రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు.
కలెక్టరేట్లో ప్రారంభించిన మీడియాసెల్ విభాగాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్పీ, జేసీ, ఇతర అధికారులు
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెల్ను మంగళవారం ప్రారంభించిన అనంతరం ఎస్పీ జగదీష్, జేసీ తేజ్భరత్, డీఆర్వో నరసింహులు, పార్లమెంట్ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి ఎం.కృష్ణనాయక్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రిటర్నింగ్ అధికారులు 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారని, అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమై 25 వరకు కొనసాగుతుందన్నారు. 21వ తేదీ ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఎంపీ అభ్యర్థుల నుంచి కలెక్టర్ ఛాంబర్లోను, ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ పత్రాలు స్వీకరిస్తామన్నారు. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో నలుగురిని మాత్రమే ఆర్వో ఛాంబర్లోకి అనుమతిస్తామని కలెక్టర్ తెలిపారు.
- 187 ప్రాంతాల్లో 1,577 పోలింగ్ కేంద్రాలు: మే 13న జరిగే పోలింగ్కు 187 ప్రాంతాల్లో మొత్తం 1,577 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వీటిలో 181 ప్రదేశాల్లోని 367 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించా మన్నారు. 9,644 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.
- గృహ ఓటింగ్కు కార్యాచరణ సిద్ధం: ఈ నెల 10 నాటికి జిల్లాలో 16,16,918 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వీరిలో 85 ఏళ్లు పైబడిన, 40 శాతం పైబడి అంగవైకల్యమున్న వారు 28,010 మంది ఉన్నారని, వీరికి హోం ఓటింగ్ అవకాశం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వీరినుంచి ఫారం-12డి దరఖాస్తులను ఈ నెల 22 వరకు స్వీకరిస్తామన్నారు.
- కోడ్ ఉల్లంఘనలపై 481 ఫిర్యాదులు: సి-విజిల్ ద్వారా కోడ్ ఉల్లంఘనలపై 481 ఫిర్యాదులు రాగా 382 పరిష్కరించామని, 99 ఉపసంహరించామన్నారు. కేంద్ర ప్రభుత్వ సేవా పోర్టల్ ద్వారా 312 ఫిర్యాదులు అందాయన్నారు. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 46 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామన్నారు. 1,796 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు తెలిపారు. సువిధా, ఎన్కోర్ ద్వారా ప్రచార అనుమతులకు 597 దరఖాస్తులు రాగా వీటిలో 505 వాటికి అనుమతి ఇచ్చామని, 63 తిరస్కరించగా మిగతా 29 పరిశీలనలో ఉన్నాయన్నారు.
- 6,006 మంది బైండోవర్: ఎస్పీ జగదీష్: ఇప్పటివరకు 6,006 మందిని బైండోవర్ చేసినట్లు ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. జిల్లాలో 236 లైసెన్స్ ఆయుధాలు ఉండగా వీటిలో 177 డిపాజిట్ చేశారన్నారు. 8 చెక్పోస్టులలకు అదనంగా మరో ఎనిమిది ఏర్పాటు చేశామన్నారు. రూ.5.41 కోట్ల మేర నగదు, మద్యం, మాదకద్రవ్యాలు వంటివి సీజ్ చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే