కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
న్యూస్టుడే, అమలాపురం గ్రామీణం: అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అమలాపురం కూటమి ఎంపీ అభ్యర్థికి లక్ష పైచిలుకు ఓట్ల మెజార్టీ వస్తుందంటున్నారు. పోటీ అభ్యర్థి జాడ గ్రామాల్లో కనిపించకపోవడంతో అధికార పార్టీ ఓట్లూ కూటమికే పడ్డాయంటున్నారు. రైలు కూత వినేందుకైనా ఈసారి కూటమికే ఓటేశామని అధికార పార్టీ కార్యకర్తలే చెబున్నారట కదా.. ఇదీ కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న చర్చ. కొత్తపేటలో అన్నదమ్ములిద్దరూ కలిసిపోయారని గెలుపు ఖాయమనిపిస్తోందని చెబుతున్నారు. ముమ్మిడివరంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థికి 10 వేలకుపైగానే మెజార్టీ వస్తోందంటున్నారు. పి.గన్నవరంలో మెజార్టీపైనే పందేలు వేసుకునే పరిస్థితి ఉందంటున్నారు. రాజోలులో ఓ పార్టీ అభ్యర్థి గెలుపు గురించి, సీనియర్ అయిన మరో అభ్యర్థి ప్రభావంపై చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన ఇక్కడే గెలవడంతో ఈ సారి పరిస్థితిపై లెక్కలు వేసుకుంటున్నారు. రామచంద్రపురంలో కాసింత గట్టిపోటీ ఉందనే అంటున్నారు. మండపేట కూటమిదేనని ఇటీవల కొన్ని పరిణామాలు ప్రత్యర్థిని వెనక్కి నెట్టేశాయని పేర్కొంటున్నారు. ః డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ యుగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా పందేలు సాగుతున్నాయి. ఓ పక్క ఐపీఎల్ బెట్టింగులు జరుగుతుంటే.. మరోపక్క ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశాలపై పందేలు కాస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు మరో 17 రోజుల గడువు ఉండటంపై ఎవరికి వారే అంచనాలు వేసుకుని పందేల్లో మునిగితేలుతున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని అంచనావేస్తూ పందేలు రూ.లక్షల్లో కాస్తున్నారు.
ఇక్కడే అధికం..
జిల్లాలోని అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేటలో ఎక్కువగా పందేలు జరుగుతున్నాయి. అమలాపురంలో కూటమి అభ్యర్థికి 10 వేల నుంచి 15 వేల వరకు మెజార్టీ వస్తుందని పందేలు సాగుతున్నాయి. ముమ్మిడివరంలో గెలుపు ఓటములపైకాకుండా అభ్యర్థుల మెజార్టీపై మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇక కొత్తపేటలో కూటమి అభ్యర్థి ఆధిక్యంపైనా పందేలు జరుగుతుండటంతోపాటు.. ప్రత్యర్థి గెలుస్తారంటూ ఆ వర్గం కూడా పందేలకు దిగుతోంది.
ఓటింగ్ శాతమే.. కీలకం
సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే ఓటింగ్ శాతం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో పెరిగిన ఓటింగ్ శాతమే ఇప్పుడు కూటమికి అనుకూలంగా మారిందని అంచనా వేస్తున్నారు. జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న పి.గన్నవరం, రాజోలు స్థానాల్లో మెజార్టీపై యువకులు అత్యధికంగా బెట్టింగ్ వేస్తున్నారు. మండపేట, రామచంద్రపురం స్థానాల్లోనూ గెలుపు ఓటములతోపాటు మెజార్టీపైనే చర్చ సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
[ 17-06-2024]
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. -
అమ్మకు కడుపుకోతే
[ 17-06-2024]
పురిటి నొప్పులు తట్టుకుని పండంటి బిడ్డను ప్రసవించడం మహిళకు మరో జన్మ. కాన్పు కష్టమైతే అనేక సమస్యలు. ప్రసవ ద్వారం చిన్నదిగా ఉన్నా, బిడ్డ అడ్డం తిరిగినా, గర్భసంచిలో తగినంత ఉమ్మనీరు లేకపోయినా, నెలలు నిండినా కాన్పయ్యే సూచనలు -
బడి బాటతో.. బంగారు లోకం
[ 17-06-2024]
భగవంతుడు కనుక ప్రత్యక్షమైతే... నా బాల్యాన్ని తిరిగి ఇవ్వమంటాను.. ఇదీ విశ్వకవి రవీంద్రుడి మాట. బాల్యం ప్రతి వ్యక్తి జీవితంలో మరపురాని జ్ఞాపకం. బంగారు లోకంలో విహరించాల్సిన వయస్సు. -
మట్టి కొండలు మాయం..
[ 17-06-2024]
అయిదేళ్ల కాలంలో మట్టి, ఇసుక, కొండలు, గుట్టలు అనే తేడా లేకుండా వైకాపా నాయకులు సహజ వనరులను కొల్లగొట్టారు. వారి ఆగడాలు భరించలేక ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. -
పోస్టుల భర్తీకి ప్రత్యేక శ్రద్ధ
[ 17-06-2024]
వైద్యుల భర్తీ, పూర్తిస్థాయిలో వైద్యసేవలు, మెరుగైన చికిత్స అందించే రీతిలో జిల్లాలోని ఆసుపత్రులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి (డీసీహెచ్ఎస్) డాక్టర్ ఎన్పీ పద్మశ్రీరాణి అన్నారు. -
కొత్త ప్రభుత్వంపై గుత్తేదారుల ఆశలు
[ 17-06-2024]
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంపై గుత్తేదారులు కోటి ఆశలు పెట్టుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ర.భ., పంచాయతీరాజ్శాఖల్లో సుమారు రూ.468 కోట్లు వైకాపా ప్రభుత్వం గుత్తేదారులకు చెల్లించాల్సి ఉంది. -
నిర్వహణ మరిచారా.. నిండా ముంచేస్తుంది..!
[ 17-06-2024]
ఇటీవల జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువగా కార్ల టైర్లు పేలి, పంక్చరై అదుపుతప్పుతున్నాయి. -
కాకినాడలో భారీ వర్షం.. అంధకారం
[ 17-06-2024]
కాకినాడ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రెండు గంటలకు పైగా జోరు వాన కురవడంతో ఎక్కడిక్కడ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. -
ఉప్పాడ జాంధానీ.. ఉపాధి కల్పించేనా..!
[ 17-06-2024]
ఉప్పాడ జాంధానీ ఊబిలోకి చేరింది.. నేత కార్మికుల బతుకు కష్టాలతో పరేషానీ అవుతోంది.. అయిదేళ్లుగా రాయితీలు అందకపోవడం, సరైన ప్రోత్సాహం కరవవడం.. వెరసి చేనేత కుటుంబాలు వలసెళ్లిపోవడం పరిపాటైంది.. -
నన్నయలో కొత్త కోర్సులు
[ 17-06-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో యువత ఉపాధి పొందేందుకు వీలు కల్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్తగా మూడు కోర్సులు ప్రవేశపెట్టారు. ఇందుకు గాను వివిధ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. -
పవన్కల్యాణ్తో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి: వర్మ
[ 17-06-2024]
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రిగా పవన్కల్యాణ్ ప్రమాణసీˆ్వకారం చేసిన నేపథ్యంలో రాష్ట్రం, పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. -
మహిళ దారుణ హత్య
[ 17-06-2024]
మహిళ దారుణ హత్యకు గురైన విషాద ఘటన కాకినాడ గ్రామీణ మండలం సూర్యారావుపేట ఫిషింగ్ హార్బర్లో ఆదివారం చోటుచేసుకుంది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలు మేరకు..
తాజా వార్తలు (Latest News)
-
బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఐడీ ముందు హాజరైన యడియూరప్ప
-
ఛేజింగ్ల్లో కోహ్లీని ప్రత్యేకంగా నిలిపింది అదే.. విరాట్ సీక్రెట్ వెల్లడించిన అక్రమ్
-
ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు కరెంట్ బిల్లు చెల్లించాల్సిందే..సీఎం కీలక నిర్ణయం
-
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
-
అలాంటప్పుడు.. అక్కడ మ్యాచ్లు నిర్వహించొద్దు: సునీల్ గావస్కర్ ఆగ్రహం
-
నా భర్త ఫెయిల్యూర్ యాక్టర్ కాదు.. ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతోంది : వితిక