పారిశ్రామిక ఉల్లంఘనులు
రాజకీయం వేలు పెడితే తప్పు ఒప్పయిపోతుంది. కరెన్సీ చేతిలో పెడితే అనర్హులు అర్హులైపోతారు.. ఉమ్మడి జిల్లాలోని పరిశ్రమల శాఖలో అచ్చం ఇదే జరుగుతోంది.
ప్రోత్సాహకాల ముసుగులో రూ.కోట్లు పక్కదారి
ఉమ్మడి జిల్లా పరిశ్రమల శాఖలో అక్రమాల పర్వం
రాజకీయం వేలు పెడితే తప్పు ఒప్పయిపోతుంది. కరెన్సీ చేతిలో పెడితే అనర్హులు అర్హులైపోతారు.. ఉమ్మడి జిల్లాలోని పరిశ్రమల శాఖలో అచ్చం ఇదే జరుగుతోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పారిశ్రామిక పెట్టుబడి రాయితీలు అందించాల్సి ఉండగా.. కాసులకు కక్కుర్తిపడి, రాజకీయానికి తలొగ్గి అనర్హులకు చోటిచ్చారు.
ఈనాడు, కాకినాడ - న్యూస్టుడే, సర్పవరం జంక్షన్: రాయితీకి సంబంధించిన దస్త్రం కదలికకు రూ.2 లక్షలు తీసుకుంటూ కాకినాడ జిల్లా పరిశ్రమల శాఖ జీఎం మురళి అనిశాకు చిక్కారు. పూర్వ జిల్లా జీఎం హయాంలోనూ అక్రమాలు సాగాయని..వాటిని అడ్డుపెట్టుకుని ఈయనా లబ్ధి పొందారనే ఆరోపణలు ఉన్నాయి.
కాకినాడలోని జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయం
రూ.కోట్లకు కాళ్లొచ్చాయ్..
ఉమ్మడి జిల్లాలో 70కిపైగా పరిశ్రమల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా అడ్డదారి వ్యవహారం సాగినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.9 కోట్ల వరకు పక్కదారి పట్టినట్లు సమాచారం. ఇందులో కాకినాడ జిల్లాలోనే 40 వరకు ఉల్లంఘనలు ఉన్నాయి.
కాకినాడ నగరం, గ్రామీణం, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, తుని, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, కిర్లంపూడి, తాళ్లరేవు, శంఖవరం, తొండంగి, రంగంపేట మండలాల్లో పలు యూనిట్లకు నిబంధనలకు విరుద్ధంగా ప్రోత్సాహకాలు మంజూరుచేశారు. గతంలో పనిచేసిన జిల్లా పరిశ్రమల శాఖ అధికారి లబ్ధిపొందారన్న ఆరోపణలున్నాయి.
రాయితీల వర్తింపులోనూ అక్రమాలే
పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని..అర్హులకే లబ్ధి చేకూరుస్తున్నామని సర్కారు చెబుతుంటే.. ఉమ్మడి జిల్లా పరిశ్రమల శాఖలో పరిస్థితి అందుకు భిన్నం. సూక్ష్మ- చిన్న- మధ్య తరహా పరిశ్రమల యూనిట్ల మంజూరు, రాయితీల వర్తింపులోనూ అక్రమాలే. కమర్షియల్ వాహనాలకే రాయితీ వర్తించాల్సి ఉండగా తుంగలో తొక్కారు. పరిశ్రమలకు విద్యుత్తు ఇచ్చాకే ఉత్పత్తులకు అనుమతులివ్వాలి.అయితే డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ సర్టిఫికేట్ (డీసీపీ) ఇచ్చే పరిస్థితీ ఇక్కడుంది.
చర్యల మాటేమిటి..
పారిశ్రామిక ప్రోత్సాహకాల కుంభకోణం బయటకు పొక్కడంతో లోపాయికారీ దిద్దుబాటు చర్యలకు తెగబడ్డారు. అనర్హులకు మళ్లిన నిధుల రికవరీకి ఆపసోపాలు పడుతున్నారు. పెట్టుబడి రాయితీ మంజూరు ఉత్తర్వులు రద్దు చేయడం, విడుదల చేసిన ప్రోత్సాహకాల రికవరీలో వీరున్నారు. అక్రమాల తంతు భారీగా జరిగినా చర్యలు లేవు. అర్హత ఉన్నా అవకాశాలు అందుకోలేనివారు ఎంతోమంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే