AP News: రోజా ఇంట్లో నలుగురు మంత్రులు.. నగరిలో జబర్దస్త్ దోపిడీ: షర్మిల
‘నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా ఇంట్లో మొత్తం నలుగురు మంత్రులు ఉన్నారు. రోజా, ఆవిడ భర్త, ఇద్దరు అన్నలు కలిసి యథేచ్ఛగా ఇసుక మాఫియా, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నారు..
పుత్తూరులో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, పక్కన నగరి కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్రెడ్డి
ఈనాడు డిజిటల్, తిరుపతి, పుత్తూరు, న్యూస్టుడే: ‘నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా ఇంట్లో మొత్తం నలుగురు మంత్రులు ఉన్నారు. రోజా, ఆవిడ భర్త, ఇద్దరు అన్నలు కలిసి యథేచ్ఛగా ఇసుక మాఫియా, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నారు.. ఈసారి మంత్రి రోజా ఓడిపోతారు’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి పుత్తూరు కాపు వీధిలో ఏపీ న్యాయ యాత్రలో ఆమె మాట్లాడారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగనన్న ఈ జిల్లాకు ఇచ్చిన హామీలు మరిచిపోయారని, తన తండ్రి వైఎస్ గాలేరు పనులు 90శాతం పూర్తిచేస్తే, జగనన్న కనీసం పదిశాతం పనులు కూడా చేయలేదని దుయ్యపట్టారు. చేనేత కార్మికులకు 50 శాతం ఉచిత విద్యుత్తు ఇస్తామని, చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని గొప్పలు చెప్పి ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ‘ఎమ్మెల్యే రోజమ్మ ఏ ఒక్కరోజు కూడా నియోజకవర్గం కోసం పనిచేయలేదు.. కానీ నేడు మళ్లీ ఆవిడే అభ్యర్థిగా తిరుగుతూ ఓట్లు అడుగుతుంది. ఇసుక, మట్టి మాఫియా నుంచి దోచుకున్న డబ్బులే మీ అందరికీ పంచిపెడుతుంది. ఓటు ఎవరికి వేయాలో ప్రజలు ఆలోచించాలి’ అని షర్మిల పిలుపునిచ్చారు.
- అక్రమ లేఔట్లు, ఇసుక మాఫియాల ద్వారా మంత్రి రోజా అరాచకాలకు అడ్డు లేకుండాపోయిందని, రూ.కోట్ల సంపాదనలో మునిగితేలుతూ నియోజకవర్గ అభివృద్ధి గాలికి వదిలేశారని కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, నాయకులు కేశవులు, సీపీఐ నేత రామానాయుడు, సీపీఎం నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్