జగనన్నా.. ఫినిష్ ఆంధ్ర..!
గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి తాజా చేపలు, రొయ్యలు తదితర మత్స్య ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫిష్ ఆంధ్ర దుకాణాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రారంభంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఊదరగొట్టారు.
ఆర్భాటంగా దుకాణాలు
ప్రభుత్వ ప్రోత్సాహం లేక మూసివేత
అల్లవరం మండలం తాడికోనలో అవుట్లెట్ బంద్..
అమలాపురం కలెక్టరేట్, న్యూస్టుడే: గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి తాజా చేపలు, రొయ్యలు తదితర మత్స్య ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫిష్ ఆంధ్ర దుకాణాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రారంభంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఊదరగొట్టారు. వీటికి తమ ప్రభుత్వమే కావాల్సిన పరికరాలను రాయితీపై అందిస్తుందని, యూనిట్ నెలకొల్పేవారు నామమాత్ర రుసుము చెల్లిస్తే సరిపోతుందని గొప్పలు చెప్పారు. తీరా చూస్తే క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది.
అందని రాయితీ.. నష్టాలే గతి..
ఈ పథకం ద్వారా యుతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని వారిని నమ్మించి దుకాణాల ఏర్పాటుకు ఉసిగొల్పారు. తీరా పథకం ప్రారంభించిన కొన్నాళ్లకే దీనికి చాప చుట్టేశారు. ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర దుకాణాల నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. ఒక్కో యూనిట్కు రూ.3 లక్షల వరకు ఇస్తామని మాయచేశారు. ఆ తరువాత రూ.2 లక్షలు అన్నారు. తీరా చూస్తే రూ. లక్షతో సరిపెట్టారు. లైవ్ ఫిష్ ట్యాంక్, ఐస్బాక్స్, ఇన్వర్టర్ తదితర వస్తువులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం ఫిష్ ఆంధ్ర దుకాణాలకు కూడా చేపలను ఇస్తుండడంతో తమకు లాభాలు రావడం లేదని నిర్వాహకులు వీటి నిర్వహణను పెద్దగా పట్టించుకోలేదు.
హబ్ లేకుండానే సరఫరా..
వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర దుకాణాల్లో బతికిన మత్స్య ఉత్పత్తులనే విక్రయించాలి. అందుకోసం వారికి అవసరమైన పరికరాలు అందజేశారు. వాస్తవానికి ఆక్వా హబ్ నుంచే అవుట్లెట్లకు చేపలు, రొయ్యలు సరఫరా కావాలి. కానీ వీటిని ఏర్పాటు చేయకుండానే మినీ ఔట్లెట్లను ప్రారంభించేశారు. దుకాణదారులకు మొదట్లో ప్రభుత్వమే చేపలు, రొయ్యలను ఇతర జిల్లాల్లోని హబ్ల నుంచి సరఫరా చేసింది. ఆ తరువాత హబ్కు, గుత్తేదారుకి రవాణా దూరం పెరగడం, ప్రభుత్వం సూచించిన నిబంధన ప్రకారం అవి చనిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిరావడం, ప్రభుత్వ ధరల ప్రకారం నష్టాలు రావడంతో పంపిణీ చేయలేక చేతులెత్తేశారు. అవుట్లెట్లు ఎక్కడికక్కడ మూతపడ్డాయి.
జిల్లాలో ఇలా..: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాల పరిధిలో 245 దుకాణాలు తెరవాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 279 మంది లబ్ధిదారులు గుర్తించారు. వీరిలో అర్హులైనవారికి ఆప్కాబ్, ఇతర జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించి అవుట్లెట్లు తెరిపించారు. కొన్ని రోజులకే నష్టాలు రావడంతో నిర్వాహకులు వాటిని మూసేశారు. ప్రస్తుతం జిల్లాలో ఒకటి, రెండు చోట్ల మాత్రమే ఈ దుకాణాల ద్వారా మత్స్య ఉత్పత్తుల అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రజాదరణకు నోచుకోని పథకాలు ప్రవేశపెట్టి, తమను ఇబ్బందులపాలు చేశారని యూనిట్ల నిర్వాహకులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంపు గ్రామాలను పరిశీలించిన కలెక్టర్
[ 27-07-2024]
భారీ వర్షాలతో వరద నీటిలో ఉన్న అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం గ్రామాలను కలెక్టర్ మహేశ్ కుమార్ శనివారం పరిశీలించారు. -
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
[ 27-07-2024]
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!