లాకులు.. లీకులు
పంట చేలకు సాగు నీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో.. ఆ కాలువల ద్వారా వచ్చే నీరు.. భూములకు సక్రమంగా చేరడానికి.. సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం.
పత్తాలేని పంట కాలువల నిర్వహణ
పెచ్చులూడి ప్రమాదకరంగా లొల్ల లాకులు
పంట చేలకు సాగు నీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో.. ఆ కాలువల ద్వారా వచ్చే నీరు.. భూములకు సక్రమంగా చేరడానికి.. సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం. నిర్వహణను అయిదేళ్లుగా గాలికి వదిలేశారు. ఉమ్మడి జిల్లాలో గోదావరి డెల్టా పరిధిలో కాలువల నిర్వహణ అధ్వానంగా ఉంది. రబీ సాగు ముగిసిన తరువాత కాలువలు, లాకులు, షట్టర్లు, ఇతర నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్టుడే, ముమ్మిడివరం, మామిడికుదురు, ఆత్రేయపురం, పి.గన్నవరం: సాధారణంగా ఏటా క్లోజర్ సమయంలో లాకులు, షట్టర్ల తలుపులకు ఆయిల్పూసి తుప్పు పట్టకుండా రంగులు వేస్తారు. తలుపులు సులభంగా నిర్వహించేందుకు వీలుగా అక్కడి పరికరాలకు గ్రీజు పూస్తారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అయిదేళ్లుగా ఈ పనులు చేపట్టిన దాఖలాలు లేవు. గతానికి భిన్నంగా ఎన్నడూ లేనివిధంగా అధికారులు మే 10 వరకు కాలువలకు నీటి విడుదల చేశారు. జూన్ 1న ఖరీఫ్కు నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. 20 రోజుల్లో కనీస పనులు చేసే అవకాశం లేదు.
ముమ్మిడివరం: అన్నంపల్లి వద్ద తలుపులు ఛిద్రమై..
అమలాపురం - బొబ్బర్లంక ప్రధాన పంట కాలువకు సామర్థ్యానికి మించి వచ్చే నీరు(సర్ప్లస్ వాటర్) గోదావరిలోకి మళ్లేందుకు ముమ్మిడివరం మండలం అయినాపురం వద్ద వియర్ నిర్మించారు. నీటి సామర్థ్యం పెరిగినపుడు షట్టర్ల ద్వారా గోదావరిలోకి జలాలు విడుదల చేయాలి. సర్ప్లస్ వాటర్ షట్టర్లు నుంచి నీరు లీకవడం.. మురుగు కాలువలోకి ఓవర్ ఫ్లోతో వర్షాకాలంలో సుమారు 800 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి.
రూ.57 కోట్లతో ప్రతిపాదనలున్నా...
గోదావరి మధ్యడెల్టా పరిధిలో సుమారు 2 లక్షల ఆయకట్టు ఉండగా ఆత్రేయపురం మండలం లొల్ల వద్ద ఉన్న హెడ్ లాకుల వ్యవస్థ కీలకమైంది. ఇక్కడి నిర్మాణాలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నా కనీస నిర్వహణ చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. మూడు హెడ్ లాకుల ఆధునికీకరణకు మూడేళ్ల క్రితం రూ.54 కోట్లతో అంచనాలు సిద్ధం చేయగా.. ఆ మొత్తం నేడు రూ.57.78 కోట్లకు పెరిగింది. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నా మోక్షం లేదు.
సోమిదేవరపాలెం వద్ద తలుపులకు తుప్పు
లొల్ల హెడ్ లాకుల నుంచి కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో ఉన్న మైనర్ లాకుల వరకు నిర్వహణ లేక లీకులు ఏర్పడుతున్నాయి. బొబ్బర్లంక పల్లంకుర్రు ప్రధాన పంట కాలువ పరిధిలో అయినవిల్లిలంక, ముక్తేశ్వరం, అన్నంపల్లి, కుండలేశ్వరం, పల్లంకుర్రు ప్రాంతాల్లో లాకులున్నాయి. ముమ్మిడివరం మండలం మాగాం-అయినాపురం పంట కాలువకు సోమిదేవరపాలెం వద్ద ఉన్న లాకుల తలుపులు పూర్తిగా పాడైపోయాయి. అంబాజీపేట మండలం ముక్కామల లాకులు నిర్వహణలేక శిథిల స్థితికి చేరాయి.
శిథిలావస్థలో బ్యాంక్ కెనాల్
లొల్ల వద్దనున్న బ్యాంక్ కెనాల్ లాకుల నుంచి ముక్తేశ్వరం కెనాల్ ద్వారా సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ లాకులు పూర్తి శిథిలావస్థకు చేరాయి. షట్టర్లు, రాడ్లకు ఆయిల్, గ్రీజ్ పూయకపోవడం వల్ల తుప్పు పట్టాయి.
్ర పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గం పరిధిలోని మొండెపు లంక, మండలంలోని పొదలాడ, శివకోడు, సఖినేటిపల్లి లాకులు అధ్వానంగా ఉన్నాయి. నావిగేషన్ కెనాళ్ల వద్ద కనీస నిర్వహణ లేక వాటి తలుపులకు భారీ రంధ్రాలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్నాయి. షట్టర్లు, స్క్రూగేజీ తదితర సామగ్రి తుప్పుపట్టాయి.
కూలుతున్నా కళ్లుతెరవరేం?
మామిడికుదురు మండలంలో అయిదున్నర దశాబ్దాలనాటి అవుట్ ఫాల్ స్లూయిస్లు శిథిలమైనా అధికారుల్లో కనీస చలనం లేదు. గత నవంబరు 10న వాడబోది స్లూయిస్పై లోడు ట్రాక్టర్ వెళ్తుండగా స్లాబు కొంతమేర కూలింది. వీటి పరిధిలో సుమారు 1300 ఎకరాల ఆయకట్టు ఉండగా, ఏటా ముంపు సమస్య తప్పడం లేదు. వీటి పునర్నిర్మాణానికి రూ.4.28 కోట్లు, బచ్చలబందకు రూ.2.45 కోట్లు, కడలి స్లూయిస్కు రూ.4.25 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపినా అవి దస్త్రాలకే పరిమితమయ్యాయి.
కడియం వద్ద ఇదీ పరిస్థితి..
తూర్పు డెల్టా ప్రధాన కాలువ వేమగిరి, ధవళేశ్వరం, కడియం, రాజవోలు మీదుగా 12.02 కి.మీ ప్రవహిస్తోంది. ఈ పంట కాలువలోకి పంచాయతీ కాలువల ద్వారా వ్యర్థ జలాలు, గృహ, వాణిజ్య సముదాయాల వ్యర్థాలు కలుస్తుండడం సమస్యగా మారింది. కడియం వద్ద ఉన్న లాకులు తలుపులు శిథిలమయ్యాయి. మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినా ఫలితం శూన్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం