Leap Year: లీపు సంవత్సరం వస్తే వారికి పండగే
సాధారణంగా చిన్నారులకు ఏటా పుట్టినరోజును తల్లిదండ్రులు వేడుకగా నిర్వహిస్తారు. వివాహ వార్షికోత్సవాలను పెద్దలు సైతం జరుపుకొంటారు. అయితే వారికి ఇలాంటి వేడుకలన్నీ నాలుగేళ్లకు ఓసారి మాత్రమే వస్తుంటాయి.
పుంగనూరు, కల్లూరు, న్యూస్టుడే: సాధారణంగా చిన్నారులకు ఏటా పుట్టినరోజును తల్లిదండ్రులు వేడుకగా నిర్వహిస్తారు. వివాహ వార్షికోత్సవాలను పెద్దలు సైతం జరుపుకొంటారు. అయితే వారికి ఇలాంటి వేడుకలన్నీ నాలుగేళ్లకు ఓసారి మాత్రమే వస్తుంటాయి. పుట్టినరోజు, పెళ్లిరోజు తదితర వేడుకల కోసం అంతవరకు నిరీక్షించాల్సిందే. లీపు సంవత్సరంలో జన్మించిన, వివాహం చేసుకున్న వారికి ఫిబ్రవరి 29 చాలా ప్రత్యేకం. ఈ సంవత్సరం లీపు సంవత్సరం కావడంతో వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు జిల్లాలోని పలువురు.
నాలుగేళ్లకు ఓసారే ఎందుకంటే
ఒక ఏడాదికి 365 రోజుల 6 గంటలు సమయం. 24 ఒక రోజు లెక్కిస్తాం కాబట్టి.. ఏటా అదనంగా వచ్చిన 6 గంటలను ప్రత్యేకంగా చూపలేం. దీని కోసం నాలుగేళ్లలోని సమయాన్ని 24 గంటలుగా లెక్కించి ఫిబ్రవరి 29 ప్రకటించారు. ఏటా ఫిబ్రవరిలో 28 రోజులుంటే లీపు సంవత్సరంలో అదనంగా మరో రోజు లెక్కించి చూపుతారు.
ఎంతో ఆనందం..
భర్త మనోహర్తో జ్ఞానప్రసూన
చౌడేపల్లె మండలం బోయకొండ ఆర్ఆర్ కాలనీకి చెందిన జ్ఞానప్రసూన 1996 ఫిబ్రవరి 29న జన్మించారు. తల్లిదండ్రులు ప్యారీ, కృష్ణమూర్తి ప్రతిసారి ఘనంగా చేసేవారు. 2016లో మనోహర్తో వివాహమైంది. అప్పటి నుంచి భర్త, తల్లిదండ్రుల సమక్షంలో వేడుకలు జరుపుకొంటున్నారు. నాలుగేళ్లకు ఒకసారి వస్తుండటంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితుల మధ్య వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు.
పన్నెండేళ్లు.. నాలుగో జన్మదిన వేడుక
తల్లిదండ్రుల నడుమ జన్మదినం చేసుకుంటున్న మిస్బా
కల్లూరుకు చెందిన ఇంతియాజ్ కుమార్తె మిస్బా. ఆరో తరగతి చదువుతోంది. 2012 ఫిబ్రవరి 29న జన్మించింది. ఈ పన్నెండేళ్ల కాలంలో నాలుగో దఫా జన్మది వేడుకలకు సిద్ధమైంది. పాఠశాలలో తోటి విద్యార్థులు, స్నేహితులు ఏటా పుట్టినరోజు చేసుకుంటుంటే కొంతమేర చిన్నబుచ్చుకునేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. గత రెండు దఫాల్లో అలాంటి పరిస్థితి రాకుండా చాలా ఘనంగా వేడుకలు చేస్తున్నారు. ఫిబ్రవరి 29ని పండగగా చేస్తామని ఆ చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
కవలలు సైతం..
రాబియా సుల్తానా, రాజియా సుల్తానా
పులిచర్ల మండలం జ్యోతినగర్ జెండామాను గ్రామానికి చెందిన వాహిద్ కుమార్తెలు రాబియాసుల్తానా, రాజియాసుల్తానా కవలలు. ఫిబ్రవరి 29, 2008లో జన్మించారు. ఇద్దరూ కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు. ఈ ఏడు కీలకం కావడంతో వారు పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఏటా ఫిబ్రవరి 28న పుట్టినరోజు చేస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్