పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను.
సాగునీటి వెతలు తీర్చలేదు
కొండలు, గుట్టలూ మాయం
హామీలు గాలికొదిలి నేడు మళ్లీ సిద్ధం సభ
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపుతా. నవరత్నాలతో ప్రతి జీవితాన్నీ మార్చేస్తా.
2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్ మాటలివి.
పాదయాత్రలో జగన్ హామీలను జనం నమ్మారు. అధికారం కట్టబెట్టారు. సీఎంగా వివిధ సందర్భాల్లో జిల్లాకు వచ్చినప్పుడూ సమస్యలు విన్నారు. పరిష్కారం చూపిస్తానని, నిధులు ఇచ్చేస్తానని రూ.వందల కోట్లతో ముడిపడిన హామీలు గుప్పించారు. మళ్లీ అదే మాట.. పాత పాట చెప్పడానికి కాకినాడ సమీపంలోని సిద్ధం సభలో జగన్ పాల్గొననున్నారు. ఈసారి నమ్మాలా..? వద్దా? అని తేల్చుకోవాల్సింది ప్రజలే.
మాయ మాటలతో ముంచేశారు..
30 జులై 2018
- ఏలేరు రిజర్వాయర్ ద్వారా నియోజకవర్గంలో పొలాలకు సాగునీరు అందిస్తామని జగన్ చెప్పారు. తిరుమలాయపురం కాలువకు ఏలేరు నుంచి పంపుల ద్వారా నీరు అందిస్తామన్నారు. ఇవేవీ సాకారం కాలేదు.
- సీఎం అయిన తర్వాత గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏలేరు కుడికాలువ నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నేటికీ నిధుల ఊసేలేదు.
- పుష్కర ఎత్తిపోతల పథకంలో 14వ లిఫ్ట్ ఏర్పాటు చేసి గ్రామాలకు మంచినీరు అందిస్తామన్న దానికీ దిక్కులేదు. ఆయిల్పాం, చెరకు రైతులను ఆదుకుంటామని మాట ఇచ్చి మోసం చేశారు.
పేద రోగులతోనూ ఓట్ల ఆట..
12 జూన్ 2018
- జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఏరియా ఆసుపత్రిగా మారుస్తాం.
- జగ్గంపేట సీహెచ్సీ ప్రాంతీయ ఆసుపత్రిగా మారలేదు. ఈ ఆసుపత్రికి గండేపల్లి, కిర్లంపూడి జగ్గంపేట మండలాల నుంచి పెద్దసంఖ్యలో రోగులు వస్తారు. అత్యవసర కేసులైతే కాకినాడ తీసుకెళ్లాల్సి వస్తోంది.
26 జులై 2018
- పెద్దాపురం సీహెచ్సీని ఏరియా ఆసుపత్రిగా మార్చుతాం. వైద్యసేవలు మెరుగుపరుస్తాం. సిబ్బంది కొరత తీరుస్తాం.
- జగన్ మాటలే మిగిలాయి. పెద్దాపురం ఆసుపత్రిలో సర్జన్ కొరత వేధిస్తుండడంతో శస్త్రచికిత్స అవసరమైన కేసులు కాకినాడ తరలించాల్సి వస్తోంది.
11 ఆగస్టు 2018
- తుని ప్రాంతీయ ఆసుపత్రిని అభివృద్ధి చేసి, సిబ్బంది కొరత తీరుస్తాం.. నూతన పరికరాలు సమకూరుస్తాం..
- నాడు-నేడు పేరిట రూ.10 కోట్లతో ఆసుపత్రి అభివృద్ధి పనులు చేపడితే అయిదేళ్లలో రూ.3 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. రేడియాలజీ, డిప్యూటీ, జనరల్ సివిల్ సర్జన్, ఆర్ఎంవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ రూం అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ తదితర పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కొండలు నేలమట్టం.. మట్టి మాయం..
మట్టి తవ్వకాలను, చెరువు కబ్జాలను అడ్డుకుంటానని పెద్దాపురం పాదయాత్రలో జగన్ భరోసా ఇచ్చారు. రామేశ్వరం మెట్టలో రెండు, మూడు విద్యుత్తు స్తంభాలంత ఎత్తున్న కొండలను నేలమట్టం చేసేశారు. వీటి వెనుక వైకాపా కీలక నేత ఉండడం గమనార్హం. ఆయనకు పార్టీ పెద్దల ఆశీస్సులు ఉండడంతో వీరి జోలికి ఎవ్వరూ వెళ్లరు.
- తుని పాదయాత్రలో ఇసుక మాఫియాను అడ్డుకుంటామన్నారు. అవి ఆగలేదు సరికదా అంతకు మించిపోయాయి. అధికార పక్ష నాయకుల దన్నుతో చెలరేగిపోయారు. తాండవ నదిలో తుని గ్రామీణం, కోటనందూరు మండలాల పరిధిలో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. ఆక్వాకు పూర్వవైభవం తెస్తామని భరోసా ఇచ్చినా.. యాజమాన్యానికి ఊరట దక్కలేదు. చెరువుల కోసం అధికారపక్ష నాయకులకు ముడుపులు చెల్లిస్తేనే అనుమతులు దక్కే పరిస్థితి ఉంది.
పైసా విదల్చ లేదు
31 జులై 2018
పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించిన జగన్ ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పూర్తిచేసి నియోజకవర్గానికి సాగునీరు అందిస్తాం. పిఠాపురం బ్రాంచి కెనాల్ అభివృద్ధిచేసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇదే హామీలు పునరావృతం చేశారేగానీ.. రెండు దశల పనులకు ఇస్తానన్న రూ.292 కోట్లలో పైసా కూడా విదల్చలేదు.
భూబకా సురులు..
18 జులై 2018
కాకినాడలో భూ కబ్జాలను అరికడతానని ప్రతిపక్ష నేతగా భరోసా ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చాకే భూ ఆక్రమణలు పెరిగాయి. రూ.వందల కోట్ల విలువైన భూములు చేతులు మారాయి. అధికారపక్ష నాయకులే ప్రైవేటు సైన్యంగా ఏర్పడి ఖాళీ భూములపై కన్నేసి, కబ్జా చేస్తున్నారు. దేవాదాయ, భూదాన, జిల్లా పరిషత్తు, ప్రభుత్వ భూములకూ రక్షణ లేకుండా పోయింది. అధికారులకు వందల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లినా న్యాయం జరగడం లేదు.
- కాకినాడ గ్రామీణంలోని తమ్మవరంలో 300 ఎకరాల భూమికి సంబంధించి ఏపీఐఐసీ రైతులకు మధ్య వివాదం పరిష్కరిస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చినా నేటికీ పరిష్కారం చూపలేకపోయారు.
కాకినాడలో అన్నీ గాలి కబుర్లే..
కాకినాడ నగరంలో ఆయిల్, డీజిల్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తానని జగన్ హామీ ఇచ్చారు. అవి ఆగకపోగా నాటుసారా, గంజాయి పెరిగాయి. ఆవ స్కీం కింద నగరానికి మంచినీటి సదుపాయం మెరుగుపరుస్తామని హామీ ఇచ్చినా ఆ ఊసేలేదు. అయిదేళ్ల క్రితం నిర్వహించిన పాదయాత్రలో కాకినాడ స్మార్ట్సిటీ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తయ్యేలా సహకరిస్తామని చెప్పినా.. వాటా నిధుల విడుదలలో జాప్యంతో నేటికీ పనులు కొలిక్కిరాలేదు. రూ.వెయ్యి కోట్లతో చేపట్టే పనుల్లో చాలావరకు నాసిరకంగానే ఉన్నాయి.
సీఎంగా చెప్పినా..
ఈ ఏడాది జనవరి 3న కాకినాడలో వైఎస్ఆర్ పింఛను కానుక పెంపు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ.. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లోని జగన్నాథపురంలో తాగునీటి¨ శుద్ధి ప్లాంటు నిర్మాణానికి రూ.47 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈలోగా ఎన్నికలు వచ్చేశాయి. కాకినాడలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. ఉన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంది. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు లేక ఐటీ సంస్థలూ వెళ్లిపోయే పరిస్థితి. కాకినాడలో మెరైన్ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చినా ఆ మాటే లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడాది దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి