మరో 28,853 మందికి ఓటు హక్కు
జిల్లాలోని కాకినాడ పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు ఈ నెల 18 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలోని కాకినాడ పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు ఈ నెల 18 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 వరకు అర్హత ఉన్నవారందరికి ఓటు హక్కు కల్పించేందుకు ఫారం-6 దరఖాస్తులు స్వీకరించారు. కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను ఈ ఏడాది జనవరి 22న విడుదల చేశారు. 2024, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు, ఇప్పటి వరకు అర్హత ఉన్నా ఓటు నమోదు చేసుకోని వారికి కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసే అవకాశం కల్పించారు. దీనిలో భాగంగా జనవరి 22 తర్వాత ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటు కోసం 43,354 మంది దరఖాస్తు చేశారు. మంగళవారం మధ్యాహ్నం వరకు వీటిలో 28,853 మంది దరఖాస్తుదారులకు కొత్తగా ఓటు హక్కు కల్పించారు. 7,622 దరఖాస్తులు తిరస్కరించారు. ఇంకా 6,879 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నెల 20 నాటికి ఏడు నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్వో) వీటిని పరిష్కరించనున్నారు. ఇలా కొత్తగా ఓటు హక్కు పొందిన వారు వచ్చేనెల 13న జరుగున్న ఎన్నికల పోలింగ్లో ఓటేసే అవకాశం కల్పించనున్నారు.
కాకినాడ గ్రామీణంలో అత్యధిక దరఖాస్తులు
జిల్లాలో జవనరి 22 నుంచి ఈ నెల 14 వరకు కొత్తగా ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే.. కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, పిఠాపురం నియోజకవర్గాల్లో అత్యధిక దరఖాస్తులు దాఖలయ్యాయి. జనసేన అధినేత పవన్కల్యాన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 18-19 ఏళ్ల యువత 7,497 మంది ఓటు కోసం దరఖాస్తు చేయగా, ఇప్పటికి 4,908 మందికి ఓటు హక్కు కల్పించగా.. 1,394 తిరస్కరించారు. ఇంకా 1,195 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా ఇలా..
నియోజకవర్గాల వారీగా ప్రస్తుత ఓటర్లు..
జనవరి 22 నుంచి ఈ నెల 16 వరకు ఈ నియోజకవర్గాల్లో పెరిగిన ఓట్లను పరిశీలిస్తే.. అత్యధికంగా కాకినాడ గ్రామీణంలో 6,701, పిఠాపురంలో 5,092, కాకినాడ నగరంలో 4,121, జగ్గంపేటలో 3,625, తునిలో 2,878, పెద్దాపురంలో 2,621, ప్రత్తిపాడులో 2,296 మంది చొప్పున ఓటర్లు పెరిగారు.
ఎన్నికల పరిశీలకుల నియామకం
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: కాకినాడ జిల్లాకు ఎన్నికల పరిశీలకులను నియమించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారులు సాధిక్ అహ్మద్, ఆశిన్, యోగేశ్కుమార్ను, సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులు ఎస్.గణేశ్, రాజేశ్జోగేశ్పాల్ను నియమించారు. ఈ నెల 18లోగా వ్యయ పరిశీలకులు జిల్లాలో రిపోర్టు చేయాలని ఆదేశించిడంతో వీరు బుధవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి