కెమెరా కళ్లు గప్చుప్ కేటుగాళ్లు హల్చల్
జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో నిఘా కెమెరాల వ్యవస్థ నిద్దరోతోంది. దీంతో ఎన్నికల వేళ భద్రత సవాల్గా మారింది. గొడవలు, కవ్వింపు చర్యలు, అక్రమ మద్యం, నగదు, బహుమతుల తరలింపు, దొంగతనాల నివారణ తదితర చర్యలకు సీసీ కెమెరాల వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుంది.
వైకాపా వచ్చాక కాకినాడలో నిఘా నేత్రం నిద్ర
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్
జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో నిఘా కెమెరాల వ్యవస్థ నిద్దరోతోంది. దీంతో ఎన్నికల వేళ భద్రత సవాల్గా మారింది. గొడవలు, కవ్వింపు చర్యలు, అక్రమ మద్యం, నగదు, బహుమతుల తరలింపు, దొంగతనాల నివారణ తదితర చర్యలకు సీసీ కెమెరాల వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుంది. ఇలాంటి వ్యవస్థ ఏడాదిన్నరగా పనిచేయడం లేదు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు, కీలక కార్యాలయాలు, రక్షణకు సంబంధించిన వ్యవస్థలు ఉన్న ప్రాంతాల్లో స్మార్ట్సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గత తెదేపా ప్రభుత్వం హయాంలో రూ.98 కోట్ల వ్యయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా నిఘా కెమెరాల వ్యవస్థను నెలకొల్పారు. జగన్ ప్రభుత్వం వచ్చాక.. ఈ సెంటర్ను గాలికి వదిలేసింది. దీని నిర్వహణ సంస్థకు రూ.కోట్లలో బకాయిలు పడటం, స్మార్ట్సిటీ కార్పొరేషన్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో నిర్వహణ అటకెక్కింది. దీంతో ఆ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకొంది.
అస్థవ్యస్థం చేశారు..
కాకినాడ ఆకర్షణీయ నగరం 37 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 50 డివిజన్లు ఉన్నాయి. సర్పవరం కూడలి, భానుగుడి కూడలి, బాలాజీచెరువు కూడలి, మెయిన్రోడ్డు, సినిమారోడ్డు, సంత మార్కెట్, కలెక్టరేట్, జడ్పీ కూడలి, గాంధీనగర్, రామారావుపే, ఏటిమొగ, ముత్తానగర్, దుమ్ములపేట, పర్లోపేట, డెయిరీ ఫారం కూడలి, సాంబమూర్తినగర్, జగన్నాథపురం, అన్నమ్మఘాటీ వంటి కీలక ప్రదేశాల్లో స్మార్ట్సిటీ కార్పొరేషన్ ద్వారా 370 సీసీ కెమెరా సర్వెలెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటిని వాటర్వర్క్సులో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. నేర పరిశోధన, ట్రాఫిక్ నియంత్రణ, వంటి కీలక చర్యలను ఈ కెమెరాలు ద్వారా పర్యవేక్షించేవారు. గుర్తించిన లోపాలు, అక్రమాలను స్మార్ట్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించడం ద్వారా నేరాల అదుపునకు ఉపయోగపడేది. గత ఏడాదిన్నరగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో పోలీసు శాఖకు భద్రత నిర్వహణ కత్తిమీద సాములా మారింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, ఇతర వ్యవస్థలకు సంబంధించిన సామగ్రి వినియోగంలో లేక పాడైపోయింది. వీటిని మనుగడలోకి తెచ్చేందుకు స్మార్ట్సిటీ అధికారులు రూ.15కోట్లతో అంచనాలు తయారు చేసి టెండర్లు పిలిచారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ వ్యవస్థల పునరుద్ధరణ నిలిచిపోయింది.
పోలీసు కెమెరాలే దిక్కు..: నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. దీని ద్వారా నగరంలో 100 సీసీ కెమెరాలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీసులు, సాంకేతిక సిబ్బందితో సీసీ కెమెరా వ్యవస్థను నిర్వహిస్తున్నారు. ఈ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నగరం అంతా విస్తరించి లేవు. దీంతో ఉన్నవాటితోనే నిర్వహణ చేస్తున్నారు. గత తెదేపా హయంలో కలెక్టరేట్లో జిల్లాస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. భవన నిర్మాణాలు పూర్తి చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక.. దీన్ని పట్టించుకోపోవడంతో ఏర్పాటు ఆగిపోయింది.
పెరుగుతున్న దొంగతనాలు..
- నగరంలో ఇటీవల రాత్రిపూట డంపరు బిన్నులను దొంగలు ఎత్తుకుపోతున్నారు. వీటిని గ్యాస్ కట్టర్ల ద్వారా విభజించి, పాత ఇనుప సామాను దుకాణాలకు విక్రయించారు. గతనెల 31న ఒకే రోజు 12 డంపరు బిన్నులు మాయమయ్యాయి. దీనిపై కేసు నమోదైంది. సీసీ కెమెరాల వ్యవస్థ పనిచేయకపోవడంతో దొంగలు దర్జాగా చోరీలకు పాల్పడుతున్నారు.
- నగరపాలక సంస్థ పరిధిలో కల్వర్టకు వేసిన ఇనుక మేన్హోల్ గ్రిల్స్ తరచూ తస్కరణకు గురవుతున్నాయి. గతంలో కొన్నిచోట్ల వీటిని గ్యాస్కట్టర్లతో తొలగించి పట్టుకు పోగా, కొత్తవి వేశారు. ఇటీవల మరో 35చోట్ల ఇనుప గ్రిల్స్ ఎత్తుకుపోయారు. వీటిని మళ్లీ కొత్తగా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు లేకపోవడం దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు.
- నగర ముఖ ద్వారాల వద్ద మూడు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వీటి వద్ద ఎన్నికల నిఘా అధికారులు పెద్ద ఎత్తున అక్రమ మద్యం, నగదు, బహుమతులు పట్టుకుంటున్నారు. నగరం వ్యాప్తంగా సీసీ కెమెరాలు లేనికారణంగా ఇవి వేర్వేరు మార్గాల్లో నగరంలోకి ప్రవేశిస్తే.. సులువుగా పట్టుకోవడం కష్టమే.
- కాకినాడ నగర నియోజకవర్గంలో 233 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో 62 సమస్యాత్మకమైనవి. వీటిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాలు లేకపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టతరంగా మారుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం