మేల్కోకుంటే.. ముప్పే!
జిల్లాలో రక్తం, ప్లేట్లెట్ నిల్వలు తరిగిపోతున్నాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్ మినహా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత తీవ్రంగా ఉంది.
జిల్లాలో అరకొరగా రక్త, ప్లేట్లెట్ల నిల్వలు
జీజీహెచ్లో రక్తం నిల్వచేసే యంత్రాలు
న్యూస్టుడే, రాజమహేంద్రవరం వైద్యం: జిల్లాలో రక్తం, ప్లేట్లెట్ నిల్వలు తరిగిపోతున్నాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్ మినహా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత తీవ్రంగా ఉంది. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, శస్త్రచికిత్సలు, ప్రసవాలు సమయంలో రోగులకు కచ్చితంగా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో క్యాన్సర్ రోగులు పెరిగిన నేపథ్యంలో రేడియేషన్ సమయంలో వారికి ప్లేట్లెట్లు, రక్తం ఎక్కించాల్సి పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి. దానికితోడు వర్షాల నేపథ్యంలో విషజ్వరాల వ్యాప్తి పెరిగితే ప్రస్తుత నిల్వలు ఏమాత్రం సరిపోవు. గతంలో డెంగీ, మలేరియా వ్యాపించి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం ఇప్పటివరకు ఈ ఏడాది నిల్వలు సరిగాలేవు. దాతలు సైతం ముందుకు రాకపోవడం, శిబిరాల నిర్వహణ అంతగా లేకపోవడంతో కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. గతేడాది పరిస్థితులు పునరావృతం కాకుండా స్వచ్ఛంద సంú్థ£లు, అధికారులు దాతలను ప్రోత్సహించి రక్తనిల్వలు పెంచేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుంటే ముప్పు తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ ప్రస్తుత పరిస్థితి..
రాజమహేంద్రవరం జీజీహెచ్లో రక్తనిల్వ కేంద్రం ఉంది. ఇందులో 1,200 యూనిట్ల రక్తాన్ని నిల్వచేసే సామô్థ¢్యం ఉంటుంది. సర్వజన ఆసుపత్రిగా మారిన తరువాత నెలకు 500 నుంచి 600 యూనిట్ల వరకు రక్తం రోగులకు ఎక్కిస్తున్నారు. విషజ్వరాల వ్యాప్తి పెరిగితే రెట్టింపు వినియోగం ఉండే అవకాశం ఉంది. కొవ్వూరు, నిడదవోలు, గోకవరం, అనపర్తి, కడియం ఆసుపత్రుల్లో నిల్వ కేంద్రాలున్నాయి. వీటిలో రక్త సేకరణ చేసి రాజమహేంద్రవరం జీజీహెచ్కు పంపుతారు. అనంతరం దానికి పరీక్షల తరువాత ఆయా కేంద్రాల అవసరాలకు అనుగుణంగా అందజేస్తున్నారు. ప్రస్తుతానికి 96 యూనిట్ల రక్తం, 19 యూనిట్ల ప్లేట్లెట్లు అందుబాటులో ఉన్నాయి. రోగాల వ్యాప్తి మొదలైతే ఇది ఎంతమాత్రం సరిపోయే పరిస్థితి ఉండదు.
ప్రైవేటులోనూ కొరతే..
రాజమహేంద్రవరం నగరంలో సుమారు ఎనిమిది ప్రైవేటు రక్తనిల్వ కేంద్రాలున్నాయి. ప్రస్తుతం ప్లేట్లెట్ల వినియోగం లేకపోయినా రక్తం కొరత తీవ్రంగా ఉంది. వేసవి నేపథ్యంలో రక్తం ఇవ్వడానికి ముందుకు రాకపోవడం, కళాశాలలకు సెలవులు, ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా శిబిరాల నిర్వహణ లేదు. దీంతో కొరత వేధిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు ఆయా నిల్వ కేంద్రాల్లోని రక్తం ఏదోలా సర్దుబాటు చేస్తున్నా ప్రైవేటులో మాత్రం ఆందోళన తప్పడం లేదు.
పెంచుకోకపోతే ఇబ్బందే..
గతేడాది డెంగీ విజృంభించి ప్లేట్లెట్ల కోసం రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతానికి ప్లేట్లెట్లు కొరత పూర్తిస్థాయిలో లేకున్నా రక్తం కొరత ఉంది. గతేడాది అవసరాన్ని బట్టి ఒక్కో ప్యాకెట్ ప్లేట్లెట్లు రూ.10 వేలు కూడా వెచ్చించి కొనుగోలు చేసుకున్న పరిస్థితులున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో పెరిగిన ఉష్ణోగ్రతలతో పాటు ఎన్నికల కారణంగా దాతలు ముందుకు రాలేదు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిల్వ కేంద్రాల్లో నిల్వలు బాగా తక్కువగా ఉన్నాయి. జీజీహెచ్లో ఫర్వాలేదనిపించినా.. ఈ నెల చివరి నాటికి తగ్గిపోయే అవకాశముంది. మిగతాచోట్ల పూర్తిగా అయిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం