logo

ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు

ఎన్నికల నియమావళిని వాలంటీర్లు పట్టించుకోవడం లేదు. తాజాగా 29వ వార్డు వాలంటీరుగా పని చేస్తున్న నజీర్‌ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిని సత్కరించడం విమర్శలకు కారణమవుతోంది.

Updated : 18 Apr 2024 08:51 IST

ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిని సత్కరిస్తున్న వాలంటీరు నజీర్‌

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఎన్నికల నియమావళిని వాలంటీర్లు పట్టించుకోవడం లేదు. తాజాగా 29వ వార్డు వాలంటీరుగా పని చేస్తున్న నజీర్‌ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిని సత్కరించడం విమర్శలకు కారణమవుతోంది. గోపాలకృష్ణారెడ్డి కాలనీలో ఇంటింటా ప్రచారం సందర్భంగా వాలంటీరు నేతలతో కలసి సత్కరించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ విషయమై తెదేపా నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఃపట్టణంలోని వాలంటీర్లు నయీం(19వ వార్డు), షేక్‌ రిజ్వాన(21వ వార్డు), షేక్‌ ఫయాజ్‌(22వ వార్డు)లు వైకాపా శ్రేణులతో కలసి ప్రచారంలో పాల్గొనడంపై ఎన్నికల అధికారులు ఆరా తీశారు. ఒకటి, రెండ్రోజుల్లో తొలగించనున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు