ప్యారీ షుగర్స్లో మళ్లీ ప్రమాదం.. డ్రైవర్ మృతి
కాకినాడ జిల్లా వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సోమవారం లోడింగ్ యంత్రం టైర్లకు గాలి పడుతుండగా టైర్ పేలిపోయి డ్రైవర్ దుర్మరణం చెందాడు.
శివకుమార్
సర్పవరం జంక్షన్: కాకినాడ జిల్లా వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సోమవారం లోడింగ్ యంత్రం టైర్లకు గాలి పడుతుండగా టైర్ పేలిపోయి డ్రైవర్ దుర్మరణం చెందాడు. తూరంగి ప్రాంతంలోని మహాలక్ష్మినగర్కు చెందిన పెనుపోతు శివకుమార్ (34) తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గత ఎనిమిది నెలల కాలంలో జరిగిన మూడు ప్రమాదాల్లో అయిదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కాలం చెల్లిన యంత్రాలు, వాహనాల కారణంగా తాజాగా ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ పరిశ్రమ గేటు వద్ద మృతుని కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. బాధితుల తరఫున మత్స్యకార సంఘాల నాయకులు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మత్య్సకార, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేయడంతో డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి వారిని సముదాయించి కంపెనీ ప్రతినిధులతో చర్చలకు అవకాశం కల్పించారు. కంపెనీ యాజమాన్యం రూ.40 లక్షలు, వర్కుమెన్ కాంపన్షేషన్గా రూ.10 లక్షలు, గుత్తేదారు నుంచి రూ.5 లక్షలు మొత్తంగా రూ.55 లక్షల పరిహారంతో పాటు మృతుని భార్యకు కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. శివకుమార్ కంపెనీలో దాదాపు అయిదు సంవత్సరాలుగా డ్రైవర్ విధులు నిర్వహిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే...
అధికారుల నిర్లక్ష్యం, కర్మాగారంలో భద్రతా ప్రమాణాలు పాటించపోవడంతోనే ప్యారీ షుగర్స్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని సామాజిక కార్యకర్త ప్రసాద్ ఆరోపించారు. కంపెనీ గేటు వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. కంపెనీలో రెండో ప్రమాదం జరిగిన తర్వాత భద్రతా ఆడిట్ చేయించాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేసినా ఎవరూ స్పందించలేదన్నారు. యంత్ర పరికరాలతో పాటు యంత్రాల భద్రతను కూడా తనిఖీ చేయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వరుసగా జరుగుతున్న ప్రమాదాల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా యాజమాన్యాలు భద్రతా చర్యలు చేపట్టడం లేదని ఏఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు రంబాల సతీష్ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంపు వీడక.. బతుకు సాగక
[ 26-07-2024]
గోదావరి వరదలు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లంకల్లోని ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇళ్ల చుట్టూ భారీగా నీరు చేరి బాహ్య ప్రపంచంలోకి రాలేని పరిస్థితి. -
గోకులాలు వచ్చేస్తున్నాయ్..
[ 26-07-2024]
పశువులకు సంబంధించి గోకులాల పేరిట షెడ్లు నిర్మించేందుకు రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు పశుసంవర్థకశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. -
వర్షాకాలం.. డెంగీ భయం
[ 26-07-2024]
వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. మురుగు కాలువలు, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. మరోవైపు పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. -
సంరక్షణ ఆ‘మడ’ దూరం!
[ 26-07-2024]
జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా.. పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా ఉమ్మడి జిల్లాలో మడ వనాల విధ్వంసం ఆగడంలేదు. ప్రకృతి విపత్తులతోనూ మరికొంత మాయమవుతోంది. -
నరసన్నా.. అభివృద్ధి జాడ కనవా!
[ 26-07-2024]
రాష్ట్రాలే గాక ఇతర ప్రాంతాల నుంచి సైతం నిత్యం భక్తజనం పెద్దఎత్తున తరలివస్తుంటారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఈ దేవస్థానం నేడు అభివృద్ధి జాడలేక భక్తులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. -
ఒక ఇన్ఛార్జి వీసీ.. అయిదుగురు సలహాదారులు
[ 26-07-2024]
కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూకే) అయిదుగురు సలహాదారులను నియమించింది. వీరు వీసీకి సలహాదారులుగా వ్యవహరిస్తారని రిజిస్ట్రార్ సుమలత ఉత్తర్వులు జారీ చేశారు. -
అదనపు పొగాకు ఉత్పత్తిపై జరిమానా రద్దు
[ 26-07-2024]
ఈ ఏడాది పొగాకు రైతులకు కాసుల పంట పండింది. ఓవైపు మంచి ధర వస్తుండగా, మరోవైపు పంట ఉత్పత్తి పరిమాణం పెంచుతూ కేంద్రం ఆదేశించింది. -
విమాన గోపురం.. సువర్ణశోభితం
[ 26-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
ఆవ భూములు చూద్దాం!
[ 26-07-2024]
ఆవ భూములు.. ఈ పేరు వినని వారుండరు. మూడేళ్లుగా వీటిపై వివాదం రేగుతూనే ఉంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్లస్థలాల కోసం సేకరించారు. -
గురి ఉంది.. గుర్తింపే లేకుంది
[ 26-07-2024]
విశ్వవ్యాప్త క్రీడా పోటీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగేవి ఒలింపిక్స్. ఈ పోటీల్లో పాల్గొనటం ప్రతి క్రీడాకారుడి స్వప్నం. ఉమ్మడి జిల్లా నుంచి సాత్విక్ జయరాజ్ ఈ పోటీల్లో మరోసారి ప్రతిభ చూపేందుకు సిద్ధమయ్యాడు. -
భావనగర్-కాకినాడ పోర్టు రైలు దారి మళ్లింపు
[ 26-07-2024]
భావనగర్ నుంచి కాకినాడ పోర్టుకు వచ్చే రైలు(12756) దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
నిండా మునిగిన ఉద్యాన రైతు
[ 26-07-2024]
భారీ వర్షాలకు పోటెత్తుతున్న గోదావరి కోనసీమ లంకల్లోని ఉద్యాన రైతును నిండా ముంచేసింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి సముద్రంలోకి వెళ్తున్న జలాలు లంకలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఉద్యాన పంటలు ముంపునకు గురై నష్టాల్ని మిగిల్చాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
-
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే