Amalapuram: జగన్ మామయ్యా.. ఇదేం తీరయ్యా..!
నా ఎస్సీ, నా ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటూ పదేపదే ప్రసంగాల్లో ప్రస్తావించే సీఎం జగన్మోహన్రెడ్డి బడుగు బలహీనవర్గాల పిల్లలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి
గోడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు
అమలాపురం కలెక్టరేట్, ముమ్మిడివరం, న్యూస్టుడే: నా ఎస్సీ, నా ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటూ పదేపదే ప్రసంగాల్లో ప్రస్తావించే సీఎం జగన్మోహన్రెడ్డి బడుగు బలహీనవర్గాల పిల్లలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే సంక్షేమ వసతి గృహాలను పెద్దగా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఉచిత వసతి, భోజనంతోపాటుగా చేతి ఖర్చులకు కూడా ప్రభుత్వమే డబ్బులు ఇస్తుందని భావించి పిల్లల్ని చేర్చితే కాస్మెటిక్ ఛార్జీలు అందక, వాటిని తల్లిదండ్రులు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తలకు నూనె, స్నానానికి సబ్బు, క్షవరం చేయించుకునేందుకూ ప్రతి నెలా పేద విద్యార్థులు ఇంటివైపు చూడాల్సివస్తోందని చెబుతున్నారు.
ప్రోత్సాహమేదీ..?
గురుకుల పాఠశాలలకు సంబంధించి అయిదు నుంచి పదో తరగతి విద్యార్థుల్లో బాలురకు నెలకు రూ.150, బాలికలకు రూ.200, ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో బాలురకు రూ.200, బాలికలకు రూ.250 చొప్పున కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాల్సిఉంది. ఇవికాకుండా బాలురకు నెలకు క్షవరం చేయించుకునేందుకు రూ.30 అదనంగా ఇచ్చేవారు. ఇవి నాలుగేళ్లుగా విడుదల చేయడం లేదని వాపోతున్నారు.
జిల్లాలో ఇలా..
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాల పరిధిలో బీసీ సంక్షేమశాఖ పరిధిలో 9 ప్రీ మెట్రిక్, 13 పోస్టు మెట్రిక్ వసతి గృహాలున్నాయి. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో 23 ప్రీ మెట్రిక్, 10 పోస్టు మెట్రిక్ వసతి గృహాలున్నాయి. వీటిలో సుమారు 7 వేలమంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరిలో బీసీ సంక్షేమశాఖ పరిధిలోని వసతిగృహాల్లో విద్యార్థులకు గతేడాది వరకు కాస్మెటిక్ ఛార్జీలు అందాయి. సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల విద్యార్థులకు నాలుగేళ్లుగా అందక ఇబ్బందిపడుతున్నారు.
క్షేత్ర స్థాయిలో చర్యలేవీ..
పేద విద్యార్థుల చదువులకు ఎంతైనా ఖర్చుచేస్తామని చెబుతున్న జగన్ మామయ్య తమకు నాలుగేళ్లుగా కాస్మెటిక్ ఛార్జీలు మంజూరుకాకున్నా పట్టించుకోవట్లేదని, క్షేత్ర స్థాయిలో ఇబ్బందులపై చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
ప్రస్తుతం ఇలా..
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత 2020 ఆగస్టు నుంచి విద్యార్థి, లేదంటే తల్లి బ్యాంకు ఖాతాకు నేరుగా కాస్మెటిక్ ఛార్జీలు జమ చేస్తామని ప్రకటించింది. కిట్ల పంపిణీ నిలిపివేసి నగదు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఉత్తర్వులు జారీ చేశారేతప్ప ఖాతాల్లో నగదు జమ కావడం లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది.
బడ్జెట్ విడుదలైంది..
సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని వసతిగృహాల విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలకు ఇటీవలే ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదలైంది. సెప్టెంబరు వరకు బిల్లులు ఆన్లైన్లో అప్లోడ్ చేశాం. త్వరలోనే వారికి జమవుతాయి.
జ్యోతిలక్ష్మీదేవి, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అధికారి
వారం రోజుల్లో రావొచ్చు..
బీసీ సంక్షేమశాఖ పరిధిలోని వసతి గృహాల విద్యార్థులకు గతేడాది వరకు ఛార్జీలు చెల్లించాం. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నిధులు విడుదల కావాల్సిఉంది. వారం రోజుల్లో రావొచ్చు.
సాంబమూర్తి, బీసీ సంక్షేమశాఖ జిల్లా ఇన్ఛార్జి అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం