‘పెట్రో’గిపోతున్న జగన్.. ఇంధన ధరలు పెంచి దోపిడీ
మధ్య, పేద వర్గాల లక్ష్యంగా జగన్ దోపిడీ చేస్తున్నారు. వారికి ఇచ్చినట్లే ఇచ్చి జలగలా వెనక్కి లాగేస్తున్నారు. పది రూపాయిలు ఇచ్చి రూ. 100 లాగేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
ఏటా రూ.2,009 కోట్ల మేర అదనపు బాదుడు
రైతుల నడ్డి విరిచిన వైనం.. ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లపై భారం
గూడూరు, న్యూస్టుడే: మధ్య, పేద వర్గాల లక్ష్యంగా జగన్ దోపిడీ చేస్తున్నారు. వారికి ఇచ్చినట్లే ఇచ్చి జలగలా వెనక్కి లాగేస్తున్నారు. పది రూపాయిలు ఇచ్చి రూ. 100 లాగేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు ఐదేళ్లలో 20 దఫాలుగా పెంచి దోచుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తక్కువ ధరలకే ఇంధనం దొరుకుతుండగా మన రాష్ట్రంలో అదనపు ధరలు వసూలు చేస్తున్నారు.
- నాడు-నేడు ఎంతో వ్యత్యాసం: నాడు పెట్రోల్ రూ.79.11 నేడు రూ.109.93 కాగా.. డిజిల్ ధర నాడు రూ.70.77 కాగా ప్రస్తుతం రూ.97.40 వసూలు చేస్తున్నారు. తెదేపా ప్రభుత్వంతో పోలిస్తే పెట్రోల్ ధర లీటరుకు రూ.30.82 పెరిగింది. డిజిల్ ధర ఇదే తీరుగా రూ.26.63 పెంచి వసూలు చేస్తున్నారు.
- రవాణా రంగం కుదేలు.. సరకు రవాణాలో ప్రధానమైన ట్రక్కుల నిర్వహణ భారమైంది. లారీ యజమానులు వేల మంది దివాలా తీశారు. ఏళ్ల తరబడి వ్యాపారం చేస్తున్న యాజమానులు బికారీలుగా మారిపోయారు. ఏటికేడు పెరుగుతున్న ధరల భారంతోపాటు రోడ్ల నిర్వహణ గాలికి వదిలేశారు. దీంతో వాహనాల నిర్వహణ భారం కావడంతో లారీలు నడపలేక వదిలేశారు. వీటి కంతులు చెల్లించక వాటిని సంస్థలే స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది.
పెట్రోల్ వాత రూ.630.76 కోట్లు
ఏటా రెండు జిల్లాల్లో కలిపి 20.45 కోట్ల లీటర్లు వినియోగిస్తున్నారు. ఇలా పెరిగిన ధర రూ.30.82 కాగా ఏటా 630.76 కోట్లు అదనపు భారం వాహనదారులపై పడింది. అదే విధంగా డిజిల్ భారం 1378.29 కోట్లు.. ఏటా 51.75 కోట్ల లీటర్లు డిజిల్ వినియోగిస్తున్నారు. ఇలా పెరిగిన ధర రూ.26.63 మేరకు ఏటా రూ.1,378.29 కోట్లు దోచేస్తున్నారన్న మాట. డిజిల్ ఎక్కువగా రైతులు వాడుతున్నారు. ట్రాక్టర్లు, సాగులో ఇతర యంత్రాల కోసం వినియోగిస్తున్నారు.
నాడు ఐదు వేలు.. నేడు 1,800 లీటర్లేజగనన్న దెబ్బకు పెట్రోలు బంకులు డీలా..
శాంతిపురం: శాంతిపురం మండల కేంద్రంలోని ఓ పెట్రోలు బంకులో ఐదేళ్ల కిందట రోజుకు 5 వేల లీటర్ల పైబడి డీజిల్, పెట్రోల్ విక్రయాలు సాగేవి. జగనన్న బాదుడు దెబ్బ విక్రయాలు గణనీయంగా పడిపోయి ప్రస్తుతం 1,800 లీటర్లే అమ్ముబోతుంది. పొరుగు రాష్ట్రాల్లో డీజిల్, పెట్రోలు ధరలు తక్కువగా ఉన్నందున.. ఇక్కడ విక్రయాలు సగానికి పైబడి పడిపోయినట్లు పెట్రోలు బంకు యజమాని లెక్కల శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. జగనన్న పుణ్యమా.. అని పెట్రోలు బంకుల వ్యాపారులూ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని సరిహద్దు ప్రాంత జనం డీజిల్, పెట్రోలుకు పొరుగు రాష్ట్రాలను ఆశ్రయిస్తుంటే.. ఇక్కడి బంకులు బోసిపోయి కనిపిస్తున్నాయి. మరోవైపు ఇంధన ధరల భారం అన్ని వర్గాల ప్రజలపై పడుతోంది.
కర్ణాటకకు వెళ్లి డీజిల్ తెచ్చుకుంటున్నా..:
బైరెడ్డిపల్లె, న్యూస్టుడే: జేసీబీ నడుపుకుని జీవనం సాగిస్తున్నా. పనుల కోసం రోజు 30 లీటర్ల డీజిల్ వినియోగిస్తుంటాం. ఆంధ్రలో 30 దాని కోసం రూ. 2,962 వెచ్చించాలి. కర్ణాటక సరిహద్దులో అయితే రూ. 2,583కే లభిస్తుంది. దాదాపు రూ. 379 ఆదా అవుతుంది. అవసరాన్ని బట్టి ఒక్కోసారి 100 లీటర్లు పైబడి కూడా డీజిల్ తెప్పించుకుంటాం. ఇక్కడ డీజిల్ ధరలు తగ్గిస్తే వాహన వినియోగదారులకు వ్యయప్రయాసలు తగ్గుతాయి. పొరుగు రాష్ట్రానికి వెళ్లి ఇంధనం తెచ్చుకోవడం కాస్త ఇబ్బందికరమైనా డబ్బు ఆదా అవుతుందని వెళ్తున్నా.
మంజునాథ్, లక్కనపల్లె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివర్తి నానికి భద్రత కల్పించండి.. హైకోర్టు ఆదేశం
[ 29-04-2024]
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పింఛను ఎందుకివ్వరు?: చంద్రబాబు
[ 29-04-2024]
వైకాపా కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
[ 29-04-2024]
ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని శ్రీవారిని ప్రార్థించానని సినీనటి, భాజపా నాయకురాలు జయప్రద అన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని ఆమె దర్శించుకున్నారు. -
అంతా సొంత డబ్బా.. హామీలపై మాట్లాడరేమబ్బా!
[ 29-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంకటగిరిలో నిర్వహించిన సభ ఆత్మస్తుతి, పరనిందలా సాగింది. తన హయాంలో పథకాలు తెచ్చి సామాన్యుల జీవితాలను మార్చానంటూ గొప్పలు చెప్పుకొన్న సీఎం.. చంద్రబాబు హయాంలో ఒక్క పథకం పేరు గుర్తుకురాదని చెప్పడం ప్రజలను తీవ్ర విస్మయానికి గురిచేసింది. -
మాటలే తీపి.. లబ్ధిదారులకు టోపీ
[ 29-04-2024]
పేదలకు చేదు మిగిల్చిన ఘనత జగనన్న పాలనకే దక్కుతుంది.. బియ్యం కార్డుదారులకు ఇంటికే అన్ని రకాల నిత్యావసరాలు అందజేస్తున్నామంటూ ఆర్భాటపు ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. -
దాడులు, అరాచకమే ఎజెండా
[ 29-04-2024]
అరాచకమే ఎజెండాగా ఎన్నికల్లో నెగ్గాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుయుక్తులు పన్నుతున్నారు. ఈ క్రమంలో పుంగనూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా అంటే తాజా పరిస్థితులను పరిశీలిస్తే సందేహమనే సమాధానం వస్తోంది. -
మాటల జ‘గన్’.. చేతల చూ‘ఫన్’
[ 29-04-2024]
కుప్పం పట్టణం, న్యూస్టుడే: ‘వైనాట్ కుప్పం అంటూ.. 2022 సెప్టెంబరు 23న ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల్లా కుప్పాన్ని చూస్తానని హామీ ఇచ్చారు. -
అయ్యోర్లపై అధికార బెత్తం
[ 29-04-2024]
చిత్తూరు గ్రామీణ మండలం మాపాక్షి జడ్పీ ఉన్నత పాఠశాలను ఇటీవల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాష్ తనిఖీ చేశారు. ఆ సమయంలో ఏడో తరగతిలో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. -
ఇదేం పని మురుగేషా!
[ 29-04-2024]
బోధనారంగంలో ఉత్తమ ప్రతిభకనబరిచిన ఆ ఉపాధ్యాయుడికి 2007-08 విద్యాసంవత్సరంలో జిల్లాస్థాయి అవార్డు దక్కింది. దీనిపై స్పందించిన మండల ప్రజాప్రతినిధులు.. కుటుంబ సభ్యుల పేరుతో మూడు ఇంటి పట్టాలు అందించారు. -
అయ్యా.. ఐదేళ్లూ చాలలేదా..?
[ 29-04-2024]
ఒక ప్రాంత అభివృద్ధికి రహదారులు, అద్భుతమైన కట్టడాలే కొలమానం. అలాంటిది చిత్తూరు నగరంలో రహదారులు అధ్వానంగా మారాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు నానా కష్టాలు పడుతున్నారు. -
‘అరాచక పాలనకు అంతం పలకండి’
[ 29-04-2024]
వైకాపా అరాచక పాలనకు అంతం పలికేందుకు ఎన్నికల రూపంలో అవకాశమొచ్చిందని, ప్రజలు మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ కోరారు. -
ఏం జరుగుతోంది భగవం‘తుడా’!
[ 29-04-2024]
తుడా.. ఈ పేరెత్తితే చాలు జిల్లా ప్రజల మెదళ్లు గిర్రున తిరుగుతాయి.. వందల అనుమానాలు తలెత్తుతాయి. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)ను ఒకే ఒక వ్యక్తి తన అమ్ములపొదిగా.. రహస్య స్థావరంగా మార్చేశారంటే అతిశయోక్తి కాదు.. ఆయనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి. -
దోపిడీలు చేయడంలో డిగ్రీలు
[ 29-04-2024]
ఇతరులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే డిగ్రీలు చేశారని సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ మాఫియా రాజ్యమేలుతున్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్