Leap Year: లీపు సంవత్సరం వస్తే వారికి పండగే
సాధారణంగా చిన్నారులకు ఏటా పుట్టినరోజును తల్లిదండ్రులు వేడుకగా నిర్వహిస్తారు. వివాహ వార్షికోత్సవాలను పెద్దలు సైతం జరుపుకొంటారు. అయితే వారికి ఇలాంటి వేడుకలన్నీ నాలుగేళ్లకు ఓసారి మాత్రమే వస్తుంటాయి.
పుంగనూరు, కల్లూరు, న్యూస్టుడే: సాధారణంగా చిన్నారులకు ఏటా పుట్టినరోజును తల్లిదండ్రులు వేడుకగా నిర్వహిస్తారు. వివాహ వార్షికోత్సవాలను పెద్దలు సైతం జరుపుకొంటారు. అయితే వారికి ఇలాంటి వేడుకలన్నీ నాలుగేళ్లకు ఓసారి మాత్రమే వస్తుంటాయి. పుట్టినరోజు, పెళ్లిరోజు తదితర వేడుకల కోసం అంతవరకు నిరీక్షించాల్సిందే. లీపు సంవత్సరంలో జన్మించిన, వివాహం చేసుకున్న వారికి ఫిబ్రవరి 29 చాలా ప్రత్యేకం. ఈ సంవత్సరం లీపు సంవత్సరం కావడంతో వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు జిల్లాలోని పలువురు.
నాలుగేళ్లకు ఓసారే ఎందుకంటే
ఒక ఏడాదికి 365 రోజుల 6 గంటలు సమయం. 24 ఒక రోజు లెక్కిస్తాం కాబట్టి.. ఏటా అదనంగా వచ్చిన 6 గంటలను ప్రత్యేకంగా చూపలేం. దీని కోసం నాలుగేళ్లలోని సమయాన్ని 24 గంటలుగా లెక్కించి ఫిబ్రవరి 29 ప్రకటించారు. ఏటా ఫిబ్రవరిలో 28 రోజులుంటే లీపు సంవత్సరంలో అదనంగా మరో రోజు లెక్కించి చూపుతారు.
ఎంతో ఆనందం..
భర్త మనోహర్తో జ్ఞానప్రసూన
చౌడేపల్లె మండలం బోయకొండ ఆర్ఆర్ కాలనీకి చెందిన జ్ఞానప్రసూన 1996 ఫిబ్రవరి 29న జన్మించారు. తల్లిదండ్రులు ప్యారీ, కృష్ణమూర్తి ప్రతిసారి ఘనంగా చేసేవారు. 2016లో మనోహర్తో వివాహమైంది. అప్పటి నుంచి భర్త, తల్లిదండ్రుల సమక్షంలో వేడుకలు జరుపుకొంటున్నారు. నాలుగేళ్లకు ఒకసారి వస్తుండటంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితుల మధ్య వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు.
పన్నెండేళ్లు.. నాలుగో జన్మదిన వేడుక
తల్లిదండ్రుల నడుమ జన్మదినం చేసుకుంటున్న మిస్బా
కల్లూరుకు చెందిన ఇంతియాజ్ కుమార్తె మిస్బా. ఆరో తరగతి చదువుతోంది. 2012 ఫిబ్రవరి 29న జన్మించింది. ఈ పన్నెండేళ్ల కాలంలో నాలుగో దఫా జన్మది వేడుకలకు సిద్ధమైంది. పాఠశాలలో తోటి విద్యార్థులు, స్నేహితులు ఏటా పుట్టినరోజు చేసుకుంటుంటే కొంతమేర చిన్నబుచ్చుకునేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. గత రెండు దఫాల్లో అలాంటి పరిస్థితి రాకుండా చాలా ఘనంగా వేడుకలు చేస్తున్నారు. ఫిబ్రవరి 29ని పండగగా చేస్తామని ఆ చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
కవలలు సైతం..
రాబియా సుల్తానా, రాజియా సుల్తానా
పులిచర్ల మండలం జ్యోతినగర్ జెండామాను గ్రామానికి చెందిన వాహిద్ కుమార్తెలు రాబియాసుల్తానా, రాజియాసుల్తానా కవలలు. ఫిబ్రవరి 29, 2008లో జన్మించారు. ఇద్దరూ కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు. ఈ ఏడు కీలకం కావడంతో వారు పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఏటా ఫిబ్రవరి 28న పుట్టినరోజు చేస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎర్రచందనం దొంగకు ఓటేస్తే.. ఏమీ మిగలదు
[ 12-05-2024]
నాకు జన్మనిచ్చి రాజకీయ ఓనమాలు నేర్పిన చిత్తూరు జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిని చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాగళంలో భాగంగా శనివారం ఆయన మురకంబట్టు కూడలిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. -
జగన్ చిమ్మిన విషం.. పట్టణాలకు శాపం
[ 12-05-2024]
ఆస్తి, ఖాళీ స్థలం, నీటి పన్నులను వడ్డీతో సహా ముక్కు పిండి వసూలు చేసే నగరపాలక, పురపాలక సంఘాలు.. ప్రజలకు కనీస సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యాయి.. -
ఆవిష్కరణలకు ఉరి.. యువతకేదీ దారి
[ 12-05-2024]
చదువు లేకున్నా అనేకమంది తమ ప్రతిభతో సరికొత్త ఆవిష్కరణలు వెలుగులోకి తెస్తున్నారు. ఇలాంటి వారు వేల సంఖ్యలో ఉన్నా వారి ప్రతిభను గుర్తించి ప్రపంచానికి చాటిచెప్పే వేదిక కావాలి. -
ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న వాలంటీర్
[ 12-05-2024]
నగరి నియోజకవర్గంలో అధికార పార్టీ నగదు పంపిణీకి తెరలేపింది. నాయకులు బహిరంగంగా ఇళ్లకు వెళ్లి ఓటర్లకు నగదు అందజేస్తున్నారు. ఈ వ్యవహారంలో పార్టీ నాయకులతో కలిసి నగదు పంపిణీలో వాలంటీర్ పాల్గొన్న ఘటన మండలంలో శనివారం చోటుచేసు కుంది. -
ప్రచారంలో పాల్గొన్నాడని.. పింఛను ఆపేశారు
[ 12-05-2024]
మండల పరిధి నడింపల్లెకు చెందిన తెదేపా కార్యకర్త క్రిష్ణప్పకు అందుతున్న సామాజిక పింఛను సాయాన్ని వైకాపా ఒత్తిళ్లతో అధికారులు నిలుపుదల చేశారు. ఈ మేరకు బాధితుడు శనివారం ఆరోపించారు. -
జగనన్న పాలనలో.. ఉద్యానానికి వట్టి చేతులే
[ 12-05-2024]
ఉద్యాన సేద్యానికి పేరుగాంచిన కుప్పం రైతులకు జగన్ ప్రభుత్వం నుంచి ఒరిగిన ప్రయోజనం శూన్యమే. నాలుగు మండలాల్లో వేల మంది రైతన్నలు లక్షల ఎకరాల్లో పూలు, పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్నారు. -
‘నారాయణస్వామీ.. నిన్ను జైల్లో పెడతా’
[ 12-05-2024]
నారాయణస్వామీ నువ్వు ఎన్ని.. సారా దస్త్ల్రాల్లో సంతకాలు పెట్టావో మాకు తెలుసు అధికారంలోకి వచ్చాక నిన్ను జైల్లో కూర్చోబెడతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ ఘాటుగా వ్యాఖ్యానించారు. -
ఛార్జీల మోతాదు పెంచిన జగన్
[ 12-05-2024]
‘ఊరి నుంచి ఎంతో తీసుకున్నారు.. తిరిగి ఇవ్వకపోతే లావైపోతారు అనేది.. శ్రీమంతుడులో మహేష్బాబు డైలాగ్. ప్రజలకు సంక్షేమం ఇచ్చాం.. అలాగే ప్రజలూ ప్రభుత్వానికి ఛార్జీల రూపంలో రెండింతలుగా ఇచ్చేయాలి అన్నది సీఎం జగన్ -
కూటమితో తిరుపతి ముఖచిత్రం మారుతుంది
[ 12-05-2024]
ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుపతిని మోదీ ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా 50వేల మందికి ఇక్కడ ఉపాధి లభించిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. -
కలగానే సాఫీ ప్రయాణం
[ 12-05-2024]
రహదారులే అభివృద్ధికి ప్రతీకలు. ఇది ఏ అభివృద్ధి చెందిన దేశాన్ని పరిశీలించినా తెలుస్తుంది. రాష్ట్రంలోని రహదారుల నిర్వహణకు పైసలు విదల్చని జగన్ సర్కార్ అంతర్రాష్ట్ర దారులను పట్టించుకోలేదు. -
వైకాపా కవ్వింపు చర్యలు
[ 12-05-2024]
భాకరాపేటలో శనివారం వైకాపా మూకలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. ఎన్డీయే కూటమి అభ్యర్థి పులివర్తి నాని ముగింపు ప్రచారంలో భాగంగా భాకరాపేటలోని గాంధీ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. -
సమానత్వమేడ జగన్!
[ 12-05-2024]
‘నాణ్యత లేని నిర్మాణాలు.. కనీసం పునాదులు కూడా లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నారు. గట్టిగా గాలి వీస్తే కూలిపోయే ఇళ్లు.. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఏ మాత్రం సరిపోవట్లేదు. అందువల్ల పనులు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం’
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
-
మీకు ఇంకా ఓటర్ స్లిప్ రాలేదా.. ఇలా చేయండి!
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
-
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
-
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
-
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు