‘పెట్రో’గిపోతున్న జగన్.. ఇంధన ధరలు పెంచి దోపిడీ
మధ్య, పేద వర్గాల లక్ష్యంగా జగన్ దోపిడీ చేస్తున్నారు. వారికి ఇచ్చినట్లే ఇచ్చి జలగలా వెనక్కి లాగేస్తున్నారు. పది రూపాయిలు ఇచ్చి రూ. 100 లాగేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
ఏటా రూ.2,009 కోట్ల మేర అదనపు బాదుడు
రైతుల నడ్డి విరిచిన వైనం.. ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లపై భారం
గూడూరు, న్యూస్టుడే: మధ్య, పేద వర్గాల లక్ష్యంగా జగన్ దోపిడీ చేస్తున్నారు. వారికి ఇచ్చినట్లే ఇచ్చి జలగలా వెనక్కి లాగేస్తున్నారు. పది రూపాయిలు ఇచ్చి రూ. 100 లాగేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు ఐదేళ్లలో 20 దఫాలుగా పెంచి దోచుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తక్కువ ధరలకే ఇంధనం దొరుకుతుండగా మన రాష్ట్రంలో అదనపు ధరలు వసూలు చేస్తున్నారు.
- నాడు-నేడు ఎంతో వ్యత్యాసం: నాడు పెట్రోల్ రూ.79.11 నేడు రూ.109.93 కాగా.. డిజిల్ ధర నాడు రూ.70.77 కాగా ప్రస్తుతం రూ.97.40 వసూలు చేస్తున్నారు. తెదేపా ప్రభుత్వంతో పోలిస్తే పెట్రోల్ ధర లీటరుకు రూ.30.82 పెరిగింది. డిజిల్ ధర ఇదే తీరుగా రూ.26.63 పెంచి వసూలు చేస్తున్నారు.
- రవాణా రంగం కుదేలు.. సరకు రవాణాలో ప్రధానమైన ట్రక్కుల నిర్వహణ భారమైంది. లారీ యజమానులు వేల మంది దివాలా తీశారు. ఏళ్ల తరబడి వ్యాపారం చేస్తున్న యాజమానులు బికారీలుగా మారిపోయారు. ఏటికేడు పెరుగుతున్న ధరల భారంతోపాటు రోడ్ల నిర్వహణ గాలికి వదిలేశారు. దీంతో వాహనాల నిర్వహణ భారం కావడంతో లారీలు నడపలేక వదిలేశారు. వీటి కంతులు చెల్లించక వాటిని సంస్థలే స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది.
పెట్రోల్ వాత రూ.630.76 కోట్లు
ఏటా రెండు జిల్లాల్లో కలిపి 20.45 కోట్ల లీటర్లు వినియోగిస్తున్నారు. ఇలా పెరిగిన ధర రూ.30.82 కాగా ఏటా 630.76 కోట్లు అదనపు భారం వాహనదారులపై పడింది. అదే విధంగా డిజిల్ భారం 1378.29 కోట్లు.. ఏటా 51.75 కోట్ల లీటర్లు డిజిల్ వినియోగిస్తున్నారు. ఇలా పెరిగిన ధర రూ.26.63 మేరకు ఏటా రూ.1,378.29 కోట్లు దోచేస్తున్నారన్న మాట. డిజిల్ ఎక్కువగా రైతులు వాడుతున్నారు. ట్రాక్టర్లు, సాగులో ఇతర యంత్రాల కోసం వినియోగిస్తున్నారు.
నాడు ఐదు వేలు.. నేడు 1,800 లీటర్లేజగనన్న దెబ్బకు పెట్రోలు బంకులు డీలా..
శాంతిపురం: శాంతిపురం మండల కేంద్రంలోని ఓ పెట్రోలు బంకులో ఐదేళ్ల కిందట రోజుకు 5 వేల లీటర్ల పైబడి డీజిల్, పెట్రోల్ విక్రయాలు సాగేవి. జగనన్న బాదుడు దెబ్బ విక్రయాలు గణనీయంగా పడిపోయి ప్రస్తుతం 1,800 లీటర్లే అమ్ముబోతుంది. పొరుగు రాష్ట్రాల్లో డీజిల్, పెట్రోలు ధరలు తక్కువగా ఉన్నందున.. ఇక్కడ విక్రయాలు సగానికి పైబడి పడిపోయినట్లు పెట్రోలు బంకు యజమాని లెక్కల శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. జగనన్న పుణ్యమా.. అని పెట్రోలు బంకుల వ్యాపారులూ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని సరిహద్దు ప్రాంత జనం డీజిల్, పెట్రోలుకు పొరుగు రాష్ట్రాలను ఆశ్రయిస్తుంటే.. ఇక్కడి బంకులు బోసిపోయి కనిపిస్తున్నాయి. మరోవైపు ఇంధన ధరల భారం అన్ని వర్గాల ప్రజలపై పడుతోంది.
కర్ణాటకకు వెళ్లి డీజిల్ తెచ్చుకుంటున్నా..:
బైరెడ్డిపల్లె, న్యూస్టుడే: జేసీబీ నడుపుకుని జీవనం సాగిస్తున్నా. పనుల కోసం రోజు 30 లీటర్ల డీజిల్ వినియోగిస్తుంటాం. ఆంధ్రలో 30 దాని కోసం రూ. 2,962 వెచ్చించాలి. కర్ణాటక సరిహద్దులో అయితే రూ. 2,583కే లభిస్తుంది. దాదాపు రూ. 379 ఆదా అవుతుంది. అవసరాన్ని బట్టి ఒక్కోసారి 100 లీటర్లు పైబడి కూడా డీజిల్ తెప్పించుకుంటాం. ఇక్కడ డీజిల్ ధరలు తగ్గిస్తే వాహన వినియోగదారులకు వ్యయప్రయాసలు తగ్గుతాయి. పొరుగు రాష్ట్రానికి వెళ్లి ఇంధనం తెచ్చుకోవడం కాస్త ఇబ్బందికరమైనా డబ్బు ఆదా అవుతుందని వెళ్తున్నా.
మంజునాథ్, లక్కనపల్లె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్