వస్తోంది.. ఆహార భద్రత రథం
మనం తింటున్న ఆహారంలో ఏది మంచిదో.. ఏది కల్తీదో తెలుసుకోగలిగితే.. ఆరోగ్యాన్నికాపాడుకున్నట్లే. ప్రజల్లో చైతన్యం, వ్యాపారులను అప్రమత్తం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది
కల్తీలను కనిపెట్టి..ప్రజలకు అవగాహన
సంచార వాహనాన్ని పరిశీలిస్తున్న ఏఎఫ్సీ శ్రీనివాస్ తదితరులు
మనం తింటున్న ఆహారంలో ఏది మంచిదో.. ఏది కల్తీదో తెలుసుకోగలిగితే.. ఆరోగ్యాన్నికాపాడుకున్నట్లే. ప్రజల్లో చైతన్యం, వ్యాపారులను అప్రమత్తం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలోనే ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ద్వారా రాష్ట్రంలో తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడలో ఆయా వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సంచార వాహనం ఉమ్మడి జిల్లాలో నగరాలు, పట్టణాలు, సంతలు తదితర ప్రాంతాల్లో షెడ్యూలు ప్రకారం తిరుగుతుంది.
-ఈనాడు, కాకినాడ
ఇదీ సమస్య
ఫాస్ట్ఫుడ్ సెంటర్లు.. హోటళ్లలో మనం తింటున్న ఆహారంలో నాణ్యత ఎంత అన్నది ప్రశ్నార్థకమే. కొందరు వాడిన నూనె మళ్లీమళ్లీ వాడేస్తున్నారు.. రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసాహారానికి మితిమీరిన రంగులు పూసి.. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.
ఇదిగో పరిష్కారం
ఉమ్మడి జిల్లాలో ఒక్కరే ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండడంతో సమర్థ పర్యవేక్షణ సాధ్యపడటం లేదు. క్షేత్రస్థాయిలో ఆహార పదార్థాల నాణ్యత పరీక్షలు, ప్రజల్లో చైతన్యం నింపేందుకు భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ‘ఈట్ రైట్ ఇండియా’లో భాగంగా ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ పేరుతో సంచార వాహనాలు అందుబాటులోకి తెచ్చింది.
వాహనాన్ని నిర్దేశిత ప్రాంతంలో నిలిపి అక్కడ సరకులు, ఆహార పదార్థాలు కొన్న వినియోగదారుల నుంచి నమూనాలు ల్యాబ్లో ఉచితంగా పరీక్షించి ఫలితాలు వెల్లడిస్తారు. ఇదే క్రమంలో కల్తీలు, నాసిరకం ఆహార పదార్థాలతో అనర్థాలు వివరిస్తూ.. వినియోగదారులను చైతన్య పరుస్తారు. అవకతవకలు గుర్తించిన అంశాలపై వ్యాపారులను అప్రమత్తం చేస్తారు.
ఏం పరీక్షిస్తారంటే..
- టీపీసీ మీటర్ ద్వారా నాసిరకం నూనెలను గుర్తిస్తారు. నూనె ఎక్కువసార్లు మరిగిస్తే.. అందులో టోటల్ పోలార్ కాంపౌండ్స్(టీపీసీ) తీవ్రత 25 శాతానికి మించితే విషతుల్యం అవుతుంది. సంచార ల్యాబ్ ద్వారా నాసిరకం నూనెల వాడకాన్ని నియంత్రించే దిశగా అవగాహన కల్పిస్తారు. రిఫ్రాక్టో మీటర్ ద్వారా సోయా, చిల్లీ, టమాటా సాస్ నాణ్యత ప్రమాణాల పరీక్షలకు వీలుంటుంది.
- మిల్కో టెస్టర్ యంత్రం ద్వారా పాలలో కొవ్వు శాతం, ప్రొటీన్లు, ఇతర నాణ్యత పరీక్షించి అప్రమత్తం చేస్తారు. ్ల్వ) ఆహార పదార్థాల్లో మితిమీరిన రంగుల వాడకాన్నీ గుర్తించి ప్రజలను, వ్యాపారులను అప్రమత్తం చేస్తారు.
అప్రమత్తం చేసేలా సేవలు
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ఈ వాహన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఎనలిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్, డ్రైవర్ను కేటాయించాల్సి ఉంది. ఆహార పదార్థాల కొనుగోలులో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తాం.
-బి.శ్రీనివాస్, సహాయ నియంత్రికులు, ఆహార భద్రత ప్రమాణాల శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంపు గ్రామాలను పరిశీలించిన కలెక్టర్
[ 27-07-2024]
భారీ వర్షాలతో వరద నీటిలో ఉన్న అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం గ్రామాలను కలెక్టర్ మహేశ్ కుమార్ శనివారం పరిశీలించారు. -
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
[ 27-07-2024]
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్