logo

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రాజు

ది రాజమహేంద్రవరం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జీయువీబీ రాజు విజయం సాధించారు. మొత్తం 749 ఓట్లకుగాను 400 ఓట్లు పొంది ఆయన విజేతగా నిలిచారని ఎన్నికల అధికారి పి.రామరాజు ప్రకటించారు.

Published : 01 Apr 2023 05:20 IST

ఉపాధ్యక్షుడు గేదెల వెంకటేశ్వరరావు

దానవాయిపేట(రాజమహేంద్రవరం): ది రాజమహేంద్రవరం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జీయువీబీ రాజు విజయం సాధించారు. మొత్తం 749 ఓట్లకుగాను 400 ఓట్లు పొంది ఆయన విజేతగా నిలిచారని ఎన్నికల అధికారి పి.రామరాజు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా గేదెల వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా సీహెచ్‌వీ రామారావు చౌదరి, మహిళా రిప్రజటేటివ్‌గా కె.వెంకటలక్షి, పదేళ్ల సంఘం మహిళ సభ్యురాలిగా ఎండీ హజీనా బేగం, 20 ఏళ్ల సంఘం సభ్యులుగా సుమన్‌పాల్‌ విజేతలుగా నిలిచారన్నారు. ప్రధాన కార్యదర్శిగా కవి హనుమంతురావు, కోశాధికారిగా ఎంవీ దుర్గాప్రసాద్‌, పదేళ్ల సంఘం సభ్యులుగా గుమ్మడి దేవీభవానీ, సూరపురెడ్డి తాతారావుల ఎన్నిక ఏకగ్రీవమైంది. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న బార్‌ అసోసియేషన్‌ హాలులో శుక్రవారం ఉదయం జరిగిన పోలింగ్‌కు సీనియర్‌ న్యాయవాది పి.రామరాజు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అసోసియేషన్‌లో 1,350 మంది న్యాయవాదులు సభ్యులుగా ఉన్నారు. వారిలో శుక్రవారం సాయంత్రం ఎన్నికలు ముగిసే సమయానికి 749 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాత్రికి ఓట్ల లెక్కింపు పూర్తి చేసి, ఫలితాలను వెల్లడించారు.

జీయువీబీ రాజును అభినందిస్తున్న ఆయన మద్దతుదారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని