సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి
చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలలేదు. పొలోమని బస్సులెక్కించారు.. సిద్ధం సభకు తరలి రావాల్సిందే అంటూ హుకుంలు జారీ చేశారు..తమకు తెలియని ప్రాంతానికి వచ్చి మండుటెండల్లో వారు నరకం చూశారు..
సీఎం రోడ్ షో, సభ కోసం దారి పొడవునా అప్రకటిత ట్రాఫిక్ ఆంక్షలు
బస్సు యాత్రలో జగన్
ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ; న్యూస్టుడే, బృందం: చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలలేదు. పొలోమని బస్సులెక్కించారు.. సిద్ధం సభకు తరలి రావాల్సిందే అంటూ హుకుంలు జారీ చేశారు..తమకు తెలియని ప్రాంతానికి వచ్చి మండుటెండల్లో వారు నరకం చూశారు..
ముఖ్యమంత్రి రోడ్షో సాగుతుందని జాతీయ రహదారిని అష్టదిగ్బంధం చేశారు.. వందలాది వాహనదారులకు తీవ్ర అవస్థలు చూపించారు. చీమలదండులా ఎటుచూసినా కదలని వాహనాలతో అత్యవసర పనులపై వివిధ జిల్లాలకు వెళ్లేవారు మాకేంటీ శిక్ష అంటూ విలవిల్లాడారు.
వైకాపా అధినేత, సీఎం జగన్ రెండురోజులపాటు చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు అవస్థలు మిగిల్చింది. రంగంపేట మండలం ఎస్టీ రాజపురంలోని బస ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 10.45 గంటలకు బయలుదేరిన యాత్ర పెద్దాపురం, సామర్లకోట కూడళ్ల మీదుగా ఉండూరు వద్ద మధ్యాహ్న భోజన శిబిరం వద్దకు చేరుకుంది. కాకినాడ గ్రామీణం అచ్చంపేట కూడలి వద్ద సాయంత్రం ‘సిద్ధం’ సభ అనంతరం పిఠాపురం, తుని మీదుగా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. సభలో ప్రసంగం మినహా మరెక్కడా జగన్ పెదవి విప్పలేదు. యాత్ర సాగిన కూడళ్లలో జనం పలచబడడం వైకాపా అధినేతను నిరుత్సాహ పరిచింది. పెద్దాపురం కూడలి వద్ద పట్టుమని పదిమంది కూడా కనిపించలేదు.
సభ కోసం వినియోగించిన బస్సుల బారులు
కీలక మార్గంలో చోదకులకు ఇక్కట్లు..
రాజానగరం-కాకినాడ మార్గంలో రోడ్డు పక్కన గురువారం రాత్రి సీఎం బస చేయడంతో అప్పటి నుంచే పోలీసులు తీవ్రమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బస ప్రాంగణానికి బస్ వెళ్లేటప్పుడు.. బయటకు వచ్చేటప్పుడు గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచే రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్లాల్సిన వాహనాలను జగ్గంపేట మీదుగా మళ్లించారు. కొందరు గ్రామాల నుంచి ఏడీబీ రోడ్డులోకి వెళ్తే బారికేడ్లతో అడ్డుకుని వెనక్కి పంపారు. రంగంపేట నుంచి రాజానగరం వెళ్లే ప్రధాన మార్గాన్ని పోలీసులు బ్లాక్ చేయడంతో అంతా గండేపల్లి మీదుగా అదనంగా పది కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి గమ్యస్థానాలకు చేరుకున్నారు.
మండుటెండలో నిరీక్షణ
యాత్ర సాగే మార్గంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో మిట్ట మధ్యాహ్నం వాహన చోదకులు, ప్రయాణికులు విలవిల్లాడారు. జగన్ యాత్ర కారణంగా ప్రత్యక్ష నకరం చూశామని జనం ఆవేదన వ్యక్తం చేశారు. రాజానగరం నుంచి కాకినాడ వరకు ఇష్టారాజ్యంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడంతో పోలీసులపై జనం మండిపడ్డారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని.. సీఎం వస్తున్నారని అడ్డుకుంటే ఎలా అంటూ నిలదీశారు.
డబ్బులిచ్చి.. తీసుకొచ్చి..
సీఎం సభకు వస్తే.. బస్సులో అన్ని ఏర్పాట్లుచేసి ఒక్కొక్కరికి రూ.200 నుంచి రూ.300 ఇస్తామని చెప్పి చాలా మందిని తరలించారు. ముందుగా డబ్బులివ్వకుండా.. సభ పూర్తయిన తరువాత వెళ్లేటప్పుడు సొమ్ములిస్తామని ఆశ చూపారు. బస్సుల్లో అల్పాహారం, మంచినీటి సీసాలు మాత్రమే సరఫరా చేశారని పలువురు తెలిపారు.
శంఖవరం: జాతీయ రహదారిపై కత్తిపూడి వద్ద శుక్రవారం రాత్రి ట్రాఫిక్
బయటకొచ్చేసిన జనం
కాకినాడ కలెక్టరేట్: అచ్చంపేట కూడలి వద్ద జరిగిన ‘సిద్ధం’ సిభలో సీఎం జగన్ ప్రసంగిస్తుండగానే జనం బయటకు వచ్చేశారు. ఆయన సాయంత్రం 4.58 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించి, 6.20 గంటలకు ముగించారు. 5.30 నుంచే జనం బయటకు వచ్చి బస్సుల వద్దకు బయలుదేరారు. స్థానిక నాయకుల ఒత్తిడి తట్టుకోలేక వచ్చామని, తిరిగి ఇళ్లకు చేరుకోడానికి ఇబ్బంది అవుతుందని మధ్యలో వచ్చేస్తున్నామని సమాధానమిచ్చారు. వచ్చామంటే వచ్చాం..వైకాపాపై ప్రేమ ఉండి కాదని’ చెప్పడం గమనార్హం.
సీఎం వస్తున్న మార్గం ఎంత సుందరంగా ఉందో
ఏడీబీ రహదారి ఆర్బీపట్నం వద్ద పోలీసులు బైకును నిలిపివేయడంతో పసికందుతో నిరీక్షణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడాది దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!