నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే.
అర్చకులపై దాడి ఘటనలో విమర్శలకు తావిచ్చిన కొందరి తీరు
దాడి ఘటనపై దేవాదాయ శాఖ ఆర్జేసీˆకి వివరిస్తున్న అర్చకులు (పాతచిత్రం)
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, గాంధీనగర్: తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే. రాజకీయం బుసలు కొడుతోంది.. యంత్రాంగం సాహో అంటుంది. ఐదేళ్ల వైకాపా జమానాలో జరుగుతున్నది ఇదే.. తాజాగా కాకినాడ దేవాలయం వీధిలోని పెద్ద శివాలయంలో శివయ్య సన్నిధిలోనే వైకాపా నాయకుడు ఇద్దరు అర్చకులపై దాడిచేసి.. అసభ్య పదజాలంతో దూషించిన వ్యవహారంలో ఇదే జరిగింది. తప్పుచేసిన వ్యక్తిని శిక్షించాల్సిందిపోయి.. కేసు నీరుగార్చే ప్రయత్నాలకు అధికార పార్టీ తెగబడడం విమర్శలకు తావిస్తోంది.
ఆ తీరు వివాదాస్పదం..
కాకినాడలో ఇద్దరు అర్చకులపై దాడి వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ఓటు బ్యాంకుపై ప్రభావం చూపకుండా సద్దుమణిగించే చర్యల్లో వైకాపా నేతలు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే దేవాదాయశాఖలోని కొందరి ఉద్యోగులపై ఒత్తిళ్లు పెరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైకాపా నాయకుడి చేతిలో దెబ్బలు తిన్న, అవమానానికి గురైన అర్చకులతో పోలీసులకు నేరుగా ఫిర్యాదు ఇప్పించాలి. జరిగిన విషయం వివరంగా నమోదుచేయించాలి. ఇక్కడ అదేమీ జరగలేదు. అర్చకుల నుంచి ఆలయ ఈవో రాజేశ్వరరావు ఫిర్యాదు స్వీకరించారు. కేసు తీవ్రత తగ్గేలా పైపైన క్లుప్తంగా రాయించారు. దాని ఆధారంగా ఈవో పోలీసులకు ఫిర్యాదిచ్చారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన భర్తకు ప్రాణహాని లేకుండా చూడాలని అర్చకుని భార్య మీడియా ఎదుట కోరారు.. బాధిత కుటుంబాల ఆందోళనను సైతం పరిగణనలోకి తీసుకోలేదు. దాడి ఘటనను బ్రాహ్మణ సంఘాలు జిల్లా దేవాదాయ శాఖ అధికారి పులి నారాయణమూర్తి దృష్టికి తీసుకెళ్తే.. తన పరిధిలోని అంశం కాదని.. డీసీతో మాట్లాడుకోండని తప్పించుకున్నారు. వైకాపా నాయకులకు మేలు చేయాలనే ఉద్దేశమే కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆ కెమెరానే ఎందుకు పనిచేయదు
శివాలయంలో 15 సీసీ కెమెరాలతో నిఘా ఉంటే.. దాడి జరిగిన ప్రాంతంలోని కెమెరా మాత్రమే ఎందుకు పనిచేయడంలేదన్న దానికి సమాధానం లేదు. మొత్తం మీద వైకాపా నాయకుడిని రక్షించే ప్రయత్నాల్లో కొందరు సర్వశక్తులూ ఒడ్డారు. దాడి ఘటనపైనే కాకుండా, శాఖాపరమైన లోపాలపైనా లోతుగా విచారణ జరిపి ఇలాంటివి పునరావృతం కాకుండా భరోసా ఇచ్చే చర్యలు తీసుకోవాలని అర్చక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంపు గ్రామాలను పరిశీలించిన కలెక్టర్
[ 27-07-2024]
భారీ వర్షాలతో వరద నీటిలో ఉన్న అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం గ్రామాలను కలెక్టర్ మహేశ్ కుమార్ శనివారం పరిశీలించారు. -
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
[ 27-07-2024]
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్