పండగ ఉత్సాహం ఆవిరి.. హైదరాబాద్కు టికెట్ ధర ఏకంగా రూ.5,123!
తెలుగింటి పెద్ద పండగ సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చినవారు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఆర్టీసీ బస్సులు తగినన్ని అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్ ఆపరేటర్లు భారీగా ధరలు పెంచి వసూలు చేస్తుండటంతో హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారికి ఖర్చు తడిసిమోపెడవుతోంది.
చాలని ఆర్టీసీ బస్సులు.. ప్రైవేట్ ఆపరేటర్ల ఇష్టారాజ్యం
ఈనాడు, రాజమహేంద్రవరం; న్యూస్టుడే, వి.ఎల్.పురం: తెలుగింటి పెద్ద పండగ సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చినవారు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఆర్టీసీ బస్సులు తగినన్ని అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్ ఆపరేటర్లు భారీగా ధరలు పెంచి వసూలు చేస్తుండటంతో హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారికి ఖర్చు తడిసిమోపెడవుతోంది. నాలుగు రోజులు సరదాగా గడిపిన ఉత్సాహమంతా ఇట్టే ఆవిరవుతోంది. జిల్లా కేంద్రాలు రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్లేవారు అధికంగా ఉండటంతో పెద్ద ఎత్తున టిక్కెట్ధరలు పెంచేశారు. నాన్ ఏసీ బస్సుల్లో సైతం దాదాపు ఏసీ బస్సుల ఛార్జీలు తీసుకుంటున్నారు. స్లీపర్, సిట్టింగ్కు వ్యత్యాసం లేదన్నట్లుగా ధరలు ఉన్నాయి.
ఆర్టీసీ తీరిది..
- రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్కు ఈనెల 17న 22 ఆర్టీసీ బస్సులు నడపగా వీటిలో 7 ప్రత్యేక సర్వీసులు. 18వ తేదీ వరకు టిక్కెట్లన్నీ అయిపోయాయి. ఇవికాక విశాఖపట్నంకు అదనంగా పది బస్సులు నడిపారు.
- అమలాపురం నుంచి హైదరాబాద్కు 23 సర్వీసులు నడుపుతున్నారు. వీటిలో 12 ప్రత్యేక బస్సులు. 18వ తేదీ వరకు సీట్లు నిండుకున్నాయి.
- కాకినాడ నుంచి 15 తిప్పుతుండగా 18వ తేదీన కేవలం 40 సీట్లు మాత్రం ఖాళీ చూపిస్తున్నారు.
ప్రైవేటులో ఇలా..
రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ తదితర దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సగటున 30 ప్రైవేట్ బస్సులు ఉంటే.. సంక్రాంతి సమయంలో రోజుకు 60 నుంచి 70 వెళ్తున్నాయి. వీటిలో అనుమతులు ఎన్నింటికి ఉన్నాయో చెప్పనవసరం లేదు. తిరుగు ప్రయాణాల నేపథ్యంలో ఆదివారం వరకు ధరలు హెచ్చుగా ఉంటాయని ఆపరేటర్లు చెబుతున్నారు. ఒకవైపు నిండుగా వెళ్లి, మరోవైపు ఖాళీగా రావాల్సి ఉండటంతో డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
రైలెక్కే పరిస్థితి ఉందా..
హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నై వెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ముందుగా రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు కూడా రైళ్లలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జన్మభూమి, రత్నాచల్లోని రిజర్వేషన్ బోగీల్లోకి జనరల్ ప్రయాణికులు ప్రవేశిస్తున్నా పట్టించుకునేవారు లేరంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ దృష్ట్యా బుధవారం రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6.05 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరే ప్రత్యేక రైలు(07254) గురువారం ఉదయం 5.30 గంటలకు కాకినాడ చేరుకోనుంది. మరొకటి బుధవారం రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి గురువారం ఉదయం 7.10 గంటలకు కాకినాడ వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ వెళ్లే ప్రత్యేక రైలు గురువారం రాత్రి 9 గంటలకు కాకినాడలో బయలుదేరి శుక్రవారం ఉదయం 8.50 గంటలకు చేరుకోనుంది.
బాబోయ్ నిరీక్షణ జాబితా: 18న రాజమహేంద్రవరం నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఏ రైలు చూసినా కిక్కిరిసి ఉన్నాయి. టిక్కెట్ ప్రియంగా ఉండే వందేభారత్ ఛైర్కార్కు సైతం ఈనెల 22 వరకు వెయిటింగ్ లిస్ట్ కొనసాగుతోంది. గౌతమీ ఎక్స్ప్రెస్కైతే 18న స్లీపర్ క్లాస్ 244, 19న 145, 20న 232 మందితో నిరీక్షణ జాబితా ఉంది. గోదావరికైతే వచ్చే అయిదురోజులు 300 మార్కు దాటేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి