logo

తెలుగు వారి హృదయాల్లో చిరస్మరణీయుడు ఎన్టీఆర్‌

తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను మంగళవారం చిత్తూరులో ఘనంగా నిర్వహించారు.

Published : 29 May 2024 01:58 IST

వాడవాడలా ఘనంగా జయంతి వేడుకలు

జిల్లా పార్టీ కార్యాలయంలో కేకు కోస్తున్న నాయకులు

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను మంగళవారం చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసి ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు సి.ఆర్‌.రాజన్, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, మాజీ మేయర్‌ కఠారి హేమలత, చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు చంద్రప్రకాష్, ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు తనయుడు రాధే, పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగు వారి హృదయాల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎ.ఎస్‌.మనోహర్, నాయకులు జయచంద్రనాయుడు, హిమగిరినాయుడు, సీఎం విజయ, రాణెమ్మ, రాజశేఖర్‌బాబు, జాఫర్, వరలక్ష్మి, విజయకుమార్, ధరణీపతి, త్యాగరాజన్, అశోకన్‌ తదితరులు పాల్గొన్నారు.

పలమనేరులో నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని