కౌంటింగ్ కేంద్రాల్లో నియమావళి అతిక్రమిస్తే కేసులు
కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినా, ఉల్లంఘనలకు పాల్పడినా అటువంటి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు.
వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత
రాజమహేంద్రవరం కలెక్టరేట్, న్యూస్టుడే: కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినా, ఉల్లంఘనలకు పాల్పడినా అటువంటి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరికీ తెలియజేసేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్లోని వీసీ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4న ఓట్ల లెక్కింపు కోసం ఎంపిక చేసే అధికారులు, సిబ్బందిని మూడు దశల్లో సాంకేతికపరమైన విధానంలో ర్యాండమైజేషన్ చేస్తామన్నారు. ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి నన్నయ విశ్వవిద్యాలయం కౌంటింగ్ కేంద్రాల్లో 129 టేబుల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్ టేబుల్స్ సంఖ్య మేరకు ఏజెంట్లను అనుమతిస్తామన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సమాచారాన్ని ముందుగా అందజేయాల్సి ఉంటుందని, ఆ మేరకు వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నారు. నేరచరిత్ర కలిగిన, బైండోవర్ కేసులు నమోదై ఉన్న వ్యక్తులను ఏజెంట్గా నియమించకుండా అభ్యర్థులు, ఆయా రాజకీయ పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఏజెంట్ల కోసం బస్సుల ఏర్పాటు
కౌంటింగ్ ఏజెంట్ల కోసం దివాన్చెరువు తదితర ప్రాంతాల్లో షటిల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే నన్నయ విశ్వవిద్యాలయం ఆవరణలోకి ఆ రోజు ఎటువంటి వాహనాలను అనుమతించమన్నారు. రౌండ్లవారీగా లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాల వివరాల కాపీలను ఏజెంట్లకు అందజేస్తామన్నారు. వాటిని ఫారం 17సి తో నిర్ధారణ చేసుకోవాలన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో బాణసంచా వినియోగించడంపై నిషేధం విధించామని, ఫలితాల వెల్లడి తర్వాత గెలుపొందిన అభ్యర్థులు, వారి మద్దతుదారుల ద్వారా బాణసంచా వినియోగించడం, విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి జూన్ 6 వరకు అమలులో ఉంటుందని తెలిపారు.
అరగంట ముందు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
కౌంటింగ్ రోజున తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అరగంట ముందు ప్రారంభిస్తామని, అనంతరం ఈవీఎంల్లో పోలైన ఓట్లు లెక్కింపు జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు కోసం ఒక్కొక్క టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, ఒక సహాయకుడు, ఒక మైక్రోఅబ్జర్వర్ను నియమిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ఒక సహాయ రిటర్నింగ్ అధికారి ఒక సూపర్వైజర్, ఒక సహాయకుడిని నియమిస్తామన్నారు. సర్వీసు ఓటర్లకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్(ఈటీపీబీఎస్) ఓట్ల లెక్కింపునకు సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్వైజర్, సహాయకులను నియమిస్తామన్నారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత రౌండ్ల వారీగా ఆయా ఈవీఎం యూనిట్లను సురక్షితంగా తిరిగి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ తేజ్ భరత్, ఏసీపీ అనిల్కుమార్, పార్లమెంట్ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్.కృష్ణనాయక్, అభ్యర్థులు, ఏజెంట్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంపు గ్రామాలను పరిశీలించిన కలెక్టర్
[ 27-07-2024]
భారీ వర్షాలతో వరద నీటిలో ఉన్న అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం గ్రామాలను కలెక్టర్ మహేశ్ కుమార్ శనివారం పరిశీలించారు. -
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
[ 27-07-2024]
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి