పల్లెల్లో చీకట్లు.. ప్రజలకు ఇక్కట్లు
అప్పటి వరకు ఉన్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2018 జులైతో ముగిసింది. దాంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది.
అల్లవరం మండలంలోని ఓ గ్రామంలో ఎల్ఈడీ దీపాలు పాడవటంతో సాధారణ బల్బు ఏర్పాటు చేసిన స్తంభం
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్: గ్రామ పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ దయనీయంగా మారింది. విద్యుత్తు ఆదాతో పాటు పంచాయతీలపై నిర్వహణ భారం తగ్గించేందుకు గతంలోనే స్తంభాలకు ఎల్ఈడీ దీపాలు బిగించారు. నిర్వహణ బాధ్యతలను ఇంధన సామర్థ్య సేవల సంస్థకు అప్పగించారు. ఎల్ఈడీ దీపాల వినియోగం ద్వారా ఆదా అయిన సొమ్మువాయిదాల రూపంలో లైట్లు సరఫరా చేసే సంస్థకు చెల్లిస్తే సరిపోతుందని అధికారులు అప్పట్లో చెప్పారు. కొంతకాలం పాటు సక్రమంగా నిర్వహించినా.. ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో ఇవి ఎక్కడికక్కడ మూలనపడ్డాయి. వీటి స్థానంలో తిరిగి చిన్న బల్బులు కొనుగోలు చేశారు. గతంలో వాడిన ఎల్ఈడీ దీపాలకు చేసిన ఖర్చును ప్రస్తుతం జిల్లాలోని పంచాయతీల నుంచి వైకాపా ప్రభుత్వం తీసుకుంది.
ఐదేళ్లుగా ఒక్క రూపాయి ఇచ్చింది లేదు..
ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి అధికార పీఠం ఎక్కిన తరువాత గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. రెండేళ్లుగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 14, 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా సర్పంచులు, అధికారులకు కూడా తెలియకుండా దారి మల్లించింది. దీంతో గ్రామాల్లో ఎక్కడా కనీస అభివృద్ధి అనేది లేకుండాపోయింది. వీటిలో అధిక భాగం విద్యుత్తు ఛార్జీల రూపంలో తిరిగి రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాకు జమ చేసుకుంది. మిగిలిన వాటిలో కూడా ఎల్ఈడీ దీపాల నిర్వహణ పేరుతో మరికొంత తీసేసుకుంది. దీంతో గ్రామాల్లో కనీస వసతులు కల్పించలేకపోతున్నామని సర్పంచులు వాపోతున్నారు.
నిర్వహణపై నిలువెల్లా నిర్లక్ష్యమే..
గ్రామ పంచాయతీలపై వీధి దీపాల నిర్వహణ, విద్యుత్తు బిల్లుల భారం తగ్గించాలనే ఉద్దేశంతో గత తెదేపా ప్రభుత్వం 2019లో రాష్ట్రవ్యాప్తంగా వీధి దీపాలుగా ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ చాలా చౌకగా ఉండటం, విద్యుత్తు వినియోగం కూడా పెద్దగా ఉండకపోవడంతో వీటిని వినియోగిస్తే ప్రజాధనం ఆదా అవుతుందని వీటిని ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతను ఈసీఎల్ కార్పొరేషన్, నెడ్క్యాప్ సంస్థలకు అప్పగించారు. 2019 తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వీరికి నిర్వహణ నిధులు సక్రమంగా ఇవ్వకపోవడంతో వీరు 2020లో ఇక తమ వల్ల కాదని చేతులెత్తేశారు. ఇప్పటి వరకు వైకాపా గ్రామాల్లో ఒక్క ఎల్ఈడీ బల్బుకు కూడా మరమ్మతులు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో అనేక గ్రామాల్లో చీకట్లు అలముకున్నాయి. ప్రజల బాధలు చూడలేని కొందరు సర్పంచులు సాధారణ నిధులు నుంచి ఎల్ఈడీ బల్బుల స్థానంలో మళ్లీ స్తంభాలకు సాధారణ విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు.
పాలక వర్గాల ఏర్పాటు ఇలా..
అప్పటి వరకు ఉన్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2018 జులైతో ముగిసింది. దాంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. 2019 మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చింది. కానీ పంచాయతీలకు మాత్రం ఎన్నికలు నిర్వహించలేదు. 2021 ఫిబ్రవరి వరకు రెండేళ్ల పాటు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగింది. 2021 ఏప్రిల్లో పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామాల అభివృద్ధికి పంచాయతీ ఖాతాలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయనేలేదు.
జిల్లాలో ఇలా..
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా గతంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ దీపాల నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో ప్రస్తుతం 80 శాతానికిపైగా వెలగడం లేదు. కనీస మరమ్మతులు కూడా చేయించే పరిస్థితి లేదు. వెలగని దీపాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేవారు కూడా కరవయ్యారు. ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకోవడంతో సర్పంచులుసైతం వీధి దీపాలు నిర్వహించలేని స్థితికి చేరుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఎల్ఈడీ దీపాలు వెలగని కొన్నిచోట్ల చిన్న బల్బులు ఏర్పాటు చేశారు. వీటి నుంచి సరిపడా వెలుతురు రాక గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంపు గ్రామాలను పరిశీలించిన కలెక్టర్
[ 27-07-2024]
భారీ వర్షాలతో వరద నీటిలో ఉన్న అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం గ్రామాలను కలెక్టర్ మహేశ్ కుమార్ శనివారం పరిశీలించారు. -
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
[ 27-07-2024]
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్