నీరో చక్రవర్తులు.. నీరడిగితే పట్టించుకోరు
ఈ అయిదేళ్లలో పల్లె పాలన పడకేసింది. పంచాయతీల్లో నిధులు లేక పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీరు ఇలా ప్రతిదానికీ అవస్థే. వేసవి వేళ గ్రామాల గొంతెండుతోంది. కొన్నిచోట్ల రోజుల తరబడి నీరు అందని పరిస్థితి...
నిత్యం కొళాయిల చెంత నిరీక్షణే
పి.గన్నవరంలో వృద్ధురాలిపాట్లు
ఈ అయిదేళ్లలో పల్లె పాలన పడకేసింది. పంచాయతీల్లో నిధులు లేక పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీరు ఇలా ప్రతిదానికీ అవస్థే. వేసవి వేళ గ్రామాల గొంతెండుతోంది. కొన్నిచోట్ల రోజుల తరబడి నీరు అందని పరిస్థితి...మరికొన్నిచోట్ల పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లి జలం కొనుక్కోవాల్సిన దుస్థితి.. మహిళలు నిరసన తెలుపుతున్నా పాలకులకు పట్టడం లేదు. గుక్కెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు.
పి.గన్నవరం, అయినవిల్లి: నియోజకవర్గ కేంద్రం పి.గన్నవరంలో పరిస్థితి ఇది. బిందెడు నీటికి నిత్యం కొళాయిల వద్ద మహిళలకు నిరీక్షణ తప్పడం లేదు. కొన్ని ప్రాంతాలకు మూడు రోజులైనా జలాలు రాని పరిస్థితి. నియోజకవర్గంలో ప్రజలకు రోజుకు సుమారు 1.30 కోట్ల లీటర్ల తాగునీరు సరఫరా చేయాలి. ప్రస్తుతం ఇస్తున్న జలాలు 75 లక్షల లీటర్లు. ఈ విధంగా చూస్తే రోజుకు ఇంకా 55 లక్షల లీటర్ల తాగునీటి కొరతను నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా చాలా గ్రామాల్లో రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఇంటింటికీ కొళాయి లక్ష్యంతో ప్రారంభించిన జలజీవన్మిషన్ పనులు పూర్తికాలేదు. ఒకవేళ జలజీవన్ మిషన్ నిధులతో పనులు నూరుశాతం పూర్తిచేసినా తాగునీటి పథకాలను విస్తరించకపోతే ఇంటింటికీ కొళాయిలద్వారా తాగునీరు ఇవ్వటం సాధ్యం కాదు.
ఆదుర్రు గరువులో ఖాళీ బిందెలతో మహిళలు
ఖాళీ బిందెలతో నిరసన
మామిడికుదురు: రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలంలోని ఆదుర్రు గరువులో దుస్థితి ఇది. తాగునీటి సరఫరా లేకపోవడంతో స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. నాలుగైదు రోజులుగా ఓవర్హెడ్ ట్యాంకులోకి నీరు రాకపోవడంతో తీవ్ర యాతనలు పడుతున్నామని ఆందోళన చెందారు. స్థానికంగా బావుల్లో నీరు ఉపయోగానికి పనికిరాకపోవడం వల్ల ప్రత్యామ్నాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని వాపోయారు.
పట్టణానికి వచ్చి కొనుకోవాల్సిందే..
కొవ్వూరు పట్టణం: నియోజకవర్గంలో పలు గ్రామాల్లోనూ నీటికి అవస్థలు తప్పడం లేదు. ‘మా కాలనీ నుంచి పట్టణంలోకి రెండు కిలోమీటర్లు వచ్చి మంచినీరు కొనుక్కుని తెచ్చుకుంటున్నాం. ఒక్కోసారి ఆటోపై వెళ్లి తెచ్చుకోవాలంటే రానూపోనూ ఛార్జీ రూ.40, డబ్బాకు రూ.12 అవుతోంది. బోరు వేసినా ఆ నీరు తాగేందుకు కుదరదు. రోజూ కచ్చితంగా ఒక డబ్బా తెచ్చుకోవాల్సిందే..’ పశివేదల రోడ్డులోని కాలనీ నివాసి దుర్గ ఆవేదన ఇది. బ్రిడ్జిపేట, శ్రీనివాసపురం (వాంబేకాలనీ), సత్యవతినగర్ శివారు వీధులు, యానాది కాలనీ, జగనన్న లేఅవుట్లలో నీటి ఎద్దడి పెరగడంతో అన్నిచోట్లా ఇబ్బందులు ఉన్నాయి. కొన్నిచోట్ల ట్యాంకర్లతో సరఫరా చేసే నీటికి జనం ఇలా క్యూ కట్టాల్సిన పరిస్థితులున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే