అన్నిటికీ వారే.. అందే భృతి అరకొరే..!
ఇంటింటికీ తిప్పారు. సర్వే చేయించారు. ఎన్నికల స్లిప్పులు పంపిణీ చేశాం. చివరికి సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అహర్నిశలు శ్రమించాం.
చెల్లింపులెన్నడోనని బీఎల్వోల ఎదురుచూపులు
ఇంటింటికీ తిప్పారు. సర్వే చేయించారు. ఎన్నికల స్లిప్పులు పంపిణీ చేశాం. చివరికి సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అహర్నిశలు శ్రమించాం. కానీ మాకు ఇవ్వాల్సిన గౌరవ భృతి మాత్రం పూర్తి స్థాయిలో విడుదల చేయడం లేదు.
అమలాపురం నియోజకవర్గంలోని ఓ బూత్ స్థాయి అధికారి(బీఎల్వో) ఆవేదన ఇది.
న్యూస్టుడే, అమలాపురం గ్రామీణం: జిల్లాలో ఎన్నికల విధుల నిర్వహణలో నిరంతరం సేవలందించిన బీఎల్వోలకు గౌరవ భృతికోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వీఆర్వోలతోపాటు సచివాలయ సిబ్బంది బీఎల్వోలుగా గతం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ గౌరవ భృతి అరకొరగా అందడంపై ఆవేదన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిస్తున్న తరుణంలోనైనా తమపై కరుణ చూపాలని వారు వేడుకొంటున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇలా.. జిల్లాలో అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 1,499 మంది బీఎల్వోలుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో అంగన్వాడీ, ఆశా, పురపాలిక ఉద్యోగులకు బీఎల్వో విధులు అప్పగించారు. వీఆర్వోలతోపాటు సచివాలయ వ్యవస్థ రావడంతో ఎంపిక చేసిన సచివాలయ సిబ్బందికి ఈ సారి ఆ బాధ్యతలు అప్పగించారు.
విధులెన్నో..
బీఎల్వోలతో ఇంటింటా ఓటరు సర్వే చేయించారు. ఆ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా, సవరణ, ప్రత్యేక శిబిరాలు, అవగాహన సదస్సుల నిర్వహణ, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, గుర్తింపు పత్రాల పంపిణీ కార్యక్రమాలు చేయించారు. గ్రామాంతరం వెళ్లిన ఓటర్ల గుర్తింపు, మృతులు, కొత్త ఓటర్ల చిరునామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించారు. ఇదంతా ఒక ఎత్తైతే.. పోలింగ్ ప్రక్రియలో వీరే కీలకపాత్ర పోషించారు. ఇన్ని విధులు చేపట్టినా గౌరవ భృతి అందకపోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు.
తమకొచ్చేది అరకొరైనా.. సొంతంగా ఖర్చు..!
తమకు ఒక్కొక్కరికీ గౌరవ భృతిగా నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6000 చెల్లించాలనే నిబంధన ఉన్నట్లు బీఎల్వోలు చెబుతున్నారు. అధికారుల నుంచి మాత్రం ఈ విషయంలో స్పష్టత కనిపించడం లేదు. ఏడాదిన్నరగా భృతి అందడం లేదనే వాదన వినిపిస్తుంటే.. ఇటీవల మూడు నెలలకు సంబంధించి రూ.1500 విడుదలైనట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఎన్నికల విధులు నిర్వహించే బీఎల్వోలకు ఖర్చు అధికంగానే అవుతుందని చెబుతున్నారు. ప్రధానంగా ఓటర్ల జాబితాల విషయంలో అనేక ఇబ్బందులు పడ్డామని ఆవేదనతో చెబుతున్నారు. అంతేకాదు పోలింగ్ రోజున చేతినుంచి కొంతమొత్తం ఖర్చుచేయాల్సివచ్చిందని పలువురు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడాది దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.