ఖరీఫ్ సాగుపై సందిగ్ధం!
జిల్లాలో ఖరీఫ్ వరిసాగుపై సందిగ్ధం నెలకొంది. సకాలంలో పంట కాలం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
జూన్ 1 నుంచి నీటి విడుదలపై తర్జనభర్జన
నేడు వ్యవసాయ అధికారుల కీలక సమావేశం
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్: జిల్లాలో ఖరీఫ్ వరిసాగుపై సందిగ్ధం నెలకొంది. సకాలంలో పంట కాలం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చేనెల 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఖరీఫ్ సాగు ప్రణాళికలు, జూన్ 1 నుంచి గోదావరి కాలువలకు తాగునీటి విడుదల అంశాలపై అధికార యంత్రాంగం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా.. పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై అధికారులు అంతర్మథనం చెందుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరాక.. సాగునీరు విడుదల చేయాలా..?.. ఈలోగా నీరివ్వకపోతే ఖరీఫ్ పరిస్థితి ఏంటనే చర్చ తీవ్రంగా నడుస్తోంది.
ప్రభుత్వ విధానాలు.. రైతులకు శాపం
వైకాపా ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడి రాయితీ, పంట నష్టపరిహారం, బీమా, తుపాను పరిహారం విడుదలకు ఎప్పుడో బటన్నొక్కిన సీఎం జగన్.. ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా వాటిని రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయలేని దుస్థితిని తీసుకువచ్చారు. ఇవన్నీ ఇప్పుడు రైతులకు శాపంగా మారాయి. ఇక పది రోజుల్లో ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాల్సి ఉంది. జూన్ ఒకటి నుంచి కాలువలకు నీరిస్తే.. నంబరు నెలాఖరుకు కోతలు పూర్తవుతాయి. మళ్లీ డిసెంబరులో రబీ నాట్లు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఖరీప్కు సకాలంలో నీరివ్వకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్కు సంధికాలం నడుస్తోంది. కాలువలకు సాగునీరు విడుదల, వ్యవపాయ ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. ఇలాంటి తరునంలో మంగళవారం కాకినాడలో జిల్లా వ్యవసాయ శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. మండలాల వారీగా వ్యవసాయ అధికారుల నుంచి సాగు విస్తీర్ణంపై వివరాలు సేకరించనుంది. మంగళవారంనాటి సమావేశంలో ఏం నిర్ణయాలు చేస్తారో వేచి చూడాలి.
రబీకి వద్దన్నా నీరిచ్చేశారు..?
జిల్లాలో రబీలో వరి పంట పొట్ట, ఈనిక దశలో ఉన్నప్పడు జవనరుల శాఖ సాగునీరు సక్రమంగా అందించలేకపోయింది. తీరా పంట చేతికి వచ్చాక ఈ నెల 10 వరకు సాగునీరిచ్చారు. దీంతో చాలాచోట్ల పంట పొలాల్లోకి నీరు చేరి ఇబ్బందులు ఏర్పడ్డాయి. తాళ్లరేవు మండలంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడ కీలక దళలో నీళ్లు లేక రైతు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేతికి వచ్చిన పంటను కోసుకోడానికి అవస్థలు పడ్డారు. వాస్తవంగా ఏప్రిల్ 20 నాటికి కాలువులకు నీటి సరఫరా నిలిపివేయాలి. మళ్లీ జూన్ ఒకటి నుంచి నీరివ్వాలి. ఈ పరిస్థితి లేకపోవడంతో జిల్లాలో అపరాల సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలాచోట్ల అపరాల సాగు చేయలేదు. రబీ కోతలు ముగియగానే పొలాన్ని దున్ని అపరాలు సాగు చేస్తారు. కానీ ఈ నెల 10 వరకు నీటిని సరఫరా చేయడంతో అపరాల సాగు అటకెక్కింది. దీంతో ఈ ఏడాది పెసలు, మినుములు రైతుల అవసరాలకు అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. ఇన్ని ప్రతికూలతల నేపథ్యంలో ఖరీప్ సాగును ఏవిధంగా గట్టెక్కిస్తారో చూడాలి.
జిల్లాలో వనరులు
జిల్లాలో తూర్పుడెల్టా పరిధిలోని ఆయకట్టుకు గోదావరి కాలువ, ఇతర ప్రాంతాలకు ఏలేరు, పీబీసీ, పంపా నుంచి నీరు అందుతుంది. మెట్ట ప్రాంతాల్లో బోర్లు ఆధారంగానూ సాగు చేస్తారు.
కాలువల పనులు లేనట్టే..
సాధారణంగా ప్రతి వేసవిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు గోదావరి కాలువ ఆధునికీకరణ పనులు చేపడతారు. కాలువల్లో పూడికతీత, గుర్రపు డెక్కను తొలగిస్తారు. సాగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించిన వాటికి సాంకేతిక మరమ్మతులు చేపడతారు. ఈసారి ఈ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఖరీఫ్లో శివారు ప్రాంతాలో ఏవిధంగా సాగునీరు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో గోదావరి, ఏలేరు, పీబీసీ ద్వారా ఖరీఫ్కు నీరు అందించాల్సి ఉంది. వీటిలో కాలువలకు సంబంధించిన మరమ్మతులు చేపట్టపోతే పరిస్థితి అగమ్యచోచరంగా మారే అవకాశం ఉంది.
2.60 లక్షల ఎకరాల్లో సాధ్యమేనా..?
జిల్లాలో ఏటా ఖరీఫ్ సీజన్లో 2.60 లక్షల ఎకరాల్లో వ్యవపాయ పంటలు సాగు చేస్తున్నారు. దీనిలో 2.22 లక్షల ఎకరాల్లో వరి ఉంటుంది. ఈ సారి పూర్తి ఆయకట్టుకు సాగునీరు ఇస్తారా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. నీటి లభ్యత ఆధారంగా జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈసారి ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు జరగలేదు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో తూర్పుడెల్టాకు గోదావరి నుంచి, ఇతర ప్రాంతాలకు ఏలేరు, పీబీసీ, పంపా నుంచి సాగునీరు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గోదావరిలో నీటి లభ్యత ఉన్నా.. ఎప్పటి నుంచి నీటిని విడుదల చేయాలనే మీమాంస నెలకొంది. జూన్ 15 తర్వాత నీటిని విడుదల చేయాలని జలవనరుల శాఖ ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సాగు ఏవిధంగా ఉంటుందనేది వేచి చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు