తాళం వేసినా తీరు మారలే..!
తమకు తెలియకుండా ఒక వర్గానికి చెందిన వారు చెప్పిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటూ.. అధికార వైకాపా కౌన్సిలర్లే గతంలో పురపాలిక కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు.
ఉద్యోగాల ఆమోదానికి యత్నం
వ్యతిరేకత రావడంతో సమావేశం రద్దు
పురపాలిక కార్యాలయానికి తాళం వేసిన కౌన్సిలర్లు (పాతచిత్రం)
కుప్పం పట్టణం, న్యూస్టుడే: తమకు తెలియకుండా ఒక వర్గానికి చెందిన వారు చెప్పిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటూ.. అధికార వైకాపా కౌన్సిలర్లే గతంలో పురపాలిక కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. అప్పట్లో వైకాపాకు చెందిన ఓ కౌన్సిలర్, కౌన్సిలర్ భర్తను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వైకాపా ప్రకటించింది. కొన్నాళ్లకు వారి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ వైకాపా నాయకులకు సలామ్ చేసిన అధికారుల తీరుపట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కుప్పం పురపాలిక పరిధిలో 30 మందిని తాత్కాలిక సిబ్బందిని నియమించేందుకు చిత్తూరు ఎమ్మెల్సీ, పురపాలిక ఛైర్మన్ ప్రతిపాదిస్తున్నట్లు పురపాలిక సాధారణ సమావేశంలో ఆమోదించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. సాధారణ సమావేశంలో ఆమోదం పొందుదామని పురపాలిక ఛైర్మన్ సంతకంతో ఉండటం.. మళ్లీ సొంత వైకాపా కౌన్సిలర్లు వ్యతిరేకించడంతో సాధారణ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు పురపాలిక కమిషనర్ ప్రకటన చేశారు. ఏది ఏమైనప్పటికీ తమ అనుచరులకు పురపాలికలో ఉద్యోగాలు కల్పించడానికి వైకాపా నాయకులు నిబంధనలు ఉల్లంఘించి చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు సైతం జీ హుజూర్ అనడం ఏమిటని తెదేపా కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత