అడుగేస్తే.. ఆక్రమణే
పురపాలక సంఘాల్లోని ప్రభుత్వ స్థలాలపై కొందరు అక్రమార్కులు కన్నేసి పాగా వేస్తున్నారు. పెద్దల సహకారంతో దర్జాగా కబ్జా చేస్త్తున్నారు.
న్యూస్టుడే, పిఠాపురం, సామర్లకోట
పురపాలక సంఘాల్లోని ప్రభుత్వ స్థలాలపై కొందరు అక్రమార్కులు కన్నేసి పాగా వేస్తున్నారు. పెద్దల సహకారంతో దర్జాగా కబ్జా చేస్త్తున్నారు. కళ్లెదుట ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటున్నా.. పురపాలక ఆదాయానికి గండిపడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదు. సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం పురపాలికల్లో భూకబ్జాలపై ‘న్యూస్టుడే’ పరిశీలన కథనం.
సామర్లకోట: నీలమ్మ చెరువు గట్టుపై భవనాలు
ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు అనువైన స్థలాలను పురపాలక అధికారులు గుర్తించి సంబంధిత శాఖకు బదలాయిస్తారు. అలాంటి స్థలాలు, చెరువు గట్లను అక్రమార్కులు ఆక్రమిస్తున్నారు. అందులో శాశ్వత భవనాలు నిర్మిస్తున్నారు. వీటికి అనుమతి లేకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అదే గూడు లేని పేదలు ప్రభుత్వ స్థలంలో చిన్న పాక వేసుకుంటే అధికారులు వెంటనే పీకిపారేస్తారు. పట్టణాల్లో పెరుగుతున్న భూ ఆక్రమణలు, అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
* సామర్లకోట పట్టణంలో పురపాలక సంఘ ఖాళీ స్థలాలు, బహిరంగ మరుగుదొడ్లు స్థలాన్ని, చెరువు గట్లను ఆక్రమించి భవనాలు నిర్మించారు. ఈ పట్టణ నడిబొడ్డున ఉన్న నీలమ్మ చెరువు నీటిని పూర్వం తాగునీటికి వినియోగించేవారు. ఈ చెరువు గట్టుపై నడక దారి, పచ్చదనంతో ఉద్యానంగా అభివృద్ధికి రూ.లక్షల్లో నిధులు వెచ్చించినా, ఆ దిశగా ప్రగతికి నోచుకోలేదు. అక్రమార్కుల చర్యలతో రోజరోజుకు చెరువు గర్భం మూసుకుపోతోంది. గట్టు ఆక్రమణకు గురవుతోంది. ఇక్కడ గట్టు చుట్టూ లయన్స్క్లబ్, వివేకానంద, సొసైటీ, పాఠశాల భవనాలు నిర్మించారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రైతు భవనం, కల్యాణ మండపం నిర్మించారు.
* పెద్దాపురం పాత బస్టాండు సమీపంలోని చెరువు ఆక్రమణకు గురైంది. దీని పక్కన ఉంటున్న వ్యక్తి తన స్థలంతో పాటు చెరువును ఆనుకుని ఉన్న సుమారు వెయ్యి గజాల స్థలాన్ని ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మించాడు. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. పట్టణంలో ఆర్అండ్బీ రహదారి పక్కన చాలా చోట్ల ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయి.
పిఠాపురం: జగ్గయ్యచెరువులో రోడ్డుపక్క ప్రభుత్వ స్థలాల్లో వ్యాపారాలు
* పిఠాపురం పట్టణంలో రోడ్ల పక్కన ప్రభుత్వ స్థలాలు ఆక్రమార్కుల గుప్పెట్లోకి వెళ్తున్నాయి. రెండేళ్ల క్రితం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్రమణలు పూర్తి స్థాయిలో తొలగించారు. మార్కెట్ సెంటర్ నుంచి జగ్గయ్య చెరువు వరకూ దుకాణాలు, ఇళ్లు కూల్చేశారు. మళ్లీ ఏడాదిలో ఆక్రమణలు పెరిగిపోయాయి. జగ్గయ్యచెరువులోని బీఎంఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాల పక్కన గతంలో దుకాణాలు తొలగించగా.. ప్రజాప్రతినిధుల అండతో కిరాణా, కూరగాయలు, అల్పాహార దుకాణాలు వెలిశాయి. రథాలపేట సెంటర్, ఆర్టీసీˆ కాంప్లెక్స్ ఏరియా ప్రాంతాల్లోనూ దుకాణాలు ఏర్పాటు చేసి, అద్దెకు ఇచ్చేశారు. జాతీయ రహదారి వెంబడి ప్రభుత్వ స్థలాల్లోనూ దుకాణాలు వెలిశాయి.
ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగిస్తాం..
ఎన్వీవీ సత్యనారాయణరావు, పురపాలక ప్రాంతీయ సంచాలకుడు, రాజమహేంద్రవరం
పురపాలక స్థలాలు ఆక్రమించడం, భవనాలు నిర్మించడం నేరం. పట్టణంలో ఆక్రమణలు తొలగిస్తున్నాం. కొందరు దౌర్జన్యంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. సర్వే చేసి చర్యలు తీసుకుంటాం. సేవా ముసుగులో అద్దెలు వసూలు చేసే సంస్థలపై విచారణ చేపడతాం. పురపాలక ఆస్తులు పరిరక్షిస్తాం. ఆదాయానికి గండిపడితే సహించం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు