భక్తులను బెధరగొట్టారు
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అన్నవరం ఆలయం ఒకటి. సత్యదేవుని దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. పేద, మధ్య తరగతి భక్తులకు ఆర్థిక భారం లేకుండా దర్శనభాగ్యం కల్పించాల్సింది పోయి వైకాపా సర్కారు హయాంలో ధరల దోపిడీతో బెదరగొట్టారు.
వైకాపా ఏలుబడిలో ఎన్నెన్ని ఆర్థిక భారాలో
అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చినవారికి చుక్కలు
అన్నవరం, న్యూస్టుడే: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అన్నవరం ఆలయం ఒకటి. సత్యదేవుని దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. పేద, మధ్య తరగతి భక్తులకు ఆర్థిక భారం లేకుండా దర్శనభాగ్యం కల్పించాల్సింది పోయి వైకాపా సర్కారు హయాంలో ధరల దోపిడీతో బెదరగొట్టారు. వసతి, దర్శనం, వ్రతం ఇలా ఏవైనా తీసుకోండి.. టికెట్టు ధరలు పెంచేశారు. సీఎం జగన్ ఏలుబడిలో తట్టుకోలేని విధంగా రుసుములు ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
వసతి.. అయ్య బాబోయ్
సత్యగిరిపై నూతనంగా నిర్మించిన 138 గదుల శివసదన్ వసతి సముదాయంలో గదులకు భారీగా అద్దెలు నిర్ణయించారు. ఏసీ గది అద్దె రూ. 1,770 (అద్దె రూ.1,500, జీఎస్టీ రూ.270). సూట్ రూం అద్దె రూ.2,360 (అద్దె రూ.2వేలు, జీఎస్టీ 360). డబుల్ గది రూ.3,540 (అద్దె రూ.3 వేలు, జీఎస్టీ 540) చేశారు. పక్కనే ఉండే హరిహరసదన్ ఏసీ గది అద్దె రూ.950 కాగా, శివసదన్ అద్దె రూ.1,770 ఉంది. ఏ సముదాయంలోనూ గదులు అందుబాటులో లేకపోతే సామాన్య భక్తులు తప్పని పరిస్థితుల్లో శివ
సదన్లో తీసుకోవాల్సి వస్తోంది.
వ్రత టిక్కెట్.. భరించలేం
అన్నవరం దేవస్థానంలో రూ. 800 వ్రత టికెట్ను రూ.1000కి పెంచి గత ఏడాది నవంబరు నుంచి అమలు చేశారు. ఇక్కడ రూ.300, రూ. 800, రూ.1,500, రూ.2 వేల ధరతో వ్రతాలు నిర్వహిస్తారు. అయితే రూ.800 నుంచి రూ.1000కి పెంచడం వల్ల సామాన్య భక్తులకు భారమవుతోంది. రూ. 300, రూ.100 టికెట్ల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది. రద్దీ రోజుల్లో రూ.300 వ్రత మండపాలు సరిపోవడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సామాన్య భక్తులు రూ.వెయ్యి టికెట్టు తీసుకోవాల్సి వస్తోంది.
నీటి సీసా రూ.40
దేవస్థానంలో గత ఏడాది ఆగస్టు నుంచి ప్లాస్టిక్ నిషేధం అమలు చేశారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ స్థానంలో గాజు, మొక్కజొన్న గింజలతో తయారు చేసే సీసాల్లో మాత్రమే నీటిని కొండపై దుకాణాల్లో విక్రయించేలా చర్యలు చేపట్టారు. ప్లాస్టిక్లానే ఉండే నాన్ప్లాస్టిక్ వాటర్ బాటిల్ (ఒక లీటర్) ధర రూ. 40 కావడంతో భక్తులు ఈసురోమంటున్నారు.
ప్రదక్షిణ దర్శనం రూ.300
స్వామి శీఘ్రదర్శనం టికెట్ను ప్రదక్షిణ దర్శనంగా మార్పు చేసి రూ.300 చేశారు. గతంలో రూ.200 ఉండేది. కొండపై వివాహాలు చేసుకునేవారు ఖాళీ ప్రదేశంలో భోజనాలు తయారు చేసుకుంటే (వంట) రూ. 18 వేలు రుసుము వసూలు చేస్తున్నారు. బస్సుల్లో వచ్చే యాత్రికులు కొండ దిగువన కళాశాల మైదానంలో వాహనాలు పార్కింగ్ చేస్తుంటారు. భోజనాలు కూడా అక్కడే సిద్ధం చేసుకుంటారు. దీనికి పారిశుద్ధ్య నిర్వహణ కింద ఆరుచక్రాల వాహనాల నుంచి రూ.100, నాలుగు చక్రాల వాహనాల వద్ద రూ.50 వసూలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం