పాలనా శాపం.. పల్లెకు దాహం
తీర ప్రాంతంలోని ప్రజల దాహార్తి తీర్చడానికి ఓఎన్జీసీ స్వచ్ఛ జలధార పథకాలను ఏర్పాటు చేసింది. వాటిని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఆ ప్రాజెక్టులు నుంచి చుక్క నీరివ్వకుండానే నిరుపయోగంగా మారాయి.
స్వచ్ఛ జలధార పథకాలపై చిన్నచూపేల
తీరప్రాంత ప్రజల గొంతు తడపలేకపోయావా
అంతర్వేది దేవస్థానంలో నిరుపయోగంగా పథకం
న్యూస్టుడే, సఖినేటిపల్లి: తీర ప్రాంతంలోని ప్రజల దాహార్తి తీర్చడానికి ఓఎన్జీసీ స్వచ్ఛ జలధార పథకాలను ఏర్పాటు చేసింది. వాటిని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఆ ప్రాజెక్టులు నుంచి చుక్క నీరివ్వకుండానే నిరుపయోగంగా మారాయి. జిల్లాలో ఓఎన్జీసీ బావులున్న సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిదేవస్థానం, అంతర్వేదికర, కేశవదాసుపాలెం, మలికిపురం మండలంలోని గొల్లపాలెం, కేశనపలిలలోన్లు, ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనుకోన మండలాల్లో రెండేసి చొప్పున ఒక్కొక్కదానికి రూ.18లక్షలు వెచ్చించి తెదేపా ప్రభుత్వం సమయంలో ఓఎన్జీసీ ఏర్పాటు చేసి 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. వీటి నుంచి తాగునీరు పొందాలంటే ఏటిఎం తరహాలో కార్డు పెడితే 20లీటర్లు నీరు వస్తుంది. దీనికోసం గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఒక కార్డు చొప్పున స్థానిక పంచాయతీలకు అప్పట్లో పంపించారు. ఇంతలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పథకాన్ని పట్టించుకోకపోవడంతో ఇటు ప్రజల దాహార్తి తీరక, అటు ఓఎన్జీసీ ఆశయం నెరవేరలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సమన్వయలోపంతో ఇవి ఇలా తయారయ్యాయి. తాగునీరు సక్రమంగా రాకపోవడంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.25కి 20లీటర్లు చొప్పున నెలకు రూ.1000కుపైగా నీటికే ఖర్చు అవుతుందని ప్రజలు వాపోతున్నారు.
సదాశయానికి నిర్లక్ష్యపు చెద...
- శంకరగుప్తం నాని, అంతర్వేది దేవస్థానం
మా గ్రామంలో తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. ఓఎన్జీసీ మంచి ఆశయంతో స్వచ్ఛజలధార ప్రాజెక్టును పెట్టింది. దీనిని జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. గత ఐదేళ్ల నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన యంత్రాలు తుప్పుపట్టిపోతున్నాయి. వీటిని వినియోగంలోకి తీసుకొస్తే ప్రైవేట్ వ్యక్తుల నుంచి మంచినీరు కొనుక్కొనే అవసరం ఉండదు.
నీరివ్వకుండానే పాడైపోయింది...
- ఉండపల్లి అంజి, కేశవదాసుపాలెం
కేశవదాసుపాలెంలో ఓఎన్జీసీ ఏర్పాటు చేసిన స్వచ్ఛజలధార ప్రాజెక్టు నీరివ్వకుండానే పాడైపోయింది. తెదేపా కృషితో వీటిని ఏర్పాటు చేశారు. అయితే జగన్ పాలనలో అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వీటిని వినియోగించకుండా వదిలేశారు. ఏర్పాటు చేసిన ఓఎన్జీసి పట్టించుకోలేదు. దీని వల్ల లక్షలు వ్యయం వృథాగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం