నియామకాల బూటకం.. నకిలీల నాటకం
రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందజేస్తున్నామని చెబుతున్న వైకాపా సర్కారుకు క్షేత్రస్థాయి పరిస్థితులు కనిపించడం లేదు. రాజమహేంద్రవరానికి నూతన వైద్య కళాశాలను తీసుకొచ్చి 150 ఎంబీబీఎస్ సీట్లతో పాటు బోలెడన్నీ ఉద్యోగ నియామకాలు చేపట్టా మంటున్నా.
రాజమహేంద్రవరం వైద్య కళాశాల దుస్థితి
న్యూస్టుడే, రాజమహేంద్రవరం వైద్యం
రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందజేస్తున్నామని చెబుతున్న వైకాపా సర్కారుకు క్షేత్రస్థాయి పరిస్థితులు కనిపించడం లేదు. రాజమహేంద్రవరానికి నూతన వైద్య కళాశాలను తీసుకొచ్చి 150 ఎంబీబీఎస్ సీట్లతో పాటు బోలెడన్నీ ఉద్యోగ నియామకాలు చేపట్టా మంటున్నా.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ కళాశాలకు సంబంధించి కొన్ని పోస్టుల్లో నకిలీలు కొనసాగు తున్నారన్న అంశం.. గతేడాది నవంబరులో విడుదల చేసిన 77 పోస్టుల నియామకాల్లో జాప్యం జరుగుతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నకిలీ ఉద్యోగులను తొలగించడంతో పాటు గతేడాది విడుదల చేసిన నియామక ప్రకటనకు సంబంధించి ప్రకియను కొలిక్కి తీసుకురావాలని అంతా కోరుతున్నారు.
వివరణ కోసం ఇంకెన్ని నెలలు..
జీజీహెచ్, వైద్యకళాశాల పరిధిలోని 77 పోస్టులకు గత నవంబరులో నోటిఫికేషన్ విడుదల చేసినా నేటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. 2023 డిసెంబర్ 20 నాటికే పోస్టింగులు ఇచ్చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ అతీగతీ లేదు. ఈ నియామకాలకు సంబంధించి మధ్యవర్తులు, రాజకీయ జోక్యం కారణంగా అర్హులకు అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు వినిపించాయి. వాటి జాబితా కోసం 7,115 మంది ఎదురు చూస్తున్నా నిరాశ తప్పడం లేదు. మానసిక విభాగానికి సంబంధించి ఓ పోస్టుకు విద్యార్హతకు అభ్యర్థులు అభ్యంతరాలు తెలపడంతో దాని వివరణ కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కి లేఖ రాశామని, అక్కడ తాత్సారం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఒక్కపోస్టు విద్యార్హత వివరణ కోసం మొత్తం నోటిఫికేషన్ను అయిదు నెలల నుంచి నిలిపివేయడం దారుణమని వాపోతున్నారు.
ప్రాణాలతో చెలగాటమే..
వ్యాధి నిర్ధారణ వంటి కీలక విభాగాల్లో నైపుణ్యంలేని వారు విధుల్లో ఉంటే ప్రాణాలతో చెలగాటమే. రాజమహేంద్రవరం వైద్య కళాశాల ఏర్పాటైనప్పుడు 2022లో కాకినాడ డీఎంహెచ్వో ఆధ్వర్యంలో కంబైన్డ్ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపట్టారు. ఇందులో భాగంగా మొత్తం 12 మంది ల్యాబ్టెక్నీషియన్లు ఇక్కడికి వచ్చారు. వీరిలో అయిదుగురు తగిన అర్హత, పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్, దాని రెన్యువల్ పత్రాలు లేకుండానే ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. వీరంతా ఒకేషనల్ ఎంఎల్టీ చేసిన వారే కావడం గమనార్హం. వీరు కచ్చితంగా ఏదైనా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో క్లినికల్ శిక్షణ తీసుకుని దాని ఆధారంగా పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంది. కొందరు శిక్షణ తీసుకోకపోవడం, మరికొందరు ధ్రువపత్రాలు సరిగా లేకపోవడం తదితర కారణంగా ప్రస్తుతం అవి రెన్యువల్ అవ్వడం లేదు. వీరంతా ప్రస్తుతం జీజీహెచ్లోని ల్యాబ్లో రోగులకు పరీక్షలు చేసేస్తున్నారు. ఏడాదిన్నర నుంచి వేతనాలు తీసేసుకుంటున్నారు. వారి కాంట్రాక్టు బాండు రెన్యువల్ సైతం తీసుకుంటున్నారు.
నకిలీలుంటే చర్యలు చేపడతాం..
- డాక్టర్ సౌభాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల
వైద్య కళాశాలకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్లలో నకిలీలు ఉంటే పరిశీలించి చర్యలు చేపడతాం. వారి విద్యార్హత, బోర్డు రిజిస్ట్రేషన్, రెన్యువల్ పత్రాలను తనిఖీ చేస్తాం. నకిలీ అని తేలితే చర్యలు చేపట్టడంతో పాటు వారి వేతనాలు రికవరీ చేసేలా అథారిటీకి లేఖ రాస్తాం. నోటిఫికేషన్కు సంబంధించి వైద్య విద్య సంచాలకుని కార్యాలయ ఉన్నతాధికారులతో చర్చించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే జరిగింది. త్వరలోనే తుది జాబితా ప్రచురించి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల