తొలగని ముంపు ముప్పు
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది.
వర్షాలు కురుస్తున్నా స్పందించని అధికార యంత్రాంగం
జలమయమైన నగరంలోని మెయిన్రోడ్డు (పాతచిత్రం)
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. ఏటా వర్షాకాలంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తమై పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది. ఇక వరదలు, భారీ వర్షాలు వస్తే చెప్పక్కర్లేదు.. సముద్రంలోకి కాలువల ద్వారా వెళ్లే నీరు వెనక్కి తన్నుకురావడంతో ముంపు అనివార్యం అవుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితులున్నా.. నగరపాలక సంస్థ పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థను అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తోంది. డ్రెయిన్లలో పేరుకుపోయిన పూడిక తొలగించకపోవడంతో అది ముంపునకు ప్రధాన కారణమవుతోంది. ఏటా ఏప్రిల్ నెలాఖరుకు కాలువల్లో పూడికతీత పనులు పూర్తిచేయాలి. ఈ ఏడాది మే నెలలో సగం రోజులు గడిచిపోయినా పూడికతీత పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎప్పటికి పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. సార్వత్రిక ఎన్నికల సాకుతో కీలకమైన డ్రెయినేజీ వ్యవస్థను అధికారులు నిర్లక్ష్యం చేశారు. అత్యవసర సేవల కిందకు వచ్చే ఈ పనులను పూర్తిచేయడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నగరంలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించి వానలు కురిస్తే మరోమారు నగరం మునకలో చిక్కుకుంటుంది.
చిన్నకాలువలను పట్టించుకోరా..?
నగరపాలక సంస్థ పరిధిలో 700 కిలోమీటర్ల పొడవునా మురుగునీటి పారుదల వ్యవస్థ విస్తరించి ఉంది. దీనిలో 44 కి.మీ. మేర మేజర్ డ్రెయినేజీ వ్యవస్థ ఉంది. ఏటా వీటిలో పూడికతీత పనులను ప్రైవేటు వ్యక్తులతో చేయిస్తారు. ఈ ఏడాది కూడా దాదాపు రూ.50 లక్షల నిధులతో పనులు అప్పగించారు. వీటిని మొక్కుబడిగా పూర్తిచేశారు. చీడీలపొర వంటి మేజరు డ్రెయిన్లో పూర్తిస్థాయిలో పూడిక తొలగలేదు. అధికారులు, గుత్తేదారు కుమ్మక్కై ఈ పనుల్లోనూ నొక్కేస్తున్నారు. అక్రమ వసూళ్లపై ఉన్న శ్రద్ధ చిన్న కాలువల్లో పూడిక తొలగింపుపై పెట్టడం లేదు. నగర పరిధిలో 15 శానిటేషన్ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలోని డ్రెయిన్లలో పూడికతీత పనులు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోనే చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికి సగం సర్కిళ్లలో పనులు పూర్తి చేయలేదు. పూర్తిస్థాయిలో వర్షాలు కురవక ముందే యుద్ధప్రాతిదిక పనులు పూర్తిచేయకపోతే నగర ప్రజలకు ముంపు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత ఏడాది ఎంతో మెరుగ్గా...!
గత ఏడాది వేసవిలో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి మహేశ్కుమార్ ఉన్నారు. ఆయన విధుల్లో చేరగానే డ్రెయినేజీ వ్యవస్థ, ముంపు నివారణ చర్యలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత, శివారు ప్రాంతాల్లోని అవుట్లెట్ల పునరుద్ధరణ, పంపుహౌస్ వంటి పనులను ఏప్రిల్ నెలలోనే పూర్తి చేయించారు. దీంతో గత ఏడాది వర్షాకాలంలో ముంపు సమస్య చాలా వరకు తప్పింది. కమిషనర్ ఆకస్మికంగా బదిలీ అయిన తరవాత డ్రెయినేజీ వ్యవస్థను మిగిలిన అధికారులు నిర్లక్ష్యం చేశారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ అధికారులు అస్సలు పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికల విధులను సాకుగా చూపించి డ్రెయిన్లలో పూడికతీత పనులను గాలికొదిలేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రత్తిపాడులో బంగారం చోరీ
[ 26-07-2024]
ప్రత్తిపాడులోని ఓ ఇంట్లో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. -
ముంపు వీడక.. బతుకు సాగక
[ 26-07-2024]
గోదావరి వరదలు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లంకల్లోని ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇళ్ల చుట్టూ భారీగా నీరు చేరి బాహ్య ప్రపంచంలోకి రాలేని పరిస్థితి. -
గోకులాలు వచ్చేస్తున్నాయ్..
[ 26-07-2024]
పశువులకు సంబంధించి గోకులాల పేరిట షెడ్లు నిర్మించేందుకు రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు పశుసంవర్థకశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. -
వర్షాకాలం.. డెంగీ భయం
[ 26-07-2024]
వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. మురుగు కాలువలు, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. మరోవైపు పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. -
సంరక్షణ ఆ‘మడ’ దూరం!
[ 26-07-2024]
జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా.. పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా ఉమ్మడి జిల్లాలో మడ వనాల విధ్వంసం ఆగడంలేదు. ప్రకృతి విపత్తులతోనూ మరికొంత మాయమవుతోంది. -
నరసన్నా.. అభివృద్ధి జాడ కనవా!
[ 26-07-2024]
రాష్ట్రాలే గాక ఇతర ప్రాంతాల నుంచి సైతం నిత్యం భక్తజనం పెద్దఎత్తున తరలివస్తుంటారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఈ దేవస్థానం నేడు అభివృద్ధి జాడలేక భక్తులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. -
ఒక ఇన్ఛార్జి వీసీ.. అయిదుగురు సలహాదారులు
[ 26-07-2024]
కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూకే) అయిదుగురు సలహాదారులను నియమించింది. వీరు వీసీకి సలహాదారులుగా వ్యవహరిస్తారని రిజిస్ట్రార్ సుమలత ఉత్తర్వులు జారీ చేశారు. -
అదనపు పొగాకు ఉత్పత్తిపై జరిమానా రద్దు
[ 26-07-2024]
ఈ ఏడాది పొగాకు రైతులకు కాసుల పంట పండింది. ఓవైపు మంచి ధర వస్తుండగా, మరోవైపు పంట ఉత్పత్తి పరిమాణం పెంచుతూ కేంద్రం ఆదేశించింది. -
విమాన గోపురం.. సువర్ణశోభితం
[ 26-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
ఆవ భూములు చూద్దాం!
[ 26-07-2024]
ఆవ భూములు.. ఈ పేరు వినని వారుండరు. మూడేళ్లుగా వీటిపై వివాదం రేగుతూనే ఉంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్లస్థలాల కోసం సేకరించారు. -
గురి ఉంది.. గుర్తింపే లేకుంది
[ 26-07-2024]
విశ్వవ్యాప్త క్రీడా పోటీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగేవి ఒలింపిక్స్. ఈ పోటీల్లో పాల్గొనటం ప్రతి క్రీడాకారుడి స్వప్నం. ఉమ్మడి జిల్లా నుంచి సాత్విక్ జయరాజ్ ఈ పోటీల్లో మరోసారి ప్రతిభ చూపేందుకు సిద్ధమయ్యాడు. -
భావనగర్-కాకినాడ పోర్టు రైలు దారి మళ్లింపు
[ 26-07-2024]
భావనగర్ నుంచి కాకినాడ పోర్టుకు వచ్చే రైలు(12756) దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
నిండా మునిగిన ఉద్యాన రైతు
[ 26-07-2024]
భారీ వర్షాలకు పోటెత్తుతున్న గోదావరి కోనసీమ లంకల్లోని ఉద్యాన రైతును నిండా ముంచేసింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి సముద్రంలోకి వెళ్తున్న జలాలు లంకలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఉద్యాన పంటలు ముంపునకు గురై నష్టాల్ని మిగిల్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్