అసలేం జరుగుతోంది..?
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు.
అర్ధరాత్రి పూట ‘ప్రైవేటు’ నమూనాలకు పరీక్షలు
జీజీహెచ్ ల్యాబుల్లో ఇదీ పరిస్థితి
న్యూస్టుడే, రాజమహేంద్రవరం వైద్యం: ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. వచ్చినవన్నీ అందుబాటులో ఉన్నాయా లేక పక్కదారి పట్టాయా అనేది వారికే తెలియాలి.. ఇదీ రాజమహేంద్రవరం జీజీహెచ్లో పరిస్థితి. సర్వజన ఆసుపత్రిలోని రోగనిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబుల్లో పరిస్థితి మరీ వింతగా ఉంటోంది. అవసరానికి మించి రోగ నిర్ధారణ కిట్లు తెప్పించడం, అవి ఉన్నాయో లేదో తెలియని వైనం ఒకటైతే.. అందులో పనిచేసే కొందరు ల్యాబ్ టెక్నీషియన్లు బయట సొంతంగా ల్యాబులు పెట్టుకుని అక్కడి పరీక్షలు సైతం జీజీహెచ్ కిట్లను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్కు వచ్చే నమూనాలను వారి ల్యాబులకు తీసుకెళ్లి ఉచితంగా అయ్యే పరీక్షలకు డబ్బులు వసూలు చేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
అంతకుమించి..
రాజమహేంద్రవరం వైద్యశాల జీజీహెచ్గా మారిన తరువాత సిబ్బంది, వైద్యులు పెరగడంతో పాటు ల్యాబులను సైతం బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పెథాలజీగా మార్చారు. ఇందులో మైక్రోబయాలజీకి సంబంధించి ఇన్ఫ్లుయింజా వైరస్ వచ్చినప్పుడు ఉపయోగించే హెచ్1ఎన్1 కిట్లను వినియోగం కంటే 15 రెట్లు అధికంగా ఎందుకు తెప్పించారో ఆ విభాగపు అధికారులకే తెలియాలి. సాధారణంగా వీటిని అప్పుడప్పుడు మాత్రమే వినియోగిస్తుంటారు. నెలకు సుమారు పదిలోపు కూడా వినియోగించని పరిస్థితి. అలాంటిది ఒకేసారి అయిదు వేల కిట్లను ఏపీఎంఎస్ఐడీసీ నుంచి తెప్పించేశారు. బయోకెమిస్ట్రీకి సంబంధించి గుండెపోటు వచ్చిన రోగులకు పరీక్ష చేసే ట్రోపోనైన్ కిట్లను మూడువేల వరకు రప్పించారు. నెలకు సుమారు 30 కూడా వినియోగించని వీటిని మూడువేల వరకు ఇండెంట్ పెట్టి తెప్పించడం విమర్శలకు తావిస్తోంది. కీటోన్ బాడీస్ తెలుసుకునే కీటో కిట్లను సైతం మూడువేల వరకు రప్పించారు. ఇందుకోసం సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. వీటిని వెనక్కి పంపేందుకు చర్యలు చేపట్టామని ఉన్నతాధికారులు చెబుతున్నా ఇవి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయా లేక పక్కదారి పట్టాయా అన్నదానిపై దృష్టిసారించాల్సి ఉంది. ఆయా విభాగాల హెచ్వోడీల పర్యవేక్షణపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
రోగులను మభ్యపెట్టి..
ఆసుపత్రిలో పనిచేసే కొందరు ల్యాబ్ టెక్నీషియన్లు నగరంలో ప్రైవేటుగా ల్యాబ్లను ఏర్పాటు చేసుకుని ఆసుపత్రికి వస్తున్న రోగులను మభ్యపెట్టి నమూనాలను తీసుకొస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జీజీహెచ్లోని కొన్ని కిట్లను సైతం మాయం చేసి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇద్దరు ఉద్యోగులు ముఠాగా ఏర్పడి ప్రైవేటు ల్యాబులకు థైరాయిడ్ పరీక్షల కోసం వచ్చిన నమూనాలను సొమ్ములు తీసుకుని అర్ధరాత్రి సమయాల్లో జీజీహెచ్లోని యంత్రాలపై పరీక్షలు చేసేసుకుని రిపోర్టులు ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల నుంచి ఇదంతా జరుగుతున్నా ఆయా విభాగాల హెచ్వోడీలు నోరు మెదపకపోవడం గమనార్హం. రోగులపై దురుసు ప్రవర్తన, ఇష్టానుసారం మాట్లాడటం వంటి ఆరోపణలు సైతం ల్యాబ్ ఉద్యోగులపై అధికంగా ఉన్నాయి.
పరిశీలించి చర్యలు చేపడతాం...
గతంలో ఆసుపత్రికి అధికంగా వచ్చిన హెచ్1ఎన్1, ట్రోపోనైన్ కిట్లను వెనక్కి పంపేందుకు చర్యలు చేపట్టాం. ఆసుపత్రిలో అర్ధరాత్రి ప్రైవేటు నమూనాలకు పరీక్షలు చేస్తున్న అంశంపై పరిశీలించి బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తాం.
డాక్టర్ లక్ష్మీసూర్యప్రభ, సూపరింటెండెంట్, జీజీహెచ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే