ప్రచారం కాదు.. ఫలితాలను చూడు జగన్ మావయ్యా
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దామన్న సీఎం జగన్మోహన్రెడ్డి మాటలు నీటిమూటలయ్యాయి. దీనికి తాజాగా వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలే నిదర్శనం.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అరకొర ఫలితాలు
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దామన్న సీఎం జగన్మోహన్రెడ్డి మాటలు నీటిమూటలయ్యాయి. దీనికి తాజాగా వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలే నిదర్శనం. ఎక్కువగా పేదింటి పిల్లలు చదువుకునే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వైకాపా సర్కారు గత అయిదేళ్లుగా మౌలిక వసతులు, బోధనా సిబ్బంది నియామకం, ఇతర సౌకర్యాలు కల్పించకపోవడంతో అరకొర ఫలితాలు మాత్రమే సాధించగలిగాయి. దీంతో నేతల మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండాపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- న్యూస్టుడే, శ్యామలాసెంటర్
రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశపరిచాయి. జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరం 45 శాతం, ద్వితీయ సంవత్సరంలో 58 శాతం మాత్రమే సాధించింది. నగరంలో ఉన్న ఏకైనా కళాశాలలో చేరేందుకు ఏటా వందలాది మంది విద్యార్థులు పోటీ పడేవారు. ఎమ్మెల్యే సిఫార్సులు సైతం తెచ్చుకొని మరీ ఇక్కడ విద్యనభ్యసిస్తుంటారు. ఇదంతా గతం. ప్రస్తుతం అధ్యాపకుల కొరత, విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజనం పథకం రద్దు చేయడం, ఆధునికీకరించని ల్యాబ్లు, పాతకాలం నాటి తరగతి గదులు వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఫలితాల్లో నానాటికీ వెనుక పడుతోంది.
పథకాల రద్దుతో ఫలితాలు తారుమారు
ఇక్కడ సౌకర్యాలు మెరుగు పరచడంలో వెనుకపడ్డారు. దీనికితోడు మండలానికొక జూనియర్ కళాశాలంటూ జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా మొదటి ఈ కళాశాలను బాలికల కళాశాలగా ప్రారంభించింది. దీనిపై విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వం కోఎడ్యుకేషన్గా మార్చింది. మధ్యాహ్న భోజనాన్ని రద్దు చేసింది. దీంతో కొంతమంది ప్రతిభ గల పేద పిల్లలు ఇతర కళాశాలలకు తరలివెళ్లిపోతున్నారు. ల్యాబ్లు, కంప్యూటర్లను ఆధునికీకరించకపోవడం వల్ల ప్రైవేటు కంప్యూటర్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. పాతకాలం నాటి ల్యాబ్లను నేటికీ ఆధునికీక రించకపోవడం, రసాయనాలు లేకపోవడం వంటి కారణాల కారణంగా చదువులో వెనకపడుతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు.
సినిమాలు: దానవాయిపేట: శ్యామల: గీతాంజలి మళ్లీ వచ్చింది, స్వామి, వీఎస్ మహల్: ది ఫ్యామిలీ స్టార్, రంభ, రాజా: బడేమియా ఛోటేమియా, శివజ్యోతి: లవ్గురు, సూర్యప్యాలెస్, అనుశ్రీ: మంజుమ్మల్ బాయ్స్, సూర్యమినీ: మైదాన్, కుమారి, అప్సర: టిల్లు స్క్వేర్, ఊర్వశి: శ్రీరంగనీతులు, మేనక: ప్రాజెక్టు-2.
ఆర్ట్స్ కళాశాల సందర్శన
దేవీచౌక్: కళాశాల విద్య కమిషనర్ పోలా భాస్కర్ శుక్రవారం ఆర్ట్స్ కళాశాలను సందర్శించారు. గ్రంథాలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత ఐడెంటిఫికేషన్, బుద్ధ భవన్లో ఏర్పాటు చేసిన స్టూడియో, తదితర విభాగాలను సందర్శించారు. ప్రిన్సిపల్ కె.రామచంద్రరావు పాల్గొన్నారు.
ఐదేళ్లుగా విడుదలకాని నిర్వహణ నిధులు
ఐదేళ్లుగా ఈ కళాశాలలకు నిర్వహణ నిధులు రాకపోవడంతో ప్రిన్సిపల్ సొంతంగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. స్టేషనరీ, హాజరు పట్టిక రిజిస్టర్లు, డైరీలు, సుద్దముక్కలు, విద్యుత్తు మరమ్మతులు, రంగులు, సామగ్రి కొనుగోలు, అంతర్గత, పబ్లిక్ పరీక్షలకు అవసరమైన నిధులకు ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఏటా నిర్వహణ నిధులు కింద చెల్లించాలి. గత ఐదేళ్లుగా ఇవేవీ ఇవ్వకపోవడంతో ఆ భారం పిల్లలపై పడుతోంది. వారు చెల్లించే అడ్మిషన్ ఫీజుతో పాటు ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. యూనిట్ పరీక్షలు, స్టేషనరీ, క్రీడలు, గ్రంథాలయం వంటి వాటికి సైతం వారినుంచే రుసుము వసూలు చేస్తున్నారు.
అంతంత మాత్రంగానే ఫలితాలు
ఈ కళాశాలలో ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 416కి 188 మందితో 45 శాతం, ద్వితీయ సంవత్సరంలో 278కి 162 మంది ఉత్తీర్ణతతో 58 శాతం, ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 313కి గాను 207 మంది ఉత్తీర్ణతతో 66 శాతం, ద్వితీయ సంవత్సరంలో 172కి 146 మంది ఉత్తీర్ణతతో 85 శాతం సాధించిందని ప్రిన్సిపల్ ఎన్ఎస్వీఎల్ నరసింహం తెలిపారు.
సౌకర్యాలు లేకుండా చదువెలా?
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలి. కళాశాల ఏకరూప దుస్తులు, షూ, బ్యాగ్లు వంటివి వర్తింపజేయాలి. అప్పుడే ఉన్నత చదువులు చదువుకునేందుకు, ఫలితాల్లో మెరుగ్గా రాణించేందుకు ఆస్కారముంటుంది.
- కె.అనిత, విద్యార్థి తల్లి
బోధించే వారేరి?
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సౌకర్యాలు మెరుగుపరచాలి. జూనియర్ లెక్చరర్ల నియామక ప్రక్రియ చేపట్టాలి. అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులను నియమించినప్పుడే విద్యలో నాణ్యత పెరుగుతుంది. ఫలితాలు మెరుగుపడతాయి.
- ఎన్.శంకర్రావు, విద్యార్థిని తండ్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడాది దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే