‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
సీఎం సారూ... నిధులేవండీ..!
న్యూస్టుడే, ముమ్మిడివరం: సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూర్చాల్సిఉంది. వ్యవసాయ అనుబంధశాఖల పథకాలను ‘ఆత్మ’ ద్వారా అమలు చేయాల్సిఉంది. గడిచిన ఈయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించేసింది. దీంతో అరకొర నిధులతో కార్యకలాపాలు చేపట్టాల్సిన పరిస్థితి. 2019లో ఉమ్మడి జిల్లాలో రూ.1.37 కోట్ల వ్యయంతో ఆత్మ వార్షిక ప్రణాళిక అమలైతే.. ప్రస్తుతం అది కేవలం రూ.7 లక్షలకు పడిపోయింది. అంటే ఆత్మ పథకం అమలు తీరేంటో అర్థం చేసుకోవచ్చు.
అనాస సాగు పరిశీలిస్తున్న రైతులు (పాత చిత్రం)
గతంలో ఇలా..
ఆత్మ పథకంలో గతంలో వ్యవసాయ సబ్ డివిజన్కు ఓ బీటీఎం(బ్లాక్ టెక్నికల్ మేనేజర్), ఇద్దరు ఏటీఎం(అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్)లు ఉండేవారు. వ్యవసాయ సహాయ సంచాలకుల ఆధ్వర్యంలో ఆత్మ కార్యక్రమాలు జరిగేవి. దీంట్లో పనిచేసే సిబ్బంది ఒప్పంద పద్ధతిలో పనిచేయడం, జీతాలెప్పుడొస్తాయో తెలియని పరిú్థ‡తుల్లో ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఆత్మ ప్రధాన కార్యాలయం ఉండగా.. డీపీడీ పర్యవేక్షణలో కొనసాగుతోంది. విభజిత జిల్లాలోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో డీఆర్సీలను ఏర్పాటు చేసి అక్కడ డీడీఏ, ఏడీఏ, ఏవోను ఏర్పాటు చేశారు. వీరి ద్వారానే ఆత్మ కార్యకలాపాలు నిర్వహించాల్సిఉంది. అయితే నిధుల లేమితో ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు సాగడం లేదు.
ఇదివరకు సమావేశాలు జరిగేవి..
ఆత్మ ఆధ్వర్యంలో వ్యవసాయ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద రైతులకు సమావేశాలు నిర్వహించేవారు. అమలవుతున్న కార్యక్రమాలు, ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు విజ్ఞానయాత్రలకు సంబంధించి షెడ్యూలు వంటివన్నీ వివరించేవారు. ఆసక్తి ఉన్న రైతులం యాత్రలకు వెళ్లి కొత్త విషయాలు తెలుసుకునేవాళ్లం. చాన్నాళ్లుగా సమావేశాలు నిర్వహించడం మానేశారు. అసలు పథకం ఉందో, లేదో కూడా ఎవరికీ తెలియడం లేదు.
ఎం.సత్యనారాయణ, రైతు, ముమ్మిడివరం
పథకంపై పగా..
రైతులకు నిత్యం సాంకేతిక సలహాలు, శిక్షణ తరగతులు, అవగాహన కార్యక్రమాలతోపాటు సాగులో సరికొత్త పరిజ్ఞానం అందించేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) జగనన్న పాలనలో అంతర్ధానమైంది. సీజన్ ప్రారంభం కాగానే రైతులను సాగుకు సమాయత్తం చేయడంలో కీలకపాత్ర పోషించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో 2005-06లో ఆత్మ పథకం తీసుకువచ్చారు.
పట్టించుకోక దగా..
వ్యవసాయం గురించి.. రైతుల మాట వచ్చిన ప్రతిసారీ రైతు సంక్షేమమే మా ధ్యేయమంటూ.. మాతోనే రైతులకు మేలు జరుగుతుందని.. బాకా మోగించే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆత్మ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. దీంతో దీని ఫలితాలు ఎవరికీ అందని పరిస్థితి నెలకొంది. నూతన వరి వంగడాల సాగు, సాంకేతికతను రైతులకు అందకుండా చేశారు.
రైతులకు విజ్ఞాన యాత్రలు..
వ్యవసాయ శాఖను అనుబంధంగా పనిచేసే ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు విజ్ఞాన యాత్రలు నిర్వహించేవారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు దిల్లీలోని ప్రగతి మైదాన్లో వ్యవసాయ క్షేత్రం, మహారాష్ట్ర, పంజాబ్లలో ఆదర్శంగా నిర్వహించే వ్యవసాయ క్షేత్రాల సందర్శనకు రైతులను తీసుకువెళ్లేవారు. అక్కడ పండిచే పంటలు, రైతులు వినియోగించే సాంకేతికత, నూతన వంగడాల గురించి తెలుసుకునేవారు. ఉద్యాన పంటలకు సంబంధించి కొబ్బరి తోటల్లో అంతర పంటలు, పాలీహౌస్లో ఆర్కిడ్స్, రాగులు, బొబ్బర్లు వంటి పంటల సాగు, ప్రకృతి వ్యవసాయ విధానాలు తెలుసుకోవడానికి ఈ యాత్రలు దోహదపడేవి. ప్రస్తుతం నిధుల కొరతతో అవన్నీ అటకెక్కాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంపు గ్రామాలను పరిశీలించిన కలెక్టర్
[ 27-07-2024]
భారీ వర్షాలతో వరద నీటిలో ఉన్న అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం గ్రామాలను కలెక్టర్ మహేశ్ కుమార్ శనివారం పరిశీలించారు. -
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
[ 27-07-2024]
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్