YS Jagan: బస్సు దిగలేదు.. ప్రజలను కలవలేదు..!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బుధవారం రాత్రి తిరుపతి జిల్లాకు చేరుకున్నారు. సాయంత్రం పూతలపట్టులో మేమంతా సిద్ధం సభ నిర్వహించిన అనంతరం ఆయన నేండ్రగుంట, గాదంకి, చంద్రగిరి, తిరుపతి బైపాస్ మీదుగా రేణిగుంట వద్ద ఉన్న గురవరాజుపల్లెకు రాత్రి 9.05 గంటలకు చేరుకున్నారు.
బస్సులోంచే అభివాదం
ఈనాడు - తిరుపతి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బుధవారం రాత్రి తిరుపతి జిల్లాకు చేరుకున్నారు. సాయంత్రం పూతలపట్టులో మేమంతా సిద్ధం సభ నిర్వహించిన అనంతరం ఆయన నేండ్రగుంట, గాదంకి, చంద్రగిరి, తిరుపతి బైపాస్ మీదుగా రేణిగుంట వద్ద ఉన్న గురవరాజుపల్లెకు రాత్రి 9.05 గంటలకు చేరుకున్నారు. సీఎం ఎక్కువ సమయం బస్సులో కూర్చుని అభివాదం చేసుకుంటూ వచ్చారు. ఎక్కడా ఆయన బస్సు దిగి నేరుగా ప్రజలను కలుసుకోలేదు. కేవలం దామలచెరువుకు ముందు చల్లాకూరమ్మగుడి వద్ద నుంచి 250 మీటర్లు మాత్రమే బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. ఆ తర్వాత మొత్తం ఆయన బస్సులో ఉండి కిందకు దిగలేదు. సీఎం బస్సు యాత్ర సందర్భంగా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. చంద్రగిరి దాటిన తర్వాత జాతీయ రహదారి నుంచి శ్రీనివాసమంగాపురం వెళ్లే మార్గం వద్ద దాదాపు 15 నిమిషాలు వాహనాలు నిలిపివేశారు. సీఎం తిరుపతి దాటి వెళ్లే వరకు వాహనాలను వదలలేదు. దీంతో కొందరు తమ బంధువుల ఇళ్లలో వివాహ మహోత్సవానికి వెళ్లాల్సి ఉందని పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. ్యరేణిగుంట కూడలి వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రేణిగుంట-తూకివాకం, శ్రీకాళహస్తి ప్రధాన రహదారి, రేణిగుంట చెక్పోస్టు కూడలి ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఇదే సమయంలో ఒక ఆటో డ్రైవర్ హారన్ కొట్టడంతో మఫ్టీలో ఉన్న పోలీస్ అతనిపై చేయి చేసుకునే యత్నం చేశారు. అతను కడప మార్గంవైపు వెళ్లాలని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు.
పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్
పాకాల, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బస్సుయాత్ర పదిపుట్లబైలు పంచాయతీ పెరుమాళ్లగుడిపల్లి వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. దామలచెరువు హైస్కూల్గేటు ప్రధాన సెంటర్లో మండుటెండలో ప్రజలు చెమటలు కక్కుకుంటూ ఎదురు చూస్తున్నా జగన్ ఏసీ బస్సులోకి వెళ్లిపోవడంతో వారు నిరాశకు గురయ్యారు. జనం ఎండలో ఉంటే జగన్ బస్సులోకి వెళ్లడమేంటా అంటూ నిట్టూర్చారు. జిల్లాలో ఎక్కడా బస్సు ఆపడం కానీ, పలకరించకపోవడంతో జనం అసంతృప్తికి లోనయ్యారు.
విద్యార్థులను ఇళ్లకు పంపిన ఉపాధ్యాయులు
బస్సు యాత్ర నేపథ్యంలో దామలచెరువు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులను ఉదయం 11 గంటలకే ఇంటికి పంపేయడం చర్చనీయాంశంగా మారింది. విషయం మీడియాకు చేరడంతో వారు దీనిపై ఆరా తీయగా ఉపాధ్యాయులు ఇంటికి వెళ్లిపోతున్న వారిని వెనక్కు రప్పించే యత్నం చేశారు.
అభిమానిని పక్కకు లాగుతుండగా జరిగిన తొక్కిసలాట
అడ్డం పడిన అభిమానిని లాక్కెళ్లిన పోలీసులు
చంద్రగిరి వద్ద జగన్ అభిమాని ఒకరు ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు బస్సుకు అడ్డుగా పడుకున్నారు. అక్కడే ఉన్న రోప్ పార్టీ ఆయనను లాక్కెళ్లారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. అందులో సుకన్య అనే మహిళ కింద పడింది. జిల్లాలో ఎక్కడైనా సీఎం మాట్లాడతారని వైకాపా కార్యకర్తలు భావించగా ఆయన మాత్రం అభివాదం చేసుకుంటూ రేణిగుంట మండలం గురవరాజుపల్లెలోని బస కేంద్రానికి చేరుకున్నారు. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై రాత్రి సైతం వాహనాలు నిలిపేసి చుక్కలు చూపించారు. సదుం, పులిచెర్ల మండలాల్లో రోడ్డు పక్కన కొందరు తమ సమస్యలు చెప్పుకొనేందుకు యత్నించగా బస్సు ఆపి విన్నారు. ఆయన బస్సు రావడానికి ముందే వారితో వైకాపా నేతలు మాట్లాడటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం