logo

పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోండి

ఎన్నికల విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తులు అందజేసేందుకు రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసినట్లు డీఐ బి.దిలీప్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 22 Apr 2024 05:39 IST

శ్యామలాసెంటర్‌, న్యూస్‌టుడే: ఎన్నికల విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తులు అందజేసేందుకు రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసినట్లు డీఐ బి.దిలీప్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను అందజేయాలన్నారు. ఫారం-12తో పాటు ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపుకార్డు, ఎన్నికల విధుల ఉత్తర్వులు, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు అందజేయాల్సి ఉంటుందన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాలకు చెందిన వారు వినియోగించుకోవాలన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో బాక్సు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు