రెంటికీ చెడ్డ రేవడిలా..
రాజమహేంద్రవరం ఆనుకొని చుట్టుపక్కల ప్రాంతాలను, గ్రామ పంచాయతీలను విలీనం చేసే ప్రతిపాదనలు కొలిక్కి రాలేదు.
శివారు విలీన ప్రతిపాదిత ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు
మాట ఇచ్చి ముఖం చాటేసిన వైకాపా ప్రభుత్వం
మల్లయ్యపేటలో అపారిశుద్ధ్యం
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్టుడే: రాజమహేంద్రవరం ఆనుకొని చుట్టుపక్కల ప్రాంతాలను, గ్రామ పంచాయతీలను విలీనం చేసే ప్రతిపాదనలు కొలిక్కి రాలేదు. దీంతో గత పదేళ్ల పైబడి అక్కడ అధికారుల పాలన కొనసాగుతోంది. నగరంలో అనధికారికంగా విలీనమైనప్పటికీ ఆ మేరకు సౌకర్యాలు కల్పించడం లేదు. అటు విలీనం జరక్క, ఇటు పాలన లేకుండా దశాబ్దకాలంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్లు, కాలువలకు నోచుకోకపోవడంతో పరిస్థితి రెంటికీచెడ్డ రేవడిలా పరిస్థితి మారిందని స్థానికులు వాపోతున్నారు.
మొదట్లో 17.. తర్వాత 23
రాష్ట్ర విభజన తర్వాత నగరాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలను విలీనం చేయాలని అప్పటి తెదేపా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పట్లో సుమారు 17 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు సిద్ధపడ్డారు. ఆ తర్వాత ఆ సంఖ్యను 23కు పెంచారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ ఆయా దస్త్రాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒకపక్క గ్రామసభలు కూడా పూర్తయ్యాయి. రాజమహేంద్రవరాన్ని మహా నగరంగా ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. అటు విజయవాడ ఇటు విశాఖ మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక, చారిత్రక మహా నగరాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. దీంతో స్థానిక గ్రామాల్లో వ్యతిరేక రాజకీయాలు ఆరంభమయ్యాయి. విలీనంపై కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వం ముందు విలీనానికి మొగ్గు చూపినా, క్రమంగా మాటమార్చింది. విలీనం విధానం, ఆవశ్యకతపై కోర్టులో ప్రభుత్వం తరఫున తమ వాదనలు వినిపించాల్సి ఉంది. విలీనంతో ఎన్నికలకు వెళితే ఫలితాలు తారుమారవుతాయనే ఉద్దేశంతో నిర్ణయం మార్చుకొంది. దీంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. రెండేళ్ల క్రితం కేవలం 10 గ్రామాలను విలీనం చేస్తున్నామని ప్రకటించారు. గెజిట్ విడుదలైంది. అప్పటికే విలీనంపై కోర్టులో కేసు ఉండడంతో ముందుకు వెళ్లలేదు.
నాటినుంచి కలిసే..
విలీన ప్రతిపాదిత గ్రామాల్లో ఉన్న హుకుంపేట, కోలమూరు, కొంతమూరు, బొమ్మూరు, దివాన్చెరువు, తొర్రేడు, వెంకటనగరం, వేమగిరి, రాజవోలు, ధవళేశ్వరం తదితర గ్రామాలు నగరంలో కలిసే ఉన్నట్లు ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. వీటి రికార్డులను గతంలోనే నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకొంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు అర్బన్ సౌకర్యాలు పొందలేకపోతున్నారు.
ప్రజలకు తప్పని పాట్లు
ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోంది. ప్రత్యేకాధికారులు తమ విధుల్లో ఉండటంతో స్థానిక సమస్యలపై దృష్టిసారించలేకపోతున్నారు. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో రోడ్లు, కాలువల నిర్మాణం జరగడం లేదు. ఉన్న కాలువలనే సిబ్బంది నెలకు ఒకసారి శుభ్రం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు వచ్చేంత వరకు మురుగునీరు రోడ్లపైకి చేరి దుర్గంధం వ్యాపిస్తోంది. ఒకపక్క నగరంలో రోడ్లు, కాలువలు వ్యవస్థ ఉండగా, పక్కనే ఉన్న ఈ ప్రాంతాలలో పరిస్థితి ఘోరంగా మారింది. దశాబ్ద కాలంగా కాలువలు, రోడ్లు విస్తరణ జరగలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి కూడా కటకటలాడాల్సిన దుస్థితి. గోదావరి నీటికోసం ద్విచక్రవాహనాలపై ప్రతిరోజు నగరానికి వచ్చి తీసుకెళ్లాల్సి వస్తోంది.
ఇలా ఎందుకో..
నగరాన్ని ఆనుకొని ఉన్న రాజానగరం మండలం పరిధిలో ఉన్న లాలాచెరువు పంచాయతీని అనూహ్యంగా రాజకీయ కారణాలతో విలీనం చేయించారు. దీంతో నగరంలో నిధులు అక్కడ వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం ఆక్కడ కాలువలు, రోడ్లు, పార్కులు నిర్మాణం జరుగుతుంది. ఇదే తరహాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరగాలంటే విలీనం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం