logo

లారీ నడుపుతుండగా ఆగిన గుండె

లారీ నడుపుతుండగా అస్వస్థతకు గురై డ్రైవర్‌ మృతిచెందిన ఘటన దేవరపల్లి మండలంలో చోటు చేసుకుంది.

Published : 25 May 2024 03:53 IST

నరసింహులు (పాత చిత్రం) 

దేవరపల్లి: లారీ నడుపుతుండగా అస్వస్థతకు గురై డ్రైవర్‌ మృతిచెందిన ఘటన దేవరపల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లిలోని నిమ్మలపాటి దిబ్బకు చెందిన బోగిరెడ్డి నరసింహులు(57)కు భార్య, కుమారుడు, వివాహమైన కుమార్తె ఉన్నారు. ఆయనకు రెండు లారీలు ఉన్నాయి. వాటిని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం నరసింహులు లారీలో బయలుదేరారు. యర్నగూడెం వెయింగ్‌ బ్రిడ్జ్‌ వద్ద వాంతి చేసుకున్నారు. అనంతరం స్టీరింగ్‌ మీద పడిపోయారు. తోటి డ్రైవర్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. దేవరపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. గుండెపోటులతో మృతిచెంది ఉండొచ్చని ఆయన కుమారుడు సతీష్‌ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీహరిరావు తెలిపారు. ఇంటిపెద్ద దూరమవ్వడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని