దర్జాగా చౌర్యం..!
జిల్లాలో పెరుగుతున్న విద్యుత్తు చౌర్యం కేసులు అధికారులకు తలనొప్పిగా మారాయి.. అక్రమార్కులు అనేక మార్గాల్లో దర్జాగా చౌర్యానికి పాల్పడుతున్నారు..
న్రాలుగేళ్లలో 1.03లక్షల కేసులు
అడ్డుకట్ట వేసేదెన్నటికో
అధికారులు దృష్టి సారిస్తేనే నష్ట నివారణ
న్యూస్టుడే, చిత్తూరు (మిట్టూరు)
విద్యుత్తుశాఖ చిత్తూరు అర్బన్ డివిజన్ ఈఈ కార్యాలయం
జిల్లాలో పెరుగుతున్న విద్యుత్తు చౌర్యం కేసులు అధికారులకు తలనొప్పిగా మారాయి.. అక్రమార్కులు అనేక మార్గాల్లో దర్జాగా చౌర్యానికి పాల్పడుతున్నారు.. ఐదు జిల్లాల పరిధిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే విజిలెన్స్ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించి పెద్దసంఖ్యలో కేసులు నమోదు చేసి రూ.లక్షల్లో అపరాధ రుసుం విధించారు.. చౌర్యం కారణంగా సంస్థకు రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోంది.
జిల్లాలో ఇలా..
జిల్లా వ్యాప్తంగా అన్ని విభాగాలకు చెందిన విద్యుత్తు సర్వీసులు 19.35లక్షలు ఉన్నాయి. గతంలో పాత మీటర్లలో చౌర్యానికి పాల్పడేవారు. వాటి స్థానంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసినా పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. నాలుగేళ్లలో ఐదు జిల్లాలు చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, కర్నూలు పరిధిలో విద్యుత్తు విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో వేల సంఖ్యలో అక్రమ కనెక్షన్లు బయటపడ్డాయి. చౌర్యానికి పాల్పడిన వారిపై 1,03,044 కేసులు నమోదు చేయడంతో పాటు రూ.కోట్లలో జరిమానా విధించారు.
నష్ట నివారణపై ఏదీ శ్రద్ధ?
విద్యుత్తు నష్ట నివారణపై అధికారుల్లో శ్రద్ధ కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్తు చౌర్యం, నష్ట నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన చర్యలు శూన్యం. అక్రమంగా వినియోగిస్తున్న వారిపై విధించే జరిమానాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ చౌర్యాన్ని కొంతమేర అరికట్టవచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే చౌర్యం అరికట్టి కొంతమేర నష్ట నివారణ సాధ్యమవుతోంది.
వక్రమార్గాలు ఎన్నో..
కొన్ని రంగాలకు రాయితీపై.. మరికొన్నింటికి ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నా చౌర్యం ఆగటం లేదు. తీగలకు నేరుగా వైర్లను కలిపి వాడుకోవడం, గృహ అవసరాలకు కనెక్షన్ తీసుకుని వాణిజ్యానికి వినియోగించుకోవడం, వ్యవసాయం మాటున ఇతర అవసరాలకు వాడుతున్నారు. మీటర్లకు సంబంధం లేకుండా విద్యుత్తు వాడకం(మాల్ప్రాక్టీస్), అధిక లోడు వినియోగం తదితర వక్ర మార్గాల్లో వినియోగిస్తూ విద్యుత్తు సంస్థకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నారు. ఏదైనా ప్రాంతంలో సరఫరాలో వ్యత్యాసం ఉంటే వెంటనే అధికారులు తనిఖీ నిర్వహిస్తారు. దాడుల సందర్భంగా మాత్రమే చౌర్యం కేసులు బయటపడుతున్నాయి. అప్పటి వరకు అక్రమార్కులు దర్జాగా విద్యుత్తు వినియోగించుకుంటున్నారు. విద్యుత్తు విజిలెన్స్ అధికారులు పలుమార్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండోసారి పట్టుబడితే జైలుకే అని తెలిసినా కొంతమంది వెనకాడటం లేదు.
కేసులు తగ్గాయి..
విద్యుత్తు చౌర్యం కేసులు ఇటీవల బాగా తగ్గాయి. చౌర్యం, నష్ట నివారణ చర్యలపై గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తూ చౌర్యానికి అడ్డుకట్ట వేస్తున్నారు. అక్రమ విద్యుత్తు వినియోగం చట్టరీత్యా నేరం.
శ్రీనివాసబాబు, డీపీఈ (ఎస్ఈ, విజిలెన్స్), ఎస్పీడీసీఎల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల