logo

రెండు అగ్ని ప్రమాదాలు.. రూ.11 లక్షల ఆస్తినష్టం

ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.

Published : 12 Apr 2024 10:43 IST

ప్రత్తిపాడు : ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన  పక్కుర్తి లోవరాజు అనే వ్యక్తికి చెందిన  ఇల్లు దగ్ధమైంది‌.  ఇంట్లో  సామగ్రితోపాటు నిల్వ ఉంచిన  ధాన్యం కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.  విద్యుదాఘాతం కారణంగా  ప్రమాదం జరిగిందని ప్రత్తిపాడు అగ్నిమాపక కేంద్ర సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు  రూ.10లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. 

అదేవిధంగా ఏలేశ్వరం మండలం కొండతిమ్మాపురంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సోమాల నూకరాజు అనే వ్యక్తికి  చెందిన తాటాకిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో  రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని