భయపెట్టేందుకేనా హత్యాయత్నం కేసులు
ఐదేళ్ల వైకాపా పాలనలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని కుటుంబంపై, మరే ఇతర తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించలేదని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మీడియా సమక్షంలో ప్రకటించి ఒక్క రోజు కూడా కాకుండానే..
37 మంది కీలక తెదేపా నేతలపై ఫిర్యాదులు
తిరుపతి (నేరవిభాగం), న్యూస్టుడే: ఐదేళ్ల వైకాపా పాలనలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని కుటుంబంపై, మరే ఇతర తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించలేదని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మీడియా సమక్షంలో ప్రకటించి ఒక్క రోజు కూడా కాకుండానే.. ఓ వైకాపా కార్యకర్త 37 మంది తెదేపా కీలక నేతలపై ఏకంగా హత్యాయత్నం ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. వారందరూ పులివర్తి నానికి అత్యంత దగ్గరగా ఉన్న తిరుపతి, చంద్రగిరికి చెందిన కీలక నేతలు. ఘటనా స్థలంలో కొందరు నాయకులు లేకపోయినా.. పోలీసులు కనీసం ప్రాథమిక విచారణ జరపకుండా హడావుడిగా హత్యాయత్నం కేసులు నమోదు చేశారంటే దీని వెనుక ఏమి జరిగిందనేది బహిరంగ రహస్యమే.
సూత్రధారులపై చర్యలేవీ?
ఈ నెల 14న మహిళా వర్సిటీ వద్ద పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగినట్లు వీడియోలు బహిర్గతం చేసినా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పులివర్తి నాని వద్ద ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. 15 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే ఈ దాడికి సంబంధం లేని నలుగురు తిరుమలకు చెందిన వ్యక్తులను జైలుకు పంపారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హత్యాయత్న ఘటనకు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చెవిరెడ్డి రఘునాథరెడ్డి సూత్రధారులని నాని ప్రకటించినా కేసు గానీ.. దర్యాప్తు గానీ పోలీసులు చేయలేదు.
అగ్ర నాయకులపైనే గురి..
ఘటన జరిగిన 13 రోజుల తర్వాత వైకాపా కార్యకర్త రాజీవ్ ఎస్వీయూ పోలీసులకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఫిర్యాదు చేస్తే.. చంద్రగిరి, తిరుపతికి చెందిన కీలక తెదేపా నాయకుల పేర్లు ఉన్నాయని తెలిసి కూడా కనీస ప్రాథమిక విచారణ జరపకుండా కేసు నమోదు చేశారు. అందునా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి ప్రతి ఘటనలో అండగా నిలిచే నాయకులపైనే హత్యాయత్నం కేసులు పెట్టడం ఒకింత భయపెట్టే ప్రయత్నమేనని ఆరోపణలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం