శివ.. శివా..!
‘దోషాలతో పట్టి పీడించే రాహు, కేతువుల సర్పగండాలను విముక్తి కల్గించే సర్పదోష నివారణ క్షేత్రంగా శ్రీకాళహస్తి ఆలయం అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తోంది. దర్శనార్థం వచ్చే భక్తులను అడుగడుగునా దళారులు రాహు, కేతువుల్లా పీక్కుతింటున్నారు.
దళారుల రాజ్యం.. దర్శనానికి సంకటం
తీరుమారని శ్రీకాళహస్తి ఆలయ పాలన
దర్శనం కోసం సర్వదర్శనం క్యూలైన్లల్లో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులు
‘దోషాలతో పట్టి పీడించే రాహు, కేతువుల సర్పగండాలను విముక్తి కల్గించే సర్పదోష నివారణ క్షేత్రంగా శ్రీకాళహస్తి ఆలయం అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తోంది. దర్శనార్థం వచ్చే భక్తులను అడుగడుగునా దళారులు రాహు, కేతువుల్లా పీక్కుతింటున్నారు. సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సిన దుస్థితి. అదే దళారులతో ఒప్పందం కుదిరితే.. అర్ధగంటలో దర్శనమై రాజమార్గంలో బయటకొచ్చేస్తున్నారు. ఇదీ శ్రీకాళహస్తి ఆలయంలో ప్రస్తుత పరిస్థితి. డబ్బు, పరపతి ఉన్నోళ్లకు ఢోకా లేదు. ఆర్థిక స్థోమత లేని సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లల్లో నిరీక్షించి.. నీరసించి.. విసిగి.. వేసారి.. తీవ్ర అసంతృప్తితో తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. దళారులు.. వాళ్లు తీసుకువచ్చే భక్తుల బృందాల గురించి ఆలయ అధికారులు, ఉద్యోగులు, భద్రతా విభాగం సిబ్బంది ఇలా అందరికీ తెలుసు. నియంత్రించడంలో ఈవో నుంచి అటెండర్ స్థాయి వరకు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఇలా తయారైంది. దళారుల అడ్డాగా మారిపోయింది. ఎవరినైనా గట్టిగా నిలదీస్తే.. తాము అందరికీ వాటాలిస్తున్నామంటూ చెబుతుండటం మరిన్ని విమర్శలకు కారణమవుతోంది.
శ్రీకాళహస్తి, న్యూస్టుడే
పెట్టుబడి లేని వ్యాపారం.. ఎలాంటి పెట్టుబడి లేకుండా రోజూ రూ.10 వేలతో ఇంటికెళ్లే ఏకైక ఉపాధి కేంద్రంగా శ్రీకాళహస్తీశ్వరాలయం మారిపోయింది. నేతలు, ఆలయ అధికారులు, పట్టణ ప్రముఖుల పేర్లతో అడ్డగోలు దర్శనాలు చేయిస్తూ ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని జేబుల్లో వేసుకుంటున్నారు. దళారులు యథేచ్ఛగా అద్దాల మండపం గుండా మహద్వారానికి తీసుకువస్తున్నారు. అమ్మవారి ఆలయం మీదుగా స్వామివారి ఆలయం ధ్వజస్తంభం వెనుక నుంచి క్యూలైన్లలోకి కలిపేస్తున్నారు. ఇలా అడ్డదారి దర్శనం చేయిస్తే ఒక్కొరికి రూ.200 పైమాటే. అదే అంతరాలయ దర్శనం చేయిస్తే ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చి తీరాల్సిందే. ఇలా ఒక్కో దళారీ పంపకాలుపోను రూ.పది వేలు తక్కువ కాకుండా సంపాదిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
దర్శనమంటేనే భయమేస్తోంది
ముక్కంటి ఆలయంలో దర్శనమంటేనే భయమేస్తోంది. మధ్యాహ్న సమయంలో దర్శనానికి వచ్చాం. అసలే ఉక్కపోత. దానికితోడు దాదాపు మూడున్నర గంటలు నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇంత కష్టపడి వెళ్లినా దర్శనం అయిందన్న సంతృప్తి మిగలడంలేదు.
ఉదయశ్రీ, వరంగల్
తోపులాటలతో విసిగిపోయాం
క్యూలైన్లోకి వెళ్లినప్పటి నుంచి తోపులాటలే. క్యూలో వెళ్తున్న క్రమంలో కొత్తగా మరో పక్క నుంచి భక్తులను అనుమతించేస్తున్నారు. వాళ్లందరూ ఒక్కసారిగా క్యూలోకి రావడంతో తోపులాటలు. దీంతో గొడవలు. ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం లేకుండా పోయింది.
సందీప్, గుంటూరు
ఎందుకొచ్చామా అనిపించింది..
ఎంతో పవిత్రమైన ఆలయం వ్యాపార కేంద్రంగా మారిపోయింది. లగేజీ కేంద్రాల్లోనూ దోపిడీ, కార్పార్కింగ్ నుంచే దళారులు. ఆరుగురు వచ్చాం. దర్శనం క్యూలైన్లు చూసి భయపడ్డాం. డబ్బులిస్తే రాజమార్గంలో తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కరికి రూ.300 ఇచ్చి దర్శనాలకు వెళ్లాం. అంతా పూర్తయ్యాక ఎందుకొచ్చామా దర్శనానికి అని తీవ్ర ఆవేదనకు గురయ్యా.
కీర్తి, భక్తురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే