సారు సిద్ధమన్నారు.. జనం వెళ్లమన్నారు!
ఎన్నికలు వచ్చాయంటే పార్టీ ఏదైనా సభలు, యాత్రలు కళకళలాడతాయి. అధికార వైకాపాకు మాత్రం భిన్న పరిస్థితి.. ఆ పార్టీ అధినేత జగన్ బస్సు యాత్రగా తిరుగుతున్నా జనంలో స్పందన కరవవడంతో శ్రేణులు డీలా పడ్డాయి.
ఎన్నికల వేళ వైకాపాలో అంతర్మథనం
తుస్సుమన్న తాజా బస్సు యాత్ర
ఈనెల 18న రావులపాలెం మండలం చొప్పెల్ల వద్ద సిద్ధం బస్సు యాత్రకు జనం స్పందన ఇంతే
ఉమ్మడి జిల్లా బస్సు యాత్రలో జగన్ ఎక్కడా కనీసం పెదవి విప్పి మాట్లాడలేదు.
ఎండ తీవ్రత ఉన్నప్పుడు శీతల బస్సులోంచి నవ్వుతూ, నమస్కరిస్తూ ముందుకు కదిలారు. జనం కాస్త కనిపించిన చోట, స్థానిక అభ్యర్థులు ఒత్తిడి తెచ్చినచోట మాత్రం బస్సుపైకి ఎక్కి అభివాదం చేశారు.
అచ్చంపేటలోని సిద్ధం సభలో మాట్లాడినా.. గోదావరి జిల్లాల అభివృద్ధికి, ఇక్కడ ప్రజల మేలుకు ఏం చేస్తామనేది చెప్పలేదు. తెదేపా, జనసేన అధినేతలపై విమర్శలకే ప్రాధాన్యమిచ్చారు. వైకాపా అభ్యర్థులకు ‘మంచి’ అనే సర్టిఫికెట్ ఇచ్చి పరిచయాలు చేశారు.
ఈనాడు, కాకినాడ: ఎన్నికలు వచ్చాయంటే పార్టీ ఏదైనా సభలు, యాత్రలు కళకళలాడతాయి. అధికార వైకాపాకు మాత్రం భిన్న పరిస్థితి.. ఆ పార్టీ అధినేత జగన్ బస్సు యాత్రగా తిరుగుతున్నా జనంలో స్పందన కరవవడంతో శ్రేణులు డీలా పడ్డాయి. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఈనెల 18, 19 తేదీల్లో ఈ యాత్ర సాగింది. పెరవలిలో ప్రవేశించిన యాత్ర.. తుని మీదుగా అనకాపల్లి జిల్లాలోకి వెళ్లింది. మధ్యలో కాకినాడ గ్రామీణంలో ‘సిద్ధం’ సభ జరిగింది. ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించినప్పుడు పదిమందైనా స్వాగతం పలకడానికి లేకపోగా.. రావుపాలెం, రాజమహేంద్రవరం, కాకినాడ, తుని వంటి కీలక మార్గాల్లో సైతం జనం కానరాలేదు.
ప్రయాణికులకు నరకం
సిద్ధం సభకు లక్షల్లో హాజరవుతున్నారంటూ వైకాపా హడావుడి చేసినా.. కాకినాడ గ్రామీణంలో జరిగిన సభకు 18వేల నుంచి 20వేల మంది మాత్రమే వచ్చారన్నది నిఘావర్గాల అంచనా. పలు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు కాకినాడ మళ్లించేశారు. గంటలకొద్దీ ట్రాఫిక్లో వాహనదారులు ఇరుక్కుపోయారు. అనేక బస్సుల్లో ఇద్దరు ముగ్గురు మాత్రమే సభకు వచ్చారు. వచ్చిన వారు సైతం తిరుగు ప్రయాణంలో అవస్థలు పడ్డారు. బస్సుల రద్దు ఫలితంగా ఆర్టీసీ డిపోల్లో ప్రయాణికులు నరకం చవిచూశారు.
హామీలు అమలుకాక.. మాటలపై నమ్మకం లేక..
2019 మార్చి 11న కాకినాడ గ్రామీణం నుంచి ఎన్నికల ప్రచారానికి జగన్ శ్రీకారం చుట్టారు. ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి ఇంట, ప్రతి గ్రామంలో వైకాపా కార్యకర్తలు తిరిగి చర్చ పెట్టాలి.. 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకున్న తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధాని కావాలన్నా.. ప్రత్యేక హోదా ఫైలుపై సంతకం పెట్టిన తర్వాతే మద్దతు ఇస్తామని చెబుదాం.’ అని అన్నారు. అధికారంలోకి వచ్చాక హోదా సాధించలేదు. అయిదేళ్లుగా ఇచ్చిన హామీలు గంగలో కలిసిపోయాయి. సిద్ధం సభలోనూ హోదాపై మాట మార్చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్