అల్లరిమూకలపై కాఠిన్యం
కౌంటింగ్ నేపథ్యంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలిలో మంగళవారం ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు.
చిత్తూరులో పోలీసుల మాక్ డ్రిల్
మాక్డ్రిల్ వీక్షిస్తున్న ఎస్పీ, పోలీసు అధికారులు, సిబ్బంది
చిత్తూరు(నేరవార్తలు), న్యూస్టుడే: కౌంటింగ్ నేపథ్యంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలిలో మంగళవారం ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు. అల్లర్లు, ఆందోళనలు, రౌడీయిజానికి ఎవరైనా పాల్పడితే వారిపై చర్యలు తీసుకుని చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి ఎలా తెస్తారనేది ప్రత్యక్షంగా చేసి చూపారు. మాక్డ్రిల్లో భాగంగా ఓవైపు పోలీసులు మఫ్టీలో ఆందోళన చేస్తుంటే, మరోవైపు యూనిఫాంలో ఉన్నవారు.. ఆందోళనకారులపై ఎలా స్పందించి నియంత్రించారనేది చేసి చూపిన విధానం స్థానికులను ఆకట్టుకుంది.చివరకు గాయపడిన వారిని రక్షించి, అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లే సన్నివేశం ఆకర్షించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడి వీక్షించారు. ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపే కీలకమని, ఆ సమయంలో అల్లర్లు, విధ్వంసాలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకే మాక్డ్రిల్ నిర్వహించామన్నారు. ఎదుటి వారిని రెచ్చగొట్టి, హింసాత్మక సంఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. మాక్డ్రిల్ చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రాజగోపాల్రెడ్డి, చిత్తూరు వన్టౌన్ సీఐ విశ్వనాథరెడ్డి, టూటౌన్ సీఐ ఉలసయ్య, ఈస్ట్ సర్కిల్ సీఐ కుళ్లాయప్ప, వెస్ట్ సీఐ రవిశంకర్రెడ్డి పాల్గొన్నారు.
ఆందోళన చేస్తున్న మఫ్టీ పోలీసులు
ఆందోళనకారులను చెదరగొడుతున్న పోలీసులు
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి