన, సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత తాపీగా నగదురహిత సేవలు ప్రారంభించి వేడుక చూస్తోంది.
మద్యం దుకాణాల్లో నగదురహిత విక్రయాలు
కూలీలు, పేదలకు తప్పని భారం
పుత్తూరు, పెళ్లకూరు, న్యూస్టుడే : మద్యం విక్రయాల్లో నవ్విపోదురుగాక.. అన్నట్లుంది ప్రభుత్వం తీరు. అయిదేళ్ల పాలన, సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత తాపీగా నగదురహిత సేవలు ప్రారంభించి వేడుక చూస్తోంది. చిప్ లిక్కర్కు యాప్ల ద్వారా చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీచేస్తూ రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ దుకాణాల్లో కొత్త విధానం తీసుకొచ్చారు. ఇదంతా ఆయా ప్రాంతాల్లోని బార్లకు మేలుచేసేలా ఉంది తప్పితే ప్రభుత్వానికి ఆదాయం పెంచేలా లేదన్న విమర్శలు వస్తున్నాయి. పేదలు ఈ బాధలు పడలేక బార్లకు వరుసకడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఏటా రూ.3,600 కోట్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఇందులో చీప్ లిక్కర్ 80 శాతం వాటా ఉంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక దశలవారీగా మద్య నిషేధం అని తర్వాత మడమ తిప్పేసింది. మద్యం తయారీ, విక్రయాలు తమ గుప్పెట్లోకి పెట్టుకుని అంతాతామై ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారు. దీంతో మద్యం సరఫరా నుంచి విక్రయాల వరకు వీరిదే పెత్తనంగా మారింది. దీంతో అధికారులు క్రయవిక్రయాల్లో ఇష్టానుసారంగా వ్యవహరించారు. కొన్నిచోట్ల ప్రభుత్వ దుకాణాలు కావాలనే మూసేసి వైకాపా నేతల బార్లకు సహకరించిన పరిస్థితులు చాలాచోట్ల ఉన్నాయి.
గూడూరులో మద్యం దుకాణం వద్ద యూపీఐ కోడ్
పేదలకేవీ యూపీఐ సేవలు
రోజూ రూ.10 కోట్ల మద్యం విక్రయాలు తిరుపతి, చిత్తూరు జిల్లాలో జరుగుతున్నాయి. అందులో రూ.8 కోట్ల వరకు చీప్ లిక్కర్ విక్రయాలు ఉన్నాయి. దీనిపై ఆధారపడ్డ కార్మికులు, కర్షకుల్లో యూపీఐ సేవలు లేనివారే ఉంటున్నారు. ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు నగదు రహిత సేవలు అంటూ ఇబ్బందులకు గురిచేయడం ఏమిటన్న ప్రశ్న ఎదురవుతోంది. క్రమంగా అలవాటు చేయాల్సి ఉన్నా కొత్త ప్రభుత్వం కొలువుదీరే సమయంలో ఇలా చేయడంపై మండిపడుతున్నారు.
అదనంగా గుంజుడు
నగదు సేవల యాప్లు లేని వారంతా పక్కవారి మీద ఆధార పడుతున్నారు. వారికి నగదు ఇచ్చి ఫోన్పే ఇతర మార్గాల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. వారు రూ.10 వరకు గుంజుతున్నారు. ఇలా అసలు ధర కంటే రూ.30 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం తీసుకోలేని వారంతా సమీపంలోని బార్లకు వరుస కడుతున్నారు. ఇక్కడ సీసా మీద రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల దుకాణాలు కావడంతో వారి చెప్పిందే ధరగా నడుస్తోంది. గూడూరులోని బార్లో సీసాకు రూ.30 వరకు వసూలు చేస్తున్నట్లు మందుబాబులు వాపోతున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, నాయుడుపేట, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో ఇదే తీరు నడుస్తోంది. దీనిపై సంబంధిత శాఖాధికారులను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రారంభించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం